Hyderabad: హైదరాబాద్లో ఘరానా మోసం.. ఐటీ అధికారులమని చెప్పి 17 బంగారు బిస్కెట్లు అపహరణ.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad)లోని ఓ దుకాణంలో ఆదాయపన్ను శాఖ అధికారులుగా చూపిస్తూ రూ.60 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.
- By Gopichand Published Date - 10:41 AM, Wed - 31 May 23
Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లోని ఓ దుకాణంలో ఆదాయపన్ను శాఖ అధికారులుగా చూపిస్తూ రూ.60 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు నగర పోలీసులు సమాచారం అందించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను రెహ్మాన్ గఫూర్ అథర్, జాకీర్ గని అథర్, ప్రవీణ్ యాదవ్, ఆకాష్ అరుణ్ హోవిల్లుగా గుర్తించారు.
ఐటీ అధికారులమని చెప్పి
ఈ ఘటనపై కమిషనర్ మాట్లాడుతూ.. మే 27న హైదరాబాద్లోని మోండా మార్కెట్లోని సిద్ధివినాయక్ అనే దుకాణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా నటిస్తూ 8 నుంచి 10 మంది వ్యక్తులు రూ. 60 లక్షల విలువైన 17 బంగారు బిస్కెట్లను దొంగిలించారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 7 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని, మిగతా నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also Read: Pushpa 2 Artists: పుష్ప-2 ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్
17 బంగారు బిస్కెట్లను అపహరించారు
మే 27న మోండా మార్కెట్లోని సిద్ధివినాయక్ అనే దుకాణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా నటిస్తూ 8-10 మంది వ్యక్తులు రూ.60 లక్షల విలువైన 17 బంగారు బిస్కెట్లను దొంగిలించారని కమిషనర్ తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 7 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
Related News
Training Of Excise Constables: ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజు కానిస్టేబుళ్ల ట్రైనింగ్..!
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ (Training Of Excise Constables) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 555 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైనవారు ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ కావాల్సి ఉంది.