Andhra Pradesh
-
#Speed News
TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు
టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేశారని, […]
Date : 27-05-2026 - 4:03 IST -
#Andhra Pradesh
Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?
రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై జనసేన అధిష్ఠానం దృష్టి సారించించింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సేవలను రాయలసీమలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు తర్వాత ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్ విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా జనసేన అధిష్ఠానం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాలినేనికి మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పించే […]
Date : 26-05-2026 - 1:21 IST -
#Andhra Pradesh
ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు
న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, ఇతరుల పేర్లపై కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు […]
Date : 26-05-2026 - 9:07 IST -
#Andhra Pradesh
Nellore : రాజకీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె.. ఫస్ట్ ప్రెస్మీట్లోనే అదరగొట్టిన సాయివైష్ణవి
నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కీలకంగా మారబోతుంది. గత ఎన్నికల్లో నెల్లూరుజిల్లాలో టీడీపీ తన దూకుడిని ప్రదర్శించింది. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో మహిళా నాయకురాలు బరిలోకి వస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎన్నికల సమయంలో ఆమె […]
Date : 25-05-2026 - 7:39 IST -
#Andhra Pradesh
Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె చంద్రబాబు నాయకత్వం, దార్శనికతపై ప్రశంసలు కురిపించారు. సమ్మిళిత అభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి పట్ల సీఎంకు ఉన్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ప్రీతారెడ్డి తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, యువతకు నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం వంటి […]
Date : 23-05-2026 - 4:31 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఆర్టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..
ఏపీలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల పరిపాలనా వివరాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో […]
Date : 23-05-2026 - 12:28 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్డేట్..
ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ […]
Date : 23-05-2026 - 11:18 IST -
#Andhra Pradesh
Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్
విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ సీన్లు కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీపులతో ఢీకొట్టుకున్నారు. ఆ తర్వాత రాడ్లతో జీపులను ధ్వంసం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు… ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్న ఇద్దరికి ఓ అమ్మాయి విషయంలో […]
Date : 22-05-2026 - 11:01 IST -
#Andhra Pradesh
AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు, కంపెనీలు క్యూ కట్టాయి. మిట్టల్ స్టీల్, గూగుల్ డేటా సెంటర్, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు సహా ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటుగా ఏపీకి బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) పెట్రో కెమికల్ కాంప్లెక్స్, గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కూడా ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఈ కాంప్లెక్స్, రిఫైనరీ ఏర్పాటు చేయనుండగా.. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. […]
Date : 21-05-2026 - 11:01 IST -
#Andhra Pradesh
AP Caste Census: ఏపీలో కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా ఉన్న కులాలివే!
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో 2024కు ముందు కులగణన చేసింది. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా రెండేళ్ల క్రితం చేసిన కులగణనకు సంబంధించిన నివేదిక బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కూడా ముగింపు దశకు రాగా.. 2024 నాటి బీసీ జనాభా, ఇప్పుడు బీసీ జనాభా ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 5.31 కోట్ల మంది ఉన్నారు. అయితే పురుషుల కంటే […]
Date : 19-05-2026 - 3:10 IST -
#Andhra Pradesh
CM Chandrababu: మత్స్యకారులకు అండగా : సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో నేడు జరిగిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేట నిషేధ భృతి కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ. 20 వేల చొప్పున, మొత్తం రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి […]
Date : 19-05-2026 - 1:47 IST -
#Andhra Pradesh
AP ICET Results: ఏపీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇందులో 21,205 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 91.41 అని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పలితాలు తెలుసుకోవచ్చు. ఏపీ ఐసెట్ […]
Date : 16-05-2026 - 3:50 IST -
#Andhra Pradesh
Cm Chandrababu: ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన నాలుగు కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూలస్తంభాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవితాశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రాన్ని […]
Date : 16-05-2026 - 3:34 IST -
#Andhra Pradesh
AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన
రాయలసీమకు మరో భారీ ప్రాజెక్టు వచ్చింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరికొన్ని ప్రాజెక్టులకు పుట్టపర్తి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రాయలసీమ ప్రాంతంలో యుద్ధ […]
Date : 15-05-2026 - 2:01 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఈ ఎయిర్పోర్ట్ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి […]
Date : 15-05-2026 - 11:27 IST