News
-
NTR : అమీర్పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అమీర్పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రము
Date : 28-05-2026 - 8:18 IST -
NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ ముస్తాబైంది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని మహానేత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలను జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రాజకీయ నా
Date : 28-05-2026 - 8:09 IST -
Hawala Cash : దేవగిరి ఎక్స్ప్రెస్లో భారీ నగదు పట్టివేత.. హవాలా డబ్బుగా పోలీసుల అనుమానాం
దేవగిరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.22 కోట్ల అనుమానిత హవాలా నగదును రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రయానికుడి వద్ద నగదు పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. అ
Date : 28-05-2026 - 7:57 IST -
IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్, జోఫ్రా ఆర్చర్ ఘాటైన బౌలింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్పై 47 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కేవల
Date : 28-05-2026 - 7:45 IST -
BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్లో నానో మరియు సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేయడమే కాకుండా, యువతను ఉద్యోగాన్వేషుల నుండి ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు ఒక భారీ అడుగు పడింది. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ కళా వేదికలో ఘనంగా జరిగిన ‘ఒక కుటుంబం-ఒక వ్యవస్థాపకుడు
Date : 27-05-2026 - 9:28 IST -
Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
పరిపాలనా అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వ
Date : 27-05-2026 - 7:40 IST -
BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్
Date : 27-05-2026 - 7:23 IST -
Kerala : కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి
కేరళలో సీపీఐ-ఎం సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం సమీపంలో ఈడీ సోదాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదాలు ముగిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం వెళ్తుండగా, వాహనాలపై సీపీఐ ఎం కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఈడీ బృందానికి చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో వాహనాల అద్దాలు పగలడంతో డ్రైవర్లు, భద్రతా స
Date : 27-05-2026 - 4:59 IST -
TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు
టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన
Date : 27-05-2026 - 4:03 IST -
Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణి
మహిళలను కేవలం ఓటు బ్యాంక్గా కాకుండా సమాజానికి శక్తిగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. టీడీపీ మహానాడు–2026 కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతకు పార్టీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహిళల ఉన్నత విద్య కోసం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆడబిడ్డల విద్యకు కొత్త దా
Date : 27-05-2026 - 3:58 IST -
EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూకట్పల్లి డిపో నుంచి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, వాటిలో 545 బస్సులు హైదరాబాద్ నగర పరిధ
Date : 27-05-2026 - 3:17 IST -
Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్లో బయటపడిన షాకింగ్ లోపాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత పర్యవేక్షణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మూసాపేటలోని ఓ రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు బయటపడటంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. తనిఖీల సమయంలో వంటగది నేల జారుడుగా ఉండటం, డ్రైనేజీ వ్యవస్థలో ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, వండిన వెజ్ బిర్యానీ, అన్నం, పన్నీర్, మంచూరియా, పిండి పదార్థాలను సరైన పద్ధ
Date : 27-05-2026 - 12:47 IST -
Accident : హైదరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవర్
హైదరాబాద్ హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వ
Date : 27-05-2026 - 12:35 IST -
AP : చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు.. కలెక్టర్ హెచ్చరిక
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (PC-PNDT) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లు, ఐవీఎఫ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీసీ-పీఎన్డీటీ
Date : 27-05-2026 - 12:14 IST -
TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మహానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బైరెడ్డి శబరి జాతీయ పార్టీ నివేదికను సమర్పించారు. గత ఐదేళ్లలో ఎదురైన రాజకీయ సవాళ్లను ప్రస్తావిస్తూ.. టీడీపీ పోరాట పటిమను కొనియాడారు. “ఐదేళ్లు గొడ్డలి పార్టీని టీడీపీ ధైర్యంగా ఎదుర్కొందని.. కూటమిగా ఎన్నికలకు వెళ్లి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చే
Date : 27-05-2026 - 12:03 IST -
Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పె
Date : 27-05-2026 - 11:55 IST -
Parachute : రూ. 1 కే ‘పారాచూట్ అడ్వాన్స్డ్ ప్రోటీన్ షాంపూ’ విడుదల!
భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ మరియు మధ్యతరగతి వినియోగదారులకు ఈ ఉత్పత్తిని చేరువ చేసేందుకు మారికో అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ.1 కే లభించే
Date : 26-05-2026 - 9:04 IST -
AM/NS India : ‘ఏఎం/ఎన్ఎస్ ఇండియా’ అరుదైన రికార్డు!
భారతీయ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ 'ఆర్సెలార్ మిత్తల్ నిప్పోన్ స్టీల్ ఇండియా' (AM/NS ఇండియా) అంతర్జాతీయ ఉక్కు మార్కెట్లో
Date : 26-05-2026 - 8:44 IST -
Kavitha : వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్ బాధితులతో గవర్నర్ను కలిసిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితులతో కలిసి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మంగళవారం లోక్ భవన్లో కలిశారు. భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులు,
Date : 26-05-2026 - 2:42 IST -
YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేర్లను రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ టీడీపీపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న ప్రచారం రాజకీయ అక్కసుతో చేస్తున్నదేనని ఆమె ఆరోపించారు. దివంగతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని షర్మిల పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే గతంలో అధికారంలో
Date : 26-05-2026 - 2:32 IST -
Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?
రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై జనసేన అధిష్ఠానం దృష్టి సారించించింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సేవలను రాయలసీమలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు తర్వాత ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్ విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా జనసేన
Date : 26-05-2026 - 1:21 IST -
HYDRAA : కోకాపేటలో హైడ్రా యాక్షన్.. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. గండిపేట్ మండలం కోకాపేటలోని కొత్త చెరువు పరిధిలో హైడ్రా (HYDRAA) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ కాంపౌండ్ వాల్స్, తాత్కాలిక కట్టడాలను అధికారులు తెల్లవారుజామున జేసీబీల సహాయంతో కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టిన ఈ ఆకస్మిక ఆపరేషన్తో స్థానికంగా కలకలం రేగి
Date : 26-05-2026 - 12:56 IST -
Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న ఇందిరమ్మ చీరల సరికొత్త డిజైన్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా సంక్షేమం, సాధికారత కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త నమూనాలను అధికారికంగా ఆవిష్కరించారు. ఇందిరమ్మ చీరల పథకంలో భాగంగా ఈసారి కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల కలయికలతో చీరలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం
Date : 26-05-2026 - 12:46 IST -
IPS Officers : కోయంబత్తూరు బాలిక కేసు దర్యాప్తులో ఐపీఎస్ అధికారుల వింత ప్రవర్తన.. ముగ్గురు సస్పెండ్
కోయంబత్తూరు బాలికపై దాడి కేసులో మీడియా సమావేశం సందర్భంగా ఐపీఎస్ అధికారుల ప్రవర్తన తీరు వివాదస్పదమైంది. ఈ వివాదంలో విమర్శలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కోయంబత్తూరు జిల్లాలో 10 ఏళ్ల బాలికను అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన రాష్ట్ర
Date : 26-05-2026 - 10:51 IST -
CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర
Date : 26-05-2026 - 9:56 IST -
Telangana : తెలంగాణలో రుతుపవనాలు మరింత ఆలస్యం
నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాల కదలిక మందగించిందని.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్డి పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎల్ నినో ప్రభావం కారణంగా అవి జూన్ 5 నుంచి 10 మధ్
Date : 26-05-2026 - 9:22 IST -
ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు
న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క
Date : 26-05-2026 - 9:07 IST -
Kerala CM : నేడు ప్రధాని మోదీతో కేరళ సీఎం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయన తొలిసారి కలవనుండటంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి
Date : 26-05-2026 - 8:48 IST -
Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు
ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వంతెన వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. AP 39 TK 3741 నంబర్ గల సితార ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు ప్రయాణిస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూలిం
Date : 26-05-2026 - 8:39 IST -
Gunturu : గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతన్న వ్యక్తులు.. స్థానికుల్లో ఆందోళన
గత రెండు రోజులుగా గుంటూరులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమంది అనుమానస్పదంగా తిరుగుతుడటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది.. వీరంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో కనిపిస్తున్నారు. పగలంతా రోడ్లపై తిరుగుతూ, రాత్రిపూట స్టేషన్ దగ్గరే ఉంటున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన పురుషులు ఎక్కడివారనే దాన
Date : 25-05-2026 - 10:45 IST -
Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం, జాతీయ రహదారి 44పై చంద్రాయనపల్లి వద్ద వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక లారీ టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో, ఆ లారీ రోడ్డుపైనే ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో లారీ వెనుక వస్తున్న వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు కార్లు అతివేగంగా ఢీకొన్నాయి. అదే సమయంలో, కార్ల వెనుక నుండ
Date : 25-05-2026 - 10:33 IST -
HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత ప్రమాణాలను పర్యవేక్షించే చర్యల్లో భాగంగా సీఎంసీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు మాధాపూర్లోని ఒక రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో సిబ్బంది ఏప్రాన్లు, హెయిర్నెట్స్ ధరించి పరిశుభ్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. మరోవైపు ఆహార నిల్వలు, భద్రత విషయంలో పలు లోపాల
Date : 25-05-2026 - 9:50 IST -
AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ర
Date : 25-05-2026 - 9:29 IST -
‘Oota’ Restaurant : హైటెక్ సిటీలో ‘ఊట’ రెస్టారెంట్ ప్రారంభం!
ప్రాంతీయ మరియు సాంప్రదాయ వంటకాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ప్రముఖ రెస్టారెంట్ 'ఊట', బెంగళూరులో పదేళ్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత ఇప్పుడు హైదరాబాద్లోని ఐటీ హబ్ అయిన
Date : 25-05-2026 - 8:47 IST -
Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాని చాటారు. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) సాయంతో గుర్తించి కేవలం 25 నిమిషాల్లో క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించిన బాలిక వ
Date : 25-05-2026 - 8:18 IST -
Healthy Diet Craze : వైజాగ్లో ప్రోటీన్ ఆహారానికి పెరిగిన డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం (వైజాగ్) ఇప్పుడు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్ వినియోగ కేంద్రాల్లో ఒకటిగా మారుతోంది. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్ 'ఇన్స్టామార్ట్' విడుదల
Date : 25-05-2026 - 8:15 IST -
Murder : భర్తను హత్య చేసిన భార్య.. వడదెబ్బ అంటూ డ్రామా..!
ఇటీవల కాలంలో భార్య చేతిలో భర్తలు హత్యకు గురవుతున్నారు. వివాహేతర సంబంధాల కారణాలతోనే పలు హత్యలు జరిగిన సంగంతి తెలిసింది. తాజాగా వడదెబ్బ ముసుగులో ఓ మహిళ తన భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసు
Date : 25-05-2026 - 8:11 IST -
String Metaverse : భారీ లాభాల్లో ‘స్ట్రింగ్ మెటావర్స్’
ఈ త్రైమాసికంలోనే నికర లాభం రూ. 34.71 కోట్లుగా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు వెబ్3 టోకనైజేషన్, డిజిటల్ అసెట్స్ మరియు ఆల్గారిథమిక్ ఫైనాన్స్ వైపు వేగంగా మళ్లుతున్న తరుణంలో
Date : 25-05-2026 - 8:00 IST -
Amazon Mega Cricket Festival : అమెజాన్ మెగా క్రికెట్ ఫెస్టివల్
మే 31, 2026 వరకు లైవ్లో ఉండే ఈ 'మెగా క్రికెట్ ఫెస్టివల్' షాపింగ్లో ఒక రకంగా 'సూపర్ ఓవర్' లాంటిదని చెప్పవచ్చు. క్రీడా పరికరాలు (స్పోర్ట్స్ గేర్), అఫీషియల్ ఫ్యాన్ మర్చండైజ్, కలక్టిబుల్స్, ఫిట్ నెస్ ఉత్పత్తులు మరియు స్మార్ట్ టీవీలపై 70% వరకు భారీ తగ్గింపును అందిస్తున్నారు
Date : 25-05-2026 - 7:47 IST -
AIADMK: అన్నాడీఎంకేకు షాక్..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా
Date : 25-05-2026 - 4:34 IST -
Metro Rail: హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూరేలా కీలక ఒప్పందం కుదిరింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలో ఇరు సంస్థల ఉన్నతాధికారులు అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 20 ఏళ్ల పాటు ఊరట ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్కుమార్ దూబె, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార
Date : 25-05-2026 - 3:20 IST -
Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పందించారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోతుందని వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్
Date : 25-05-2026 - 3:07 IST -
Kumkuma Bottu: స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?
