Andhra Pradesh
-
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలోని ఆ జిల్లాకు శుభవార్త..దశ తిరిగినట్టే.!
రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఏరో స్పేస్ క్యాంపస్ ఏర్పాటు కోసం బెంగళూరుకు చెందిన సంస్థ ముందుకు వచ్చింది. బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. […]
Date : 18-11-2025 - 5:19 IST -
#Andhra Pradesh
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. నక్సల్ కంచుకోట కూలిపోయింది. భద్రతా […]
Date : 18-11-2025 - 12:02 IST -
#Andhra Pradesh
Anti Maoist Operation : భారీ ఎన్కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొంత మంది హతమైనట్లు […]
Date : 18-11-2025 - 11:31 IST -
#Andhra Pradesh
Transgenders Reservation : ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ట్రాన్స్జెండర్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీలో ట్రాన్స్జెండర్ల కోటా లేనందువలన.. స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం తనను పరిగణించలేదంటూ ఏలూరు జిల్లాకు చెందిన రేఖ అనే ట్రాన్స్జెండర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్జెండర్ల […]
Date : 15-11-2025 - 3:11 IST -
#Andhra Pradesh
Vijayawada : ఏపీ ప్రజలకు శుభవార్త .. విజయవాడ నుంచి సింగపూర్ జస్ట్ 4 గంటల్లో వెళ్లొచ్చు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఇకపై సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై తిరగాల్సిన పనిలేదు. నేటి నుంచి విజయవాడ – సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి మూడు రోజులు నడిచే ఈ సర్వీసుతో ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. గతంలోనూ విజయవంతమైన ఈ సర్వీసుపై ప్రయాణికుల్లో భారీ అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీస్ నడుపుతామని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో అంతర్జాతీయ విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. సింగపూర్ […]
Date : 15-11-2025 - 2:04 IST -
#Andhra Pradesh
Palamaner Krishnagiri National Highway : రూ.800 కోట్లతో.. ఏపీలో కొత్త జాతీయ రహదారి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కృష్ణగిరి-పలమనేరు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పనులు పూర్తయితే ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సులభతరం అవుతాయి. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 82 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయరహదారులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో పనుల్ని వేగవంతం […]
Date : 15-11-2025 - 1:51 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ […]
Date : 15-11-2025 - 11:15 IST -
#Andhra Pradesh
Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!
ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది.
Date : 03-11-2025 - 9:40 IST -
#Andhra Pradesh
Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ్యం ఐదు వేలు మాత్రమేనని.. కానీ ఏకాదశి పర్వదినం కావటంతో 25 వేల మంది వచ్చారని ఏపీ దేవాదాయశాఖ […]
Date : 01-11-2025 - 4:07 IST -
#Andhra Pradesh
kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో […]
Date : 01-11-2025 - 2:27 IST -
#Andhra Pradesh
Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!
శ్రీకాకుళంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా తొమ్మిది మంది మృతి […]
Date : 01-11-2025 - 12:46 IST -
#Andhra Pradesh
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ రాష్ట్రం ప్రతిభతో పెట్టుబడులను ఆకర్షిస్తే.. ఏపీ మాత్రం 15 […]
Date : 28-10-2025 - 3:35 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద.. రూ. 5,532 కోట్లతో చేపట్టే ఏడు యూనిట్లలో.. ఒక యూనిట్ ఏపీకి రానున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సైర్మా కంపెనీ ఏపీలో రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. మిగతా యూనిట్లు తమిళనాడు, మధ్యప్రదేశ్లో నెలకొల్పనున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త […]
Date : 28-10-2025 - 11:20 IST -
#Andhra Pradesh
Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. View this post on Instagram A post shared by Pavani Bugatha (@pavani_stories) మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ […]
Date : 28-10-2025 - 10:52 IST -
#Andhra Pradesh
Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మాన్సూన్ తుపానుకు 대응ంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్తి గంటగా పరిస్థితిని అంచనా వేసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. #CycloneMontha రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ… […]
Date : 27-10-2025 - 2:33 IST