Crime News
-
#India
Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు
లోనావాలా సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోట నుండి వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ను కిందకు తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి; ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ హత్య కేసులో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది: కేతన్ కాబోయే భార్య (ఫియాన్సీ) మరియు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు అప్పటికే వివాహం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయం కేసులో ఊహించని మలుపును తెచ్చింది. ‘న్యూస్18 మరాఠీ’ […]
Date : 07-07-2026 - 11:39 IST -
#Telangana
Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి
సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో వెలుగుచూసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లిపైనే ఓ కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణ తీవ్ర సంచలనం రేపుతోంది. మానవత్వం, కుటుంబ విలువలు ఎంతగా దిగజారాయో చెప్పే ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే […]
Date : 06-07-2026 - 11:21 IST -
#Andhra Pradesh
ప్రాణం తీసిన కొబ్బరి బొండం
కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన దువ్వూరి హరిప్రసాద్ అనే వ్యక్తి పౌరోహిత్యం […]
Date : 04-07-2026 - 5:35 IST -
#Andhra Pradesh
Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువైద్య అధికారులు అత్యంత నిశితంగా పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ తర్వాత మరింత స్పష్టత కోసం […]
Date : 26-06-2026 - 1:15 IST -
#India
Ketan Agarwal: కేతన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో ఆయన సోదరి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం కీలకంగా మారాయి. లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి కేతన్ చనిపోవడంపై.. కాబోయే భార్య ప్రవర్తన, మాటల తీరుపై సోదరి రేకెత్తించిన అనుమానాలే ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ గుట్టును రట్టు చేశాయి. ప్రమాదం జరిగిన తీరుపై సియా పదే పదే మాటలు మారుస్తూ, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం […]
Date : 25-06-2026 - 12:41 IST -
#Telangana
Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర
కొన్ని చిన్న చిన్న విషయాలు ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు, తల్లీకుమార్తెలు, తండ్రి కొడుకుల మధ్య చిన్నగా మొదలైన మాటలు కాస్తా.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో నాటుకోడి కూర వండాలనే విషయంలో జరిగిన ఘర్షణ చివరికి తండ్రిని కుమారుడు చంపే వరకు వెళ్లింది. తండ్రి […]
Date : 11-06-2026 - 4:57 IST -
#South
Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్ ‘‘ఈ ఘోర ఘటన దిగ్భ్రాంతిని, వేదనను కలిగించింది. ఇలాంటి అమానవీయ నేరాలను సహించబోం. […]
Date : 23-05-2026 - 4:43 IST -
#South
Extra Marital Affair: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య
దేశ రాజధాని ఢిల్లీలో మానవ సంబంధాల విలువలను నడిరోడ్డుపై తగలబెట్టేలా అత్యంత క్రూరమైన, భయానకమైన ఘటన చోటుచేసుకుంది. తన భార్యకు ఉన్న వివాహేతర సంబంధం గురించి నిలదీసినందుకు, ఆ భార్య తన తల్లితో కలిసి భర్తపైనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని నార్త్ వెస్ట్ జిల్లా జహంగీర్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులైన తల్లీకూతుళ్లను పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి […]
Date : 19-05-2026 - 12:24 IST -
#News
Crime News: గ్వాలియర్ లో బాలికపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కిడ్నాప్కు గురైన బాలికపై బెంగళూరులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణమైన కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్కు చెందిన బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను మాయమాటలు చెప్పి […]
Date : 16-05-2026 - 11:14 IST -
#Telangana
Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏడెనిమిది నెలల పాటు ఎదురుచూసినట్లు తెలుస్తోంది. ఇంటి ముందు నుంచి వస్తే […]
Date : 08-05-2026 - 2:26 IST -
#Telangana
కోదాడ బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై వెంటాడి.. భార్యను చంపిన భర్త
సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి కోదాడ బస్టాండ్ వద్ద ఈ ఘోరం జరిగింది. పోలీసులతో కౌన్సెలింగ్ తీసుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోదాడలోని బాబునగర్కు చెందిన మణిదీప్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీష […]
Date : 07-05-2026 - 8:56 IST -
#India
ముఖానికి కేక్ పూశారని ముగ్గురి స్నేహితుల హత్య..
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడిపై రూ.50,000 రివార్డు ఉంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్చి చంపారు. అధికారుల కథనం ప్రకారం ధరౌ పోలీస్ అవుట్పోస్ట్ సమీపంలో స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపమని కోరారు. అయితే, వారు ఆగకుండా పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఝాజర్ రోడ్డులో చుట్టుముట్టగా, […]
Date : 01-05-2026 - 10:41 IST -
#Special
ప్రియుడి కోసం ఎంత పని చేశావు?
నమ్మకంగా పనిచేస్తున్నాడనుకున్న వ్యక్తే యజమాని కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో యజమాని కుమార్తెను వంచించి, ఆమె నుంచి ఏకంగా కిలో బంగారు ఆభరణాలను కాజేశాడు. బ్రెయిన్ ట్యూమర్ అంటూ నాటకమాడి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి చైతన్యపురిలో టైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వద్ద 34 ఏళ్ల సాగర్ గత నాలుగేళ్లుగా మేనేజర్గా […]
Date : 22-04-2026 - 11:15 IST -
#Cinema
Jacqueline Fernandez : అప్రూవర్గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. జాక్వెలిన్ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, ఈ విషయంలో ముందుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించింది. నిబంధనల ప్రకారం జాక్వెలిన్ అప్రూవర్గా మారాలనుకుంటే మొదట దర్యాప్తు […]
Date : 17-04-2026 - 3:07 IST -
#South
వివాహిత మహిళ బ్లాక్మెయిల్.. బెంగళూరు ఫిట్నెస్ ట్రైనర్ ఆత్మహత్య
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత వేధింపులు, బ్లాక్మెయిలింగ్ తాళలేక 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రస్థాయి ఫిట్నెస్ ట్రైనర్ అయిన దిలీప్ (28) రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ తర్వాత యోగిత అనే మహిళ నుంచి దిలీప్ సోదరికి ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది. దిలీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ మెసేజ్లో ఉండటంతో కుటుంబ సభ్యులు […]
Date : 13-04-2026 - 10:30 IST