హిందువులు పసుపు, కుంకుమలను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు అయితే పసుపు కుంకుమను ఐదవతనంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన స్త్రీలు నుదుటున కుంకుమ ధరించారంటే ఆమెకు పెళ్లయిందని, భర్త ఉన్నాడని అర్థం. అందుకే పెళ్లయిన స్త్రీలు తప్పకుండా నుదుటున కుంకుమను ధరిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటన కుంకుమ ధరించాలని సాక్షా
Date : 25-05-2026 - 2:48 IST -
Sleeping With Phone: ఫోన్ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ప్రజలు మిగతావన్నీ వదిలి తమ ఫోన్లలో బిజీగా ఉంటారు. దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యం, సమయం రెండూ వృథా అవుతాయి. అంతే కాదు, తల దగ్గర ఫోన్ (Sleeping With Phone) పెట్టుకుని పడుకోవడం ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. చాలా మంది తమ ఫోన్లను దిండు దగ్గర పెట్టుకుని నిద్రపోతారు. అలా నిద్రించటం వలన అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య న
Date : 25-05-2026 - 2:10 IST -
Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్
ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్మెంట్ తీసుకున్న మాట వ
Date : 25-05-2026 - 1:21 IST -
ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్
ఓ యువకుడి స్పీడ్ మోజు చివరకు కటకటాలపాలు చేసింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన మే 19న జరిగినప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు అల్కాపూర్కు చెందిన శ్రీకరింగుల సాయిరామ్గా గుర్తించారు.
Date : 25-05-2026 - 1:19 IST -
fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తన భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ టీడీపీ లోక్సభ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తన భార్యకు వ్యక్తిగతంగా ఎలాంటి సమన్లు రాలేదని, కేవలం ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చిన నోటీసును కొందరు కావాలనే రాజకీయం చేస
Date : 25-05-2026 - 12:57 IST -
Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా నలుగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, పరిశ్రమకు మేలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో ఆయనత
Date : 25-05-2026 - 12:13 IST -
AP Liqour Scam : లిక్కర్ స్కాం కేసు.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీపేరు తెరమీదకు వచ్చింది. లిక్కర్ స్కాం కింగ్పిన్ రాజ్ కసిరెడ్డితో కేశినేని చిన్నికి సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీ నోటీసులు జారీ చేయడం టీడీపీ లో చర్చ జరుగుతుంది. ఈనెల 27న విచారణకు హాజరుక
Date : 25-05-2026 - 11:48 IST -
Stress: ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ఒత్తిడి ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను మరింత పెంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడి బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. మీరు విన్నది నిజమే… ఒత్తిడి మీ శరీరం బరువు పెరిగేందుకు కారణం అవుతుందట. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే… మన
Date : 25-05-2026 - 11:48 IST -
Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Date : 25-05-2026 - 11:18 IST -
Cannes 2026: ట్రోల్స్కు స్ట్రాంగ్ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్
తనదైన ఫైర్బ్రాండ్ మాటలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తాజాగా నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్కు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య ధరించిన డ్రెస్సింగ్పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్ క్యాన్స్ లుక్కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, ట్రోల్స్కు ఘాటుగా బద
Date : 25-05-2026 - 11:09 IST -
Donald Trump: ఇరాన్ డీల్ విషయంలో ఒప్పందానికి తొందరేం లేదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం ప్రకటించిన ఆయన, తాజాగా ఆ మాటకు భిన్నంగా మాట్లాడారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్’లో ఓ పోస్ట్ చేశారు. “చర్చలు సక్రమంగానే సాగుతున్నాయి. కానీ ఒప్పందం విషయంలో తొందరపడబోము. చ
Date : 25-05-2026 - 10:48 IST -
White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..
తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రా
Date : 25-05-2026 - 10:42 IST -
IPL 2026: ముగిసిన లీగ్ స్టేజ్.. ఎవరితో ఎవరు ఎప్పుడు తలపడనున్నారంటే?
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 లీగ్ సమరానికి తెరపడింది. ఎన్నో మలుపులు, అనూహ్య ఫలితాలతో రసవత్తరంగా సాగిన ఈ దశలో చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో గెలవడంతో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ఆశలు గల్లంతయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గ
Date : 25-05-2026 - 10:26 IST -
Stock Markets: చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం సూచీలకు జోష్ ఇచ్చింది. ఉదయం 9:16 గంటల సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 76,250 వద్ద, నిఫ్టీ 251 పాయింట్లు పెరిగి 23,970 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కు
Date : 25-05-2026 - 10:14 IST -
Telangana villages: తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.9,968 కోట్లు కేటాయించిన కేంద్రం
తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి, అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి రాష్ట్రానికి రూ.9,968 కోట్లను గ్రాంట్గా నిర్దేశించింది. ఈ నిధులను కేవలం గ్రామాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని, జీతభత్యాలు, పెన్షన్ల కోసం వాడరాదని స్పష్టమైన, కఠినమైన నిబంధనలు విధించింది. గ్
Date : 25-05-2026 - 10:07 IST -
Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో నాలుగు సార్లు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత పదిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై రూ. 2.84, లీటర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6గంటల నుంచి అమలవుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపై మరింత ప్రభావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ ర
Date : 25-05-2026 - 8:23 IST -
Vijayawada : ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శంనం దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇటు ఏపీలోని రెండో అతిపెద్ద ఆలయంగా పేరొందిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, వేసవి సెలవులు కొ
Date : 25-05-2026 - 8:06 IST -
FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఎల్ & టీ గెస్ట్హౌస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబత్పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టి) గెస్ట్హౌస్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనంలోని చాలా భాగం పూర్తిగా కాలిపోయింది. సమీపంలోని పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు చెలరేగి, ప్రమాదవశాత్తు గెస్ట్ హౌస్కు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం. భవన
Date : 25-05-2026 - 7:50 IST -
Nellore : రాజకీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె.. ఫస్ట్ ప్రెస్మీట్లోనే అదరగొట్టిన సాయివైష్ణవి
నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కీలకంగా మారబోతుంది. గత ఎన్నికల్లో నెల్లూరుజిల్లాలో టీడీపీ తన దూకుడిని ప్రదర్శించింది. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో మహిళా నాయకురాలు బరిలోకి వస్తున్నారు. తాజ
Date : 25-05-2026 - 7:39 IST -
Jawa : BSA బైక్ రైడర్లకు గుడ్ న్యూస్
క్లాసిక్ లెజెండ్స్ సంస్థ తమ జావా (Jawa), యెజ్డీ (Yezdi), మరియు బిఎస్ఏ (BSA) మోటార్సైకిల్ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది
Date : 24-05-2026 - 7:52 IST -
CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్లోని వాహనాలు తగ్గింపు
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీ హిల్స్ నివాసం నుంచి సచివాలయానికి కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు.. సాధారణంగా ఉండే కట్టుదిట్టమైన భద్రతా ఏర్
Date : 24-05-2026 - 3:37 IST -
RTC BUS Accident : చేవెళ్లలో ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు కారుని ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ తక్షణ స్పందనతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. మోహదీపట్నం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు ప్రయాణిస్తోంది. యూటర్న్ తీసుకునే సమయంలో కారును .. మల్కాపురం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కారులో ఎయిర్బ్యాగ్లు వెంటనే తెరుచుకోవడంత
Date : 24-05-2026 - 12:45 IST -
Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్ రేసర్లు హల్చల్.. పోలీసులపైకి..?
వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్లో అర్థరాత్రి బైక్, కార్ రేసర్లు హల్చల్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో అర్థరాత్రులు యువత రోడ్లపై ఖరీదైన బైక్లు, కార్లు వేసుకుని రయ్యిరయ్యిమంటూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. బైక్ , కార్లతో రేసులు పెట్టుకుని రోడ్లపై ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఐటీ హబ్ – నీలోఫర్ కేఫ్ ప్రాంతంలో యువకులు క
Date : 24-05-2026 - 12:35 IST -
Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళన.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం
చిక్కమగళూరులో రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధరలకు కొంటున్నారని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జ
Date : 24-05-2026 - 11:52 IST -
Road Accident : కోదాడ సమీపంలో లారీని ఢీకొట్టిన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలకు గురైన బస్సులు తాజాగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, కోదాడ్ పట్టణం సమీపంలో జాతీయ రహదారి 65పై ప్రవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెను
Date : 24-05-2026 - 11:34 IST -
Physical Relations: శారీరక సంబంధాలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి!
భారతదేశంలో శారీరక సంబంధాల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. కానీ చాలా మంది రహస్యంగా చదవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించి నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శారీరక జీవితాలు (Survey On Physical Relations) బయటపడ్డాయి. ఇండియానా యూనివర్శిటీకి చెందిన కిన్సే ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక నివేదికను సిద
Date : 24-05-2026 - 10:00 IST -
VIJAYAWADA : బెజవాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్
Vijayawada : బెజవాడలో థార్ కారు కేసులో ఇద్దరు యువకులను రిమాండ్కు తరలించారు. రాజకీయ అండదండలున్నప్పటికీ..
Date : 24-05-2026 - 8:27 IST -
Vastu Tips: ఆర్థిక సమస్యలు తొలగాలంటే… ఆదివారం నాడు ఇలా చేయండి..!!
మనం కోరుకోకపోయినా, జీవితంలోని ప్రతి మలుపులో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. వ్యాపార, ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ సమస్యల వల్ల జీవితంలో ప్రతికూలత పెరిగి నిరుత్సాహానికి గురవుతారు. సంతోషకరమైన జీవితం కోసం మనం రోజూ ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం. దేవుడికి సమర్పించిన పువ్వులను ఇలా చేయండి. శాస్త్రాల ప్రకా
Date : 24-05-2026 - 8:00 IST -
Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్
చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్
Date : 23-05-2026 - 5:47 IST -
Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటెంజీ విధానాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలకు కొద్దిరోజుల ముందు ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎ
Date : 23-05-2026 - 5:38 IST -
PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..
నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్య, భద్రత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ తరఫున మోదీని వైట్హౌస్కు ఆహ్వానించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా మధ్య వాణిజ్యం విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్ ఉద్రిక్తతలు కొన
Date : 23-05-2026 - 5:17 IST -
Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా
Date : 23-05-2026 - 4:51 IST -
Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్ ‘‘ఈ ఘ
Date : 23-05-2026 - 4:43 IST -
Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె చంద్రబాబు నాయకత్వం, దార్శనికతపై ప్రశంసలు కురిపించారు. సమ్మిళిత అభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి పట్ల సీఎంకు ఉన్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ప్రీతారెడ్డి తెలిపారు
Date : 23-05-2026 - 4:31 IST -
Hyderabad: ఫాస్ట్ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు
ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు (బీపీ) సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్కు చెందిన ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీ
Date : 23-05-2026 - 4:04 IST -
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్కు ప్రకాష్ రాజ్ మద్దతు
అమిత్ షా – పవన్ కళ్యాణ్ భేటీపై పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. పవన్, నాదెండ్ల మనోహర్ కలిసి జగన్ అరెస్ట్ గురించి అమిత్ షాను కోరారని, దానికి అమిత్ షా.. బాబు తాత్కాలిక మిత్రుడని, జగన్ చిరకాల మిత్రుడని అన్నట్లు నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు పెట్టడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరిం
Date : 23-05-2026 - 3:46 IST -
Relationship Tips : భార్య యొక్క ఈ ప్రవర్తన వైవాహిక జీవితం నాశనం కావడానికి కారణం కావచ్చు!
భార్యాభర్తల బంధానికి ప్రేమ, సంరక్షణ, నమ్మకం పునాది. ఇంత జరిగినా కుటుంబ కలహాలు మామూలే. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే భార్యాభర్తల చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కోసారి వైవాహిక జీవితం నాశనమైపోతుంది. వివాహానంతరం ఆ సంబంధాన్ని కొనసాగించడం భార్యాభర్తల బాధ్యత. స్త్రీలు తమ ప్రవర్తన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, ఇది వారి వై
Date : 23-05-2026 - 3:00 IST -
Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో, కలిసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ ఇంఛార్జ్లతో ఆయన ఆన్లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ
Date : 23-05-2026 - 2:50 IST -
Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే శ్రీధర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల అరవ శ్రీధర్పై రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివ
Date : 23-05-2026 - 2:34 IST -
Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున వెండితెరపై హీరోగా అడుగుపెట్టి నేటితో (మే 23) సరిగ్గా 40 వసంతాలు పూర్తయ్యాయి. 66 ఏళ్ల వయసులోనూ నవమన్మథుడిలా మెరిసిపోతూ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగ్.. ఈ ప్రత్యేకమైన రోజున సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన సినీ ప్రస్థానంలో ‘మే 23’ తేదీకి ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ సీన
Date : 23-05-2026 - 2:25 IST -
Sleeping: నేలపై కాకుండా బెడ్పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
అప్పట్లో పడుకోవాలంటే నులక మంచం లేదా పట్టి మంచాలు, లేదంటే ఆరుబయట చాప వేసుకుని నేలపై పడుకుని నిద్రించేవారు. నులక మంచం, పట్టె మంచాల పై పడుకున్నా నేలపై నిద్రించినా పెద్దగా తేడా లేకపోయేది. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఇంట్లో కూడా అత్యధిక మెత్తటి పరుపులు, దిండ్లు రావడంతో మనుషులు పూర్తిగా వీటికి అలవాటు పడిపోయారు. ఇంకా ఎంతలా మారిపోయారంటే పడుకునే సమయంలో పరుపు
Date : 23-05-2026 - 2:00 IST -
Kavya Maran: SRH ఓనర్ కావ్య మారన్ పెళ్లి
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఆమె హావభావాలు, జట్టు పట్ల చూపే అంకితభావం ఆమెకు ‘కావ్య పాప’ అనే ముద్దుపేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ సంగీత దర
Date : 23-05-2026 - 1:56 IST -
Petrol Diesel Shortage: రాష్ట్రంలో ఇంధనం, ఎల్పీజీ కొరత..?
దేశంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శనివారం స్పష్టం చేసింది. కొన్ని రిటైల్ ఔట్లెట్లలో ఇంధనం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కేవలం స్థానికంగా, తాత్కాలికంగా తలెత్తినవేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ ప్రకటనలో తెలిపింది
Date : 23-05-2026 - 1:01 IST -
Lenin: అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల..
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఆకట్టుకుంటున్న డైలాగులు ఈ టీజర్లో అఖిల్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. ‘మనోడు
Date : 23-05-2026 - 12:52 IST -
Andhra Pradesh: ఆర్టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..
ఏపీలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల పరిపాలనా వివరాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు, మసీదులు, చర్చిలు సమాచ
Date : 23-05-2026 - 12:28 IST -
Iran: ఇరాన్ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్పై ‘కొత్త దాడులు’ చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
Date : 23-05-2026 - 12:18 IST -
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్డేట్..
ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థ
Date : 23-05-2026 - 11:18 IST -
Rukmini Vasanth: బికినీలో డ్రాగన్ బ్యూటీ.. రుక్మిణి వసంత్
‘డ్రాగన్’ బ్యూటీ రుక్మిణి వసంత్కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడూ పద్ధతైన పాత్రల్లో కనిపించే ఈ కన్నడ బ్యూటీ, సడెన్గా గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్లోకి దిగుతున్న వీడియోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అక్కడ కెమెరాలు, ప్రొడక్షన్ సెటప్ ఉండటంతో ఇది ఏదైనా బ్రాండ్ షూట్ అయి ఉంటుందని కొందరు భావిస్తుంటే.. మ
Date : 23-05-2026 - 10:48 IST -
NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం
రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు వాపసు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ద్వారా సమర్పించి, రిఫండ్ పొందవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కాగా, 27లో
Date : 23-05-2026 - 10:29 IST -
Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా పురుషులు బయట ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల వారి వీర్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీర్యం నాణ్యత ఎలా దెబ్బతింటుంది? పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయాలో ఇ
Date : 23-05-2026 - 10:21 IST -
Donald Trump: ఇరాన్పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఈసారి మరింత తీవ్రంగా కమ్ముకుంటున్నట్లు సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా దాడుల గురించిన ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుత దౌత్య చర్చలు విఫలమైతే ఇరాన్పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికేలా ఒకే ఒక్క భారీ నిర్ణయాత్మక దాడి చ
Date : 23-05-2026 - 10:12 IST -
Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
భారతదేశంలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్ని పెంచేశాయి. లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచగా వాహనదారులపై భారం మరింత పెరిగింది. గత 8 రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మూడోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. ప్ర
Date : 23-05-2026 - 9:50 IST -
Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్
వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ టీడీపీ, చంద్రబాబు హయాంలోనే జరిగాయంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన.. జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ సినిమా పాత్ర గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ తాత రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో, ఆనాటి వైఎస్ కుటుంబ అరాచకాల
Date : 22-05-2026 - 5:39 IST -
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. Cockroach eating mangoes.. yummy 😜😜😜#CockroachJantaParty #justasking pic.twitter.com/8oEseWgqtF — Prakash Raj (@prakashraaj) May 22, 2026 ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ [&helli
Date : 22-05-2026 - 5:03 IST -
Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ
Date : 22-05-2026 - 4:21 IST -
APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థకు (APSFTVTDC) రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. సంస్థ ఛైర్మన్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ పంపిణీదారుడు పి. భరత్ భూషణ్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వైస్ ఛైర్మన్గా ప్రముఖ సినీ దర్శకుడు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (మెహర్ రమేష్) నియమితులయ్యారు
Date : 22-05-2026 - 3:38 IST -
APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో కొత్తగా నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరో 116 ఆలయాలకు విస్తరిస్తామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆ
Date : 22-05-2026 - 3:22 IST -
Ram Charan: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేసింది..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్యంతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రబృందం, తాజాగా అభిమానులకు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం ‘హెల
Date : 22-05-2026 - 2:44 IST