News
-
Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?
పెళ్లి అంటే జీవితంలో ఒక కీలక ఘట్టం. చాలామంది ఇటీవల కాలంలో ఈ పెళ్లినే వద్దని అనుకుంటున్నారు. ఇంకొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి అన్ని మతాలు కూడా పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. వివాహ బంధం యొక్క పవిత్రతను అన్ని మతాలు చాటిచెబుతున్నాయి. ప్రత్యేకించి హిందూమతంలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. దాని ప్రాధాన్యతను చాలా
Date : 03-06-2026 - 6:00 IST -
PM Modi: జవహర్లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.
భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. జూన్ 10 నాటికి
Date : 03-06-2026 - 5:07 IST -
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకే శివకుమార్ రాజ్యాంగం చేతపట్టుకుని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగ
Date : 03-06-2026 - 5:00 IST -
CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిపోయాయని.. ప్రశాంతతను చెడగొట్టవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ.. ఇలాంటి వాటిలో కాదన్నారు. తెలంగాణకు ఎవరు ఎంత చేశారనే దానిపై అక్కడి ప్రజలకు అవగాహన ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన
Date : 03-06-2026 - 4:31 IST -
Khushboo: సీఎం విజయ్ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు
తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన భేటీ చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ సుందర్.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. తన చిన్న కుమార్తె అవంతిక వివాహ వేడుకకు సంబంధించిన లగ్న పత్రికను విజయ్కు ఖుష్బూ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా తన భర్త, కుమార్తెలతో కలిసి ముఖ్యమంత్రితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకు
Date : 03-06-2026 - 4:08 IST -
Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?
దాదాపు అందరూ గుడ్లను ఇష్టపడతారు. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, పూర్తి పోషకాహారం కూడా. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Egg Benefits) ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గుడ్లలో ఉండే ప్రోటీన్ కండరాలను నిర్మి
Date : 03-06-2026 - 4:01 IST -
Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలోని అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్తో కీలక చర్చలు జరిపారు. మాస్కోలో స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో భేటీ అయిన లోకేష్, భారత్లో బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్ సిటీ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ముఖ్
Date : 03-06-2026 - 3:28 IST -
Aditya Birla : నిజామాబాద్లో ఆదిత్య బిర్లా నూతన శాఖ ప్రారంభం!
ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ABHFL) నిజామాబాద్లో తన నూతన శాఖను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్తో తెలంగాణలో సంస్థ యొక్క మొత్తం శాఖల సంఖ్య 9కి చేరింది. స్థానిక కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా
Date : 03-06-2026 - 3:16 IST -
Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా
Date : 03-06-2026 - 3:09 IST -
Adulterated Tea Powder : కల్తీ టి పొడిని గుర్తించడం ఎలాగో తెలుసా ?
టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనల ప్రకారం.. టీ ఆకుల సహజ రూపాన్ని, బరువును, మరియు రంగును కృత్రిమంగా పెంచడానికి చేసే ప్రయత్నాలన్నీ కల్తీ కిందకే వస్తాయి
Date : 03-06-2026 - 3:00 IST -
Kuwait Airport: అమెరికా-ఇరాన్ యుద్ధం..కువైట్ ఎయిర్పోర్ట్పై దాడి
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎయిర్పోర్ట్లోని ఒక ప్యాసింజర్ టెర్మినల్ తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్పోర్ట్లోని టీ1 ప్యాసింజర్ భవనంపై ఇరాన్కు చెందిన డ్రోన్లు దాడి చేశాయి. విమానాశ్రయ భవనానికి భారీగా నష్టం వాటిల్లినట్లు కువైట
Date : 03-06-2026 - 2:41 IST -
TDP vs YSCP : మావిగన్ జగన్కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతి అభివృద్ధిపై వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ నిబంధనల ప్రకారం ప్లాట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి పనులు టెండర్ల ప్రకారం వేగంగా కొనసాగుతున్నాయని మ
Date : 03-06-2026 - 1:55 IST -
AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు మద్యం ప్రియుల మధ్య హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఇకపై సరికొత్త పరిమాణాల్లో 150ml మరియు 200ml మద్యం సీసాలు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త సైజుల్లో మద్యం సీసాలను తయారు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పలు ప్రముఖ లి
Date : 03-06-2026 - 1:35 IST -
CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిని భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఆరోగ్య కేంద్రంగా (గ్లోబల్ హెల్త్ హబ్) తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో హైదరాబాద్లో హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించిన విధంగానే, రాబోయే రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి చికిత్స పొందేలా వసతులను కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లల
Date : 03-06-2026 - 1:29 IST -
Delhi Fire Accident: ఢిల్లీ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని కాపాడారు. మాలవీయనగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల సమయంలో మంటలు చెలరేగుతున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్ని
Date : 03-06-2026 - 1:19 IST -
Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి,
Date : 03-06-2026 - 1:10 IST -
KTR: పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అయితే, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్లో సభ పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’’ అంటూ మంగళ
Date : 03-06-2026 - 12:52 IST -
Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!
మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అసలు సగం వ్యాధులకు కారణం సరైన నిద్ర లేకపోవడమే అని అంటుంటారు. మనకున్న ప్రతి సమస్య గురించి అదే పనిగా ఆలోచిస్తూ నిద్రను పాడు చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా నిద్ర సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి దాకా నిద్రలేమి సమస్య (Sleep Disorder) బాధిస్తుంది. శరీరానికి సరైన నిద్ర అనగా విశ్రాంతి ఇవ్వడం వల్
Date : 03-06-2026 - 12:34 IST -
Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే థియేట్రికల్ సినిమా ప్రస్తుత పరిస్థితిపై చేసిన కొన్ని ముక్కుసూటి వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజ మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎంతగానో అప్డేట్ అయ్యారని, సినిమా ఎంపికలో ఎంతో నిశితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా చూసేటప్పుడు అది నిజంగా ఎంటర్టైన్ చ
Date : 03-06-2026 - 12:21 IST -
Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి తీవ్ర కలకలం రేపింది. గ్రామ శివారులో ఉన్న పశువుల మందపై రాత్రి వేళ ఒక్కసారిగా దాడి చేసిన పులి.. ఏకంగా 14 దూడలను పొట్టనబెట్టుకుంది. ఈ ఉదయం పశువుల కాపరులు, యజమానులు వెళ్లేసరికి దూడల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలను చూసి వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పులి సంచారంతో గంగంపాలెం, చుట్టుపక్కల
Date : 03-06-2026 - 11:50 IST -
BCCI: హార్దిక్, రోహిత్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్తో జరగబోయే టీ20 సిరీస్కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్నెస్, సంస
Date : 03-06-2026 - 11:41 IST -
Harmanpreet Kaur: చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్ కౌర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. ఇంగ్లండ్లోని టాంటన్లో మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఆమె కెరీర్లో 368వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ క్రమంలో న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ (367 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును హర్మన్ప్రీత్ అ
Date : 03-06-2026 - 11:21 IST -
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
మహిళలకు ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో దేశీయంగా మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల పసిడి ధరల వ
Date : 03-06-2026 - 10:57 IST -
Janasena Party: తెలంగాణలో జనసేన పోటీ చేస్తాం
తెలంగాణలో ఇక నుంచి జనసేన పార్టీ ఉంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. జీహెచ్ఎంసీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కలిసి వచ్చినా రాకపోయినా.. తాము ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణలో తానే రంగంలోకి దిగి తిరుగుతానని.. ప్రతి సమస్యపైనా మాట్లాడుతానని.. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటానని కీలక వ్యాఖ్యల
Date : 03-06-2026 - 10:47 IST -
Army Pilot Proposes: ప్రియురాలి కోసం ఆర్మీ పైలట్ చేసిన పని వైరల్
మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (సీఏఏటీఎస్) ఒక అరుదైన ప్రేమ ఘట్టానికి వేదికైంది. తన పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఓ ఆర్మీ కెప్టెన్, అదే వేదికపై తన ప్రియురాలికి చేసిన రొమాంటిక్ ప్రపోజల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నప్పటికీ, కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తు
Date : 03-06-2026 - 10:37 IST -
Donald Trump: భారత్ పై ట్రంప్ సరికొత్త అస్త్రం
భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. భారతదేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు (Unfair trade practices) కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం భారత్ను దోషుల జాబితాలో చేర్చింది. ఈ పరిశీలనల ఆధారంగా భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకా
Date : 03-06-2026 - 10:28 IST -
Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్కు ఘోర రోడ్డు ప్రమాదం
‘ఢీ’ డ్యాన్స్ షో ఫేమ్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో పండు మాస్టర్ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఈవెంట్ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్
Date : 03-06-2026 - 10:22 IST -
JANASENA : పవన్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఫైర్.. ప్యాకేజీ ఇస్తే..?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జడ్యర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి
Date : 03-06-2026 - 9:04 IST -
CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
కర్ణాటక రాజకీయాల్లో షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక ఈ రోజు సాయంత్రం 6గంటలకు రాష్ట్ర కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివకుమార్, పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధారామయ్య నుంచి అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. లోక్భవన్లో జరగనున్న ఈ క
Date : 03-06-2026 - 8:10 IST -
Fraud :సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం
తక్కువ డబ్బులకు అధిక రాబడులు వస్తాయని నమ్మించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ పట్టణంలోని శ్రీరంగపురం గ్రామంలో జరిగింది. తమను దాదాపు రూ. 11 కోట్లు మోసం చేశాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో శ్రీరంగపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి అధిక వడ్డీ రేట్లు, అస
Date : 03-06-2026 - 7:19 IST -
Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 7గురు మృతి
గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందగా.. 38 మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ జిల్లా, బర్దోలి తహసీల్లో జరిగింది. వెనుక నుండి వస్తున్న నీటి ట్యాంకర్ను ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో, అది డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్ట
Date : 03-06-2026 - 7:09 IST -
AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప
Date : 03-06-2026 - 6:59 IST -
Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్
తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ వారి అయ్య జాగీరా’ అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చిందని కాదు.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని పేర్కొన్నా
Date : 02-06-2026 - 5:35 IST -
TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
పనిచేయకపోతే మొహమాటం లేకుండా పక్కనపెట్టేస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన వర్క్షాప్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మరోసారి అప్రమత్తం చేశారు. పనిచేసినంత కాలం పదవులకు ఇబ్బంది లేదని.. పనిచేయకపోతే పక
Date : 02-06-2026 - 5:01 IST -
Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా
తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన అన్నామలై మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నే
Date : 02-06-2026 - 3:46 IST -
Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్ను అంగీకరించని నటి గిరిజా ఓక్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సహనటికి సరదాగా ఓ సలహా ఇచ్చారు. ‘భారత్ భాగ్య విధాత’ అనే తమ కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగా, నటి గిరిజా ఓక్ను ఉద్దేశించి “నీ అందాన్ని ఉపయోగించి మన సినిమాను ప్రమోట్ చెయ్యి” అంటూ చమత్కరించారు. ఇటీవల ‘నేషనల్ క్రష్’గా సోషల్ మీడియాలో వైరల్ అయిన గిరిజా, ఆ ట్యాగ్పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. అసల
Date : 02-06-2026 - 3:35 IST -
Donald Trump Tariff: భారత్పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో శుభవార్త చెప్పారు. కొన్ని రకాల వ్యవసాయ, పారిశ్రామిక పరికరాలపైన దిగుమతి సుంకాలను 10 శాతం వరకు తగ్గించారు. అంతకుముందు 25 శాతంగా ఉండగా, దీనిని 15 శాతానికి తగ్గించారు. అయితే ఇది తాత్కాలిక తగ్గింపు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది 2027 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. ఒకవైపు అమెరికా-ఇరాన్
Date : 02-06-2026 - 2:50 IST -
Krunal Pandya: ఐపీఎల్లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ
Date : 02-06-2026 - 2:06 IST -
Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?
దంతాలు మానవ జీవితంలో అంతర్భాగం. నోటి ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి సంబంధించినది. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన అంశం అయినప్పటికీ, చాలా మంది దంత పరిశుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపరు. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే దీనిని అనుసరిస్తున్నారు. మీకు పంటి నొప్పి వచ్చినప్పుడు లేదా పరిస్థితి మీ అదుపులో లేనప్పుడు దంతవైద్
Date : 02-06-2026 - 2:00 IST -
Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు
భారత్లో 180 రోజులకు మించి బస చేయాలనుకునే విదేశీ పౌరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నంగా, ఇకపై 180 రోజుల గడువు ముగియక ముందే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ రూల్స్-2025కు సవరణలు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దేశంలోకి ప్రవేశించిన 180 రోజులు పూర్తయ్యాక, 14 రోజుల లోపు ర
Date : 02-06-2026 - 1:50 IST -
Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్
‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి, తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘
Date : 02-06-2026 - 1:30 IST -
AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా, నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు, క్రీడాకారుల కోసం అమల్లో ఉన్న 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కింద మొత్తం 421 ఉప
Date : 02-06-2026 - 1:16 IST -
YSRCP : కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే – సజ్జల
రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలేనని ఆరోపించారు వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. దగా, మోసం, వెన్నుపోటుకి పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్
Date : 02-06-2026 - 1:04 IST -
Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం Nandu’ s world సంచలనం
Nandu’s World Nandana నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్యాభర్తలపై కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. యూకే వీసా పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఈ జంట టార్గెట్గా పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ నందన స్పందించారు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ‘నందూస్ వరల్డ్’ (Nandus World) పేరుతో యూకేలో ఉంటున్న భ
Date : 02-06-2026 - 12:55 IST -
ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు
ఫెమా నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వేదాంత గ్రూప్కు చెందిన కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కంపెనీలో లావాదేవీలు ఫెమా నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అనే అంశాన్ని ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల సందర్భంగా సంబంధిత ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు, లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని ప
Date : 02-06-2026 - 12:35 IST -
Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!
మామూలుగా బరువు పెరగడం అన్నది చాలా ఈజీ. కానీ బరువు తగ్గడం అన్నది మాత్రం అంత సులువైన విషయం కాదని చెప్పాలి. బరువు తగ్గడం కోసం రకరకాల ఎక్సర్సైజులు చేయడం, జిమ్ లో వర్కౌట్ చేయడం, వాకింగ్ చేయడం, డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు బరువు తగ్గరు. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే బరువ
Date : 02-06-2026 - 12:18 IST -
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్
తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజనీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శ
Date : 02-06-2026 - 11:43 IST -
Minior Girl : హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య
హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోందని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా
Date : 02-06-2026 - 11:36 IST -
Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఈరోజు సాయంత్రం 4:30-5:30 మధ్య మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ పోలీసులు కనీసం దీనికైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు ఆయన నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు ని
Date : 02-06-2026 - 11:24 IST -
US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం
అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. వీరిని త్వరలో స్వదేశాలకు బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విడుదల చేసిన వివరాల ప్రకారం.. మే 11 నుంచి 15 వరకు అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్లో నిర్వహించ
Date : 02-06-2026 - 11:20 IST -
LPG Price Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. అయితే, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 42 పెరిగి రూ.3,113.50కి చేరింది. కోల్కతాలో రూ.53.50 పెరగడంతో అక్కడ ధర రూ
Date : 02-06-2026 - 10:57 IST -
Rains: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే ఈ రుతుపవనాలు, ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం ప్రకటించింది. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని
Date : 02-06-2026 - 10:45 IST -
Donald Trump: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ ఒప్పందం “శాశ్వతంగా” నిలవాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట
Date : 02-06-2026 - 10:38 IST -
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : సీఎం రేవంత్ రెడ్డి
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఇద్దరు నేతలూ ఘనంగా స్మరించుకున్నారు. పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన ప్రజా పాలనను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా.. గత పదేళ్ల బీఆర్ఎస్ పా
Date : 02-06-2026 - 10:29 IST -
Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్ మంత్రి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇళ్లలో పనిచేసి నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న కలిత మాఝీ, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చార
Date : 02-06-2026 - 10:16 IST -
Mamata Banerjee: మమతా బెనర్జీ కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర సంక్షోభంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు (టీఎంసీ) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన కీలక సమావేశం అనూహ్యంగా రద్దయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు గాను 20 మంది మాత్రమే హాజరుకావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీప
Date : 02-06-2026 - 10:08 IST -
Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్ భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తొలి విడతగా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డీమార్ట్ తరహా మహిళా శక్తి సూపర్ బజార్లను, అలాగే ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, రైస్మిల్లును ఏర్పాటు చేయనున్నారు. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. అందుకు అవసరమైన భూసేకరణ కోసం జిల
Date : 02-06-2026 - 9:44 IST -
Annamalai: బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై పార్టీని వీడి సొంత రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. జూన్ 15వ తేదీలోగా ఆయన తన కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిణామాలపై చర్చించేందుకు ఆయన నిన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Date : 02-06-2026 - 9:21 IST -
CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె
Date : 02-06-2026 - 8:58 IST -
BRS : బాల్కా సుమన్కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు
సింగరేణి సంస్థలకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్కు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన పలు అభియోగాలను నాంపల్లి కోర్టు కొట్టివేస్తూ.. రెండు సెక్షన్ల కింద మాత్రమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. బీఎన్ఎస్ సెక్షన్లు 152, 353(1)(బి) మాత్రమే ఈ కేసుకు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం (PDPP Act)తో పాటు పోలీసు
Date : 02-06-2026 - 8:33 IST -
HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నగరంలోని బెల్టుషాపులపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆయప దాడులు నిర్వహించారు. స్థానిక మహిళలు, కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు అర్థరాత్రి స్వయంగా అక్కడికి వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగించారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో విచ్చలవిడిగా బె
Date : 02-06-2026 - 8:02 IST -
JSP : హైదరాబాద్లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార
Date : 01-06-2026 - 7:53 IST -
NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం
అమెరికాలోని తెలుగువారికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండగలగడం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులలో చేయగల ప్రజాసేవ కంటే ప్రవాసాంధ్రులకు సేవలందించగల ఈ పదవి ఎంతో తృప్తి ఇస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన
Date : 01-06-2026 - 7:47 IST -
Cockroach Janata Party: భారత్కు రానున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ పరీక్షల వివాదాలు దేశంలో చర్చనీయాంశంగా మారిన వేళ సరికొత్తగా ఆవిర్భవించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనలు చేపట్టడానికి తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ఎయ
Date : 01-06-2026 - 5:51 IST -
Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి
ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ… తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన గర్భస్రావానికి సీఎం విజయ్ పరోక్షంగా కారణమంటూ ఆమె వ్యాఖ్యానించారు. జల్లికట్టు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన జూలీ, ఇటీవల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానుల
Date : 01-06-2026 - 4:45 IST -
CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్రలపై సీఎం ఫైర్
రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్త
Date : 01-06-2026 - 4:03 IST -
Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్.. విమానం యూటర్న్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అమెరికాలో ఒక ప్రయాణికుడు తన బ్లూటూత్ పరికరానికి సరదాగా పెట్టిన పేరు పెను కలకలం సృష్టించింది. ‘బాంబ్’ అనే పేరుతో సిగ్నల్ కనిపించడంతో, స్పెయిన్కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీది నుంచి వెనక్కి తిరిగివచ్చి, అమెరికాలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం 190 మంది ప్రయాణికులతో న్యూజెర్సీలోన
Date : 01-06-2026 - 3:55 IST -
TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అనగాని
నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,, విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్యకు వైసీపీతో సంబంధాలు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జంబులయ్య భార్యకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన
Date : 01-06-2026 - 3:54 IST -
Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ‘ఎయిర్ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్’ను ఏర్ప
Date : 01-06-2026 - 3:23 IST -
Ponnam prabhakar: పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం
హైదరాబాద్లో జనసేన అధినేత, ఏపీ పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్య
Date : 01-06-2026 - 3:02 IST -
Back To School: బ్యాక్ టు స్కూల్.. పాఠశాలకు వెళ్లమని మీ పిల్లలు మారం చేస్తే..!
2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నాయి. పిల్లలు సరదాగా సెలవులను ముగించుకుని పాఠశాలకు వెళ్తున్నారు. ఇంతకాలం తల్లిదండ్రులతో కలిసి గడుపుతున్న పిల్లలకు బడి మొదలవుతుందంటే ముఖం పాలిపోతుంది. అందుకే, ఉదయం లేవగానే బడికి వెళ్లొద్దని పట్టుబట్టే పిల్లలు చాలా మంది ఉన్నారు. కొత్త పాఠశాలలైతే పిల్లలు జ్వరం, తలనొప్పితో పాఠశాలలకు వస్తూనే ఉన్నారు. కాబట్
Date : 01-06-2026 - 2:26 IST -
BJP : సువేందు అధికారి కేబినెట్లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారీ మంత్రివర్గ విస్తరణ చేపట్టగా, సోమవారం 35 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో రాష్ట్ర మంత్రివర్గ బలం 41కు చేరుకుంది. అవినీతి నిరోధం, మహిళ
Date : 01-06-2026 - 1:45 IST -
Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పోరంకి సుగాలి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో ముచ్చటించిన అనురాధ…
Date : 01-06-2026 - 1:27 IST -
CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గంలో పర్యటించారు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే రోజని, విధ్వంసక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన రోజుగా గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, ప్రస్తుతం కూట
Date : 01-06-2026 - 1:27 IST -
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ రోజు సిట్ ఎదుట హాజరుకానున్నారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన తొలి ప్ర
Date : 01-06-2026 - 1:20 IST -
South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రారంభం
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలో జోన్ కార్యకలాపాలను వీఎంఆర్డీఏకు చెందిన ‘డెక్’ భవనంలో ప్రారంభించారు. జోన్కు కేటాయించిన జనరల్ మేనేజర్, ఇతర అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు విశాఖలోనే ఉన్నారు. వాస్తవానికి మే 5న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. జీఎంతో పాటుగా అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది విశాఖ వచ్చి కార్యాలయం నుంచి విధుల నిర్వహ
Date : 01-06-2026 - 1:08 IST -
AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్
డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నాయకత్వం కోర్టుల్లో వందలాది కేసులు వేసిందని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, జాబ్ క
Date : 01-06-2026 - 1:05 IST -
Rahul Gandhi: సీబీఎస్ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ బోర్డుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12వ తరగతి డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే విద్యా
Date : 01-06-2026 - 12:53 IST -
TTD Admissions 2026: టీటీడీ సంగీత, నృత్య అడ్మిషన్లు దరఖాస్తులకు ఆహ్వానం
టీటీడీ సంగీతం, డ్యాన్స్ నేర్చుకోవాలనుకునేవారికి అద్భుత అవకాశం కల్పిస్తోంది. జూన్ 3వ తేదీ నుంచి తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మరియు నాదస్వర పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు కోసం రూ.50/- చెల్లించాలని టీటీడీ స
Date : 01-06-2026 - 12:40 IST -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!
ఈ ఏడాది ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్లు ఆడి 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఒక సెంచరీతో పాటు ప్లే ఆఫ్స్లో 97, 96 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్వాలిఫైయర్ 2లో గుజరాత్పై ఆడిన ఇన్నింగ్స్కి లెజెండరీ క్రికెటర్లంతా ఫిదా అయ్యారు. 15 ఏళ్ల వయస్సులోనే ఇంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఎలా ఆడాడంట
Date : 01-06-2026 - 12:21 IST -
Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు తొలి మహిళా బాధితురాలిని తానేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అనుసరించిన నిరంకుశ విధానాలనే, నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తోందని, అరాచకాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్
Date : 01-06-2026 - 11:57 IST -
GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు
రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాల వెనుక వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ… విగ్రహాన్ని కూల
Date : 01-06-2026 - 11:47 IST -
War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..
మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ పొడిగింపు కోసం దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేడెక్కాయి. అమెరికా, ఇరాన్ బలగాలు గత వారాంతంలో డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ దూకుడుకు ప్రతిగా ‘ఆత్మరక్షణ దాడులు’ జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించగా, ఇది తమపై జరిగిన దాడికి ప్రతీకార చర్యేనని ఇరాన్ స్పష్టం చే
Date : 01-06-2026 - 11:13 IST -
Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్ కార్పొరేషన్ తాగునీటి సమస్యకు చెక్ పెట్టే పనిలో ఉంది. 24 గంటలూ నీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.393 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. భవిష్యత్ అవసరాలను కూడా గుర్తించి అందుకు తగిన విధంగా ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్ర
Date : 01-06-2026 - 11:02 IST -
Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?
మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ రావడం అనేది సహజం. ఈ పీరియడ్స్ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కడుపునొప్పి తో పాటు నీరసంగా అనిపించడం, అలాగే శరీరంలో రకరకాల మార్పుల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. మరి ముఖ్యంగా ఎక్కువ మందిని వేధించే సమస్య కడుపునొప్పి. ఈ నొప్పితో విలవిల్లాడుతుంటారు. ఆ సంగతి పక్కన పెడితే, చాలా మంది తెలిసి తెలియక పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు త
Date : 01-06-2026 - 10:39 IST -
Virat Kohli: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ జోష్ఫుల్ డ్యాన్స్
అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ఘన విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. వరుసగా రెండో కప్పును తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో సాధించిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత.. పిచ్పై ఎంత హంగామా జరిగిందో, అంతకు మించిన అసలైన సెలబ్రేషన్స్ ‘ఆఫ్టర్ పార్టీ’లో ఆవిష్కృతమయ్యాయి. కెప్టెన్ రజత్ పట
Date : 01-06-2026 - 10:27 IST -
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారుల కోసం సరికొత్త ఆరోగ్య పథకాన్ని ఈ జూన్ నెల నుంచే అమలు చేయడానికి సన్నద్ధమైంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎంప్లాయ్ హెల్త్కేర్ ట్రస్ట్ ఏర్పాటు కానుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ వైద్య సేవలు అందనున్నాయి. మార్గదర్శకాల ఖరారు కోసం సీఎస్ కె.రామకృష్ణారావు సోమవారం ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలత
Date : 01-06-2026 - 10:13 IST -
Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన
తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రానికి అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం నెలకొంది. జూన్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా వడగాల్పుల
Date : 01-06-2026 - 9:39 IST -
Talliki Vandanam : తల్లికి వందనంపై కీలక అప్డేట్
ఏపీలో ప్రభుత్వం స్కూల్, ఇంటర్ విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద డబ్బులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగానే అర్హుల జాబితాలను సిద్ధం చేసింది. విద్యార్థులు అర్హుల జాబితాను చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేక వెబ్పోర్టల్ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులా కాదా, అసలు పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత
Date : 01-06-2026 - 9:24 IST -
HYD : ఐపీఎల్ సంబరాలు.. హైదరాబాద్లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. దీంతో పోలీసులు అభిమానులపై లాఠీ ఝులిపించారు. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ జట్టు విజయంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి గుమిగూడారు. ఈ సంబరాల సమయంలో, అభిమానులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, ట్రాఫిక్కు అంతరాయం కలిగిం
Date : 01-06-2026 - 9:22 IST -
IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్
పద్దెనిమిదేళ్లు.. ఒకే ఒక్క టైటిల్ కోసం ఆ జట్టు పడ్డ తపన, అభిమానులు ఎదురుచూసిన నిరీక్షణ అంతా ఇంతా కాదు. కానీ, గెలిచిన టైటిల్ను తిరిగి నిలబెట్టుకోవడానికి వారికి పట్టిన సమయం మాత్రం కేవలం పన్నెండు నెలలే! అవును, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత లీగ్లో తమకంటూ ఒక తిరుగులేని సామ్
Date : 01-06-2026 - 9:01 IST -
IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే
15 ఏళ్ల కుర్రాడు.. ఐపీఎల్ 2026 సూపర్ స్టార్గా నిలిచాడు. అతనే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. తనదైన శైలిలో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కు చేరుకోలేకపోయినా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ ఓడిపోవడంతో
Date : 01-06-2026 - 8:58 IST -
GT : గుజరాత్ టైటాన్స్ టీమ్కు తప్పిన పెనుప్రమాదం
ఐసీఎల్ ఫైనల్లో ఓటమితో నిరాశ చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్కు తిరిగి వెళ్తుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో జట్టు సభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఆటగాళ్లను, సిబ్బంది అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎవరి
Date : 01-06-2026 - 8:38 IST -
RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్
ఐపీఎల్ – 2026 సీజన్ విజేతగా ఆర్సీబీ మరోసారి నిలిచింది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్.. 2026 సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించి.. రెండోసారి టైటిల్ని గెలుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ తన అద్భుతమైన బౌలింగ్తో గుజరాత్ని కట్టడి చేసింది. ఓపెనర్లు గిల్, సుదర్శన్లను ఆర్సీబీ బౌలర్లు అవుట్ చేయడంతో గుజరాత
Date : 31-05-2026 - 11:27 IST -
RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్మన్స్
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు క
Date : 31-05-2026 - 10:12 IST -
Forever New : వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
విశాఖపట్నం వాతావరణం, ఇక్కడి ప్రజల జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ను ఎంతో ఆలోచనాత్మకంగా, ఆహ్వానించదగిన రీతిలో తీర్చిదిద్దారు. నగర ఉష్ణోగ్రతలకు సరిపోయేలా గాలి ప్రసరించే తేలికపాటి కాటన్
Date : 31-05-2026 - 9:04 IST -
PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'హబ్-అండ్-స్పోక్' నమూనా ఆధారంగా ఈ క్లస్టర్ పనిచేస్తుంది. దీనివల్ల అధునాతన తయారీ రంగం (Advanced Manufacturing) మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో స్థానిక
Date : 31-05-2026 - 8:48 IST -
RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజట్లు పోటీ
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఈ కీలక పోరు అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్పై కన్నేసింది. మరోవైపు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తమ రెండో ట్రోఫీ క
Date : 31-05-2026 - 7:15 IST -
Jaggareddy : మెదక్కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్పై జగ్గారెడ్డి ప్రశంసలు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గరారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష
Date : 31-05-2026 - 7:04 IST -
Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీనటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపే
Date : 31-05-2026 - 4:32 IST