HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Injustice Is Being Done To Our Caste In Telangana Ap Minister

Vasamsetti Subhash : తెలంగాణలో మా కులాన్ని అన్యాయం జరుగుతోంది: ఏపీ మంత్రి

  • Author : Vamsi Chowdary Korata Date : 19-11-2025 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vasamsetti Subhash Kcr
Vasamsetti Subhash Kcr

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏపీలