HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ed Attaches Assets Worth Rs 441 Crore In Ycp Liquor Scam

వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Author : Vamsi Chowdary Korata Date : 07-03-2026 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case  వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అంచ‌నావేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్ద‌దిగానే ఉంది. మ‌రోవైపు నాటి అక్ర‌మాల్లో ప్ర‌ముఖ పాత్ర ఉన్న వారి ఆస్తుల‌ను కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేస్తున్నారు. తాజాగా 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు అటాచ్ చేశారు.

ఈ 441 కోట్ల రూపాయ‌లు.. మొత్తంగా ముగ్గురు ప్ర‌ధాన నిందితుల‌కు చెంద‌న ఆస్తుల‌ని ఈడీ అధికారులు తెలిపారు. ఏ-1గా ఉన్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌రరెడ్డి(గ‌తంలోనే ఈయ‌న ఆస్తుల‌ను కొంత మేర‌కు అటాచ్ చేశారు), బూనేటి చాణ‌క్య‌, ఐఆర్ఎస్ అధికారి దొంతిరెడ్డి వాసుదేవ‌రెడ్డికి చెందిన 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను తాజాగా అటాచ్ చేసిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తులు అక్ర‌మంగా వారికి చేకూరిన‌ట్టు త‌మ‌కు ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిపై కోర్టును ఆశ్ర‌యించి.. కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేసిన‌ట్టు వివ‌రించారు.

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మ‌ద్యం విధానాన్ని స‌మూలంగా మార్చేశారు. ప్రైవేటు వ్యాపారుల లైసెన్సులు ముగియ‌డంతో ప్ర‌భుత్వ‌మే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ బ్రాండ్ల కంపెనీల‌ను ప‌క్క‌న పెట్టి.. నాసిర‌కం బ్రాండ్ల‌ను ప్రోత్స‌హించారు. కల్తీ మద్యం వల్ల 30,000 మంది మరణించారు. 5 లక్షల మంది ఇప్పటికీ కాలేయం / మూత్రపిండాల నష్టం మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు.

దీనిలో వైసీపీకి చెందిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌ బ్యాక్‌ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరి నుంచి మ‌ద్యం కొనుగోలు చేసేందుకు క‌మీష‌న్లు ఇవ్వాల‌ని ష‌ర‌తులు విధించారు. దీనిని ప‌క్కాగా అమ‌లు చేశారు. 12 బాటిళ్లు ఉండే కేసుకు 18-20 శాతం మేర‌కు క‌మీష‌న్లు వ‌సూలు చేశారు.

ఈ సొమ్మును 2024 ఎన్నిక‌ల్లో వినియోగించార‌న్న‌ది సిట్ అధికారులు చెబుతున్న మాట‌. అదేస‌మ‌యంలో కొంత సొమ్ము.. కీల‌క నేత‌కు చేరింద‌ని కూడా అంటున్నారు. అయితే.. ఆ కీల‌క నేత ఎవ‌రు? అనేది విచార‌ణ‌కు కీల‌కంగా మారింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh liquor
  • Andhrapradesh
  • AP Liquor Scam Big Update
  • AP Liquor Scam Latest news
  • Enforcement Directorate (ED)
  • ys jagan
  • YSR Congress Party

Related News

Jagan Fever Attack

YCP Jagan : జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన CBI కోర్ట్

విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత, జగన్ తన కేసులకు సంబంధించిన విచారణకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, పర్యటన ముగిసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు

  • Apsrtc

    APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

  • Kollu Ravindra fir on ys jagan

    జగన్ బతుకే ఒక అరాచకం.. గొడ్డలి రాజకీయాలు తెలుసు : మంత్రి కొల్లు రవీంద్ర

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

  • Amaravati Vijayasai Reddy and Chandrababu Naidu

    Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ట్వీట్

Latest News

  • Mahindra University : మహీంద్రా యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రారంభం

  • HMD : హెచ్ఎండీ బ్రాండ్ అంబాసిడర్‌గా రాఘవ్ జుయల్

  • Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Delimitation : డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నాం అంటూనే మెలిక పెట్టిన వైసీపీ ఎంపీ

  • 2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd