HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ed Attaches Assets Worth Rs 441 Crore In Ycp Liquor Scam

వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Author : Vamsi Chowdary Korata Date : 07-03-2026 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case  వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అంచ‌నావేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్ద‌దిగానే ఉంది. మ‌రోవైపు నాటి అక్ర‌మాల్లో ప్ర‌ముఖ పాత్ర ఉన్న వారి ఆస్తుల‌ను కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేస్తున్నారు. తాజాగా 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు అటాచ్ చేశారు.

ఈ 441 కోట్ల రూపాయ‌లు.. మొత్తంగా ముగ్గురు ప్ర‌ధాన నిందితుల‌కు చెంద‌న ఆస్తుల‌ని ఈడీ అధికారులు తెలిపారు. ఏ-1గా ఉన్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌రరెడ్డి(గ‌తంలోనే ఈయ‌న ఆస్తుల‌ను కొంత మేర‌కు అటాచ్ చేశారు), బూనేటి చాణ‌క్య‌, ఐఆర్ఎస్ అధికారి దొంతిరెడ్డి వాసుదేవ‌రెడ్డికి చెందిన 441 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను తాజాగా అటాచ్ చేసిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆస్తులు అక్ర‌మంగా వారికి చేకూరిన‌ట్టు త‌మ‌కు ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిపై కోర్టును ఆశ్ర‌యించి.. కోర్టు ఆదేశాల మేర‌కు అటాచ్ చేసిన‌ట్టు వివ‌రించారు.

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మ‌ద్యం విధానాన్ని స‌మూలంగా మార్చేశారు. ప్రైవేటు వ్యాపారుల లైసెన్సులు ముగియ‌డంతో ప్ర‌భుత్వ‌మే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ బ్రాండ్ల కంపెనీల‌ను ప‌క్క‌న పెట్టి.. నాసిర‌కం బ్రాండ్ల‌ను ప్రోత్స‌హించారు. కల్తీ మద్యం వల్ల 30,000 మంది మరణించారు. 5 లక్షల మంది ఇప్పటికీ కాలేయం / మూత్రపిండాల నష్టం మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు.

దీనిలో వైసీపీకి చెందిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌ బ్యాక్‌ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరి నుంచి మ‌ద్యం కొనుగోలు చేసేందుకు క‌మీష‌న్లు ఇవ్వాల‌ని ష‌ర‌తులు విధించారు. దీనిని ప‌క్కాగా అమ‌లు చేశారు. 12 బాటిళ్లు ఉండే కేసుకు 18-20 శాతం మేర‌కు క‌మీష‌న్లు వ‌సూలు చేశారు.

ఈ సొమ్మును 2024 ఎన్నిక‌ల్లో వినియోగించార‌న్న‌ది సిట్ అధికారులు చెబుతున్న మాట‌. అదేస‌మ‌యంలో కొంత సొమ్ము.. కీల‌క నేత‌కు చేరింద‌ని కూడా అంటున్నారు. అయితే.. ఆ కీల‌క నేత ఎవ‌రు? అనేది విచార‌ణ‌కు కీల‌కంగా మారింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh liquor
  • Andhrapradesh
  • AP Liquor Scam Big Update
  • AP Liquor Scam Latest news
  • Enforcement Directorate (ED)
  • ys jagan
  • YSR Congress Party

Related News

Polavaram Project

జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Polavaram Project  దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

  • Middle East War Effect

    యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

  • Divvela Madhuri

    తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

  • Ap Logo

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Latest News

  • రేపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ గుడిలో మహిళలకు ఉచిత, ప్రత్యేక దర్శనం!

  • ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

  • పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

  • వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd