Crime News
-
#Telangana
Telangana: పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది
సమాజంలో రోజురోజుకి మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. పెళ్లి (Marriage)కి ఒప్పుకోలేదని ప్రేమించిన యువతిపై ఓ యువకుడు దాడికి దిగి గాయపర్చాడు. హన్మకొండ జిల్లా కాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి అంగీకరించడం లేదని ప్రేయసి గొంతు కోశాడు.
Published Date - 08:35 AM, Wed - 4 January 23 -
#India
Woman Rotting Body: కలకలం.. మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక కుళ్లిన మహిళ మృతదేహం
మహారాష్ట్రలోని సతారాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక బురదలో పాతిపెట్టిన మహిళ మృతదేహం (woman decomposing body) లభ్యమైంది. సతారాలోని వాడే గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కంటతై నలవాడేకు చెందిన మూసి ఉన్న బంగ్లా సమీపంలో దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.
Published Date - 10:44 AM, Sat - 31 December 22 -
#World
Hindu Woman Killed: పాకిస్థాన్లో హిందూ మహిళ దారుణ హత్య.. తలను నరికిన దుండగులు
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో బుధవారం నాడు 40 ఏళ్ల హిందూ మహిళను దారుణంగా హత్య చేసి (Hindu Woman Killed), తలను వేరు చేశారు. ఈ ఘటన సింజోరో జిల్లాలో చోటుచేసుకుంది. దయా భిల్ అనే హిందూ మహిళ వితంతువు, భిల్ కమ్యూనిటీకి చెందినది. ఆమెకి నలుగురు పిల్లలు.
Published Date - 11:16 AM, Fri - 30 December 22 -
#Telangana
Suicide: తెలంగాణలో దారుణం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య
తెలంగాణలో దారుణం జరిగింది. నవ మాసాలు మోసిన కన్న బిడ్డలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య (Suicide)కు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య(Suicide) చేసుకోగా తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కూతుళ్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెండడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
Published Date - 08:20 AM, Fri - 30 December 22 -
#India
Woman Gang Raped: యూపీలో దారుణం.. ఇంటికి వెళ్తున్న యువతిపై గ్యాంప్ రేప్
యమునా ఎక్స్ప్రెస్ వేపై 23 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (gang-raped) పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గంటలోపే జైవీర్, టిటు, చాచా అనే టాక్సీ డ్రైవర్తో సహా ముగ్గురు నిందితులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని యమునా ఎక్స్ప్రెస్ హైవేపై ఆమె ప్రయాణిస్తున్న షేర్ టాక్సీలో ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు.
Published Date - 12:55 PM, Thu - 29 December 22 -
#India
Actress Dead: నటి దారుణ హత్య.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిన దుండగులు
జార్ఖండ్ (Jharkhand)కు చెందిన నటి (Actress) రియా కుమారి (Riya Kumari) దారుణ హత్యకు గురైంది. రియా తన భర్తతో కలిసి రాంచీ నుండి కోత్కత్తాకు వెళ్తుండగా దుండగులు వారిని అడ్డుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Published Date - 07:01 AM, Thu - 29 December 22 -
#Andhra Pradesh
MURDER: దారుణ హత్య.. తల, మొండెం వేరు
ఏపీలోని అన్నమ్మయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. రమేష్ అనే యువకుడిని దుండగులు దారుణంగా నరికి హత్య (MURDER) చేశారు. రమేష్ బైక్ పై వెళ్తుండగా నిందితులు కళ్ళల్లో కారం చల్లి దాడి చేశారు. తల, మొండెం వేరు చేసి చంపారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Published Date - 01:35 PM, Tue - 27 December 22 -
#Speed News
Bansuwada: బాన్సువాడలో విషాదం.. చిన్నారులను కెనాల్లో పడేసిన తల్లి
కుటుంబ కలహాలతో కెనాల్లో ఇద్దరు చిన్నారుల (Childrens)ను పడేసి తల్లి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బాన్సువాడ (Bansuwada)లో జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చక్రధర్ తండాకు చెందిన అరుణ… పిల్లలు యువరాజ్(4), అనన్యలను బాన్సువాడ పోచమ్మ ఆలయం వద్ద ఉన్న వాగులో పడేసి తాను దూకింది.
Published Date - 09:30 AM, Tue - 27 December 22 -
#India
Chopped Body Into Pieces: యువకుడిని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారం
దేశంలో శ్రద్దా వాకర్ తరహా హత్యా ఘటన (Murders)లు ఆగడం లేదు. తాజాగా బీహార్లోనూ అలాంటి ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. బిట్టు కుమార్ అనే వ్యక్తి తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో రాహుల్ దారుణంగా హత్య (Murder) చేశాడు. అతన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు.
Published Date - 08:35 AM, Tue - 27 December 22 -
#Speed News
Andhra Pradesh: ఏపీలో ఓ ఘాతుకం.. తల్లి, ఇద్దరు కూతుర్ల పై సుత్తితో దాడి
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.
Published Date - 11:41 AM, Sat - 24 December 22 -
#India
kills 2 women: ఆసుపత్రిలో తల్లీకూతుళ్లను హత్య చేసిన కాంపౌండర్
చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లీకూతుళ్లను ఓ కాంపౌండర్ హత్య (Murder) చేసిన ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. చంపావాలా అనే మహిళ తన కుమార్తె భారతితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా మన్సుఖ్ అనే కాంపౌండర్ వారికి మత్తు మందు ఇచ్చి హత్య (Murder) చేశాడు.
Published Date - 07:33 AM, Sat - 24 December 22 -
#India
Cut Into 4 Pieces: దారుణం.. సాధువును హత్య చేసి 4 ముక్కలుగా నరికి
ఓ సాధువును హత్య (Murder) చేసి నాలుగు ముక్కలుగా నరికిన ఘటన రాజస్థాన్లోని ధోపూర్లో చోటుచేసుకుంది. భీమ్ఘర్ గ్రామానికి చెందిన సాధువును దుండగులు హత్య (Murder) చేసి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి దగ్గరలోని నదిలో పడేశారు.
Published Date - 08:30 AM, Thu - 22 December 22 -
#Telangana
Girl kidnapped: యువతి కిడ్నాప్ కలకలం.. కారులో ఎత్తుకెళ్లిన యువకులు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ (Girl kidnapped) కలకలం సృష్టిస్తోంది. చందుర్తి మండలం మూడవపల్లి గ్రామంలో మంగళవారం ఈ కిడ్నాప్ (Girl kidnapped) వెలుగు చూసింది. ఓ యువతిని నలుగురు యువకులు కారులో ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Published Date - 12:39 PM, Tue - 20 December 22 -
#Andhra Pradesh
Gang Raped: విజయవాడలో దారుణం.. మహిళపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం
విజయవాడలో దారుణం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారాని (Gang Raped)కి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. అత్యాచారాని(Gang Raped)కి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Published Date - 10:53 AM, Tue - 20 December 22 -
#India
Father Killed Son: కొడుకును చంపి గోనె సంచిలో దాచిన తండ్రి
యూపీలోని అలీఘర్లో దారుణం జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును హత్య (Father Killed Son) చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పొలంలో పడేశాడు. అయితే మృతుడి మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Published Date - 07:25 AM, Tue - 20 December 22