Andhra Pradesh
-
Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలోని అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్తో కీలక చర్చలు జరిపారు. మాస్కోలో స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో భేటీ అయిన లోకేష్, భారత్లో బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్ సిటీ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ముఖ్
Date : 03-06-2026 - 3:28 IST -
Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా
Date : 03-06-2026 - 3:09 IST -
TDP vs YSCP : మావిగన్ జగన్కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతి అభివృద్ధిపై వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ నిబంధనల ప్రకారం ప్లాట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి పనులు టెండర్ల ప్రకారం వేగంగా కొనసాగుతున్నాయని మ
Date : 03-06-2026 - 1:55 IST -
AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు మద్యం ప్రియుల మధ్య హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఇకపై సరికొత్త పరిమాణాల్లో 150ml మరియు 200ml మద్యం సీసాలు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త సైజుల్లో మద్యం సీసాలను తయారు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పలు ప్రముఖ లి
Date : 03-06-2026 - 1:35 IST -
CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిని భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఆరోగ్య కేంద్రంగా (గ్లోబల్ హెల్త్ హబ్) తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో హైదరాబాద్లో హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించిన విధంగానే, రాబోయే రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి చికిత్స పొందేలా వసతులను కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లల
Date : 03-06-2026 - 1:29 IST -
Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి తీవ్ర కలకలం రేపింది. గ్రామ శివారులో ఉన్న పశువుల మందపై రాత్రి వేళ ఒక్కసారిగా దాడి చేసిన పులి.. ఏకంగా 14 దూడలను పొట్టనబెట్టుకుంది. ఈ ఉదయం పశువుల కాపరులు, యజమానులు వెళ్లేసరికి దూడల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలను చూసి వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పులి సంచారంతో గంగంపాలెం, చుట్టుపక్కల
Date : 03-06-2026 - 11:50 IST -
Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్కు ఘోర రోడ్డు ప్రమాదం
‘ఢీ’ డ్యాన్స్ షో ఫేమ్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో పండు మాస్టర్ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఈవెంట్ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్
Date : 03-06-2026 - 10:22 IST -
AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప
Date : 03-06-2026 - 6:59 IST -
TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
పనిచేయకపోతే మొహమాటం లేకుండా పక్కనపెట్టేస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన వర్క్షాప్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మరోసారి అప్రమత్తం చేశారు. పనిచేసినంత కాలం పదవులకు ఇబ్బంది లేదని.. పనిచేయకపోతే పక
Date : 02-06-2026 - 5:01 IST -
AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా, నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు, క్రీడాకారుల కోసం అమల్లో ఉన్న 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కింద మొత్తం 421 ఉప
Date : 02-06-2026 - 1:16 IST -
YSRCP : కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే – సజ్జల
రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలేనని ఆరోపించారు వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. దగా, మోసం, వెన్నుపోటుకి పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్
Date : 02-06-2026 - 1:04 IST -
Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం Nandu’ s world సంచలనం
Nandu’s World Nandana నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్యాభర్తలపై కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. యూకే వీసా పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఈ జంట టార్గెట్గా పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ నందన స్పందించారు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ‘నందూస్ వరల్డ్’ (Nandus World) పేరుతో యూకేలో ఉంటున్న భ
Date : 02-06-2026 - 12:55 IST -
Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఈరోజు సాయంత్రం 4:30-5:30 మధ్య మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ పోలీసులు కనీసం దీనికైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు ఆయన నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు ని
Date : 02-06-2026 - 11:24 IST -
CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె
Date : 02-06-2026 - 8:58 IST -
NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం
అమెరికాలోని తెలుగువారికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండగలగడం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులలో చేయగల ప్రజాసేవ కంటే ప్రవాసాంధ్రులకు సేవలందించగల ఈ పదవి ఎంతో తృప్తి ఇస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన
Date : 01-06-2026 - 7:47 IST -
CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్రలపై సీఎం ఫైర్
రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్త
Date : 01-06-2026 - 4:03 IST -
TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అనగాని
నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,, విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్యకు వైసీపీతో సంబంధాలు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జంబులయ్య భార్యకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన
Date : 01-06-2026 - 3:54 IST -
Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ‘ఎయిర్ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్’ను ఏర్ప
Date : 01-06-2026 - 3:23 IST -
Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పోరంకి సుగాలి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో ముచ్చటించిన అనురాధ…
Date : 01-06-2026 - 1:27 IST -
CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గంలో పర్యటించారు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే రోజని, విధ్వంసక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన రోజుగా గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, ప్రస్తుతం కూట
Date : 01-06-2026 - 1:27 IST