కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్
- Author : Vamsi Chowdary Korata
Date : 09-03-2026 - 11:32 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli 2026 టీ20 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్లో ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్గా నిలిచాడు. వరుసగా మూడు 80+ స్కోర్లు చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Virat Kohli with a heartfelt message for Sanju Samson after his Player of the Tournament performance
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంజూ శాంసన్కు స్పెషల్ విషెస్ తెలిపాడు. న్యూజిలాండ్పై అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు అందుకున్న మూడో భారత ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ 2014, 2016 సంవత్సరాల్లో ఈ అవార్డును గెలుచుకోగా, జస్ప్రీత్ బుమ్రా 2024లో ఈ ఘనత సాధించాడు.
ఈ టోర్నమెంట్లో మొత్తం తొమ్మిది మ్యాచ్లు జరిగినప్పటికీ శాంసన్ కేవలం ఐదు మ్యాచ్లలో మాత్రమే ఆడాడు. అయినప్పటికీ అతను 321 పరుగులు చేసి భారత జట్టుకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని సగటు 80.25 కాగా, స్ట్రైక్రేట్ 199.37గా నమోదైంది. ముఖ్యంగా చివరి మూడు ఇన్నింగ్స్లలో వరుసగా మూడు 80కి పైగా స్కోర్లు నమోదు చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
శాంసన్ అద్భుత ప్రదర్శన తర్వాత విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేకంగా స్పందించాడు. “టోర్నమెంట్లో అత్యంత అర్హత ఉన్న వ్యక్తి నుంచి అద్భుత ప్రదర్శన. కీలక సమయంలో నువ్వు అద్భుతంగా ఆడావు. చాలా సంతోషంగా ఉంది చెటా” అంటూ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శాంసన్ను అభినందించాడు.
ఐసీసీ టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఇప్పటి వరకు టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లి . ఒకే టోర్నీలో 319 పరుగులతో ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో కోహ్లి నిలిచాడు. ఈ టోర్నీలో సంజూ శాంసన్ కేవలం ఐదు ఇన్నింగ్స్లలో 321 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలుకొట్టాడు.
ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్లలో వెస్టిండీస్పై 97 పరుగులతో నాటౌట్గా నిలిచి టీమిండియా టీ20 వరల్డ్కప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 89 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై 89 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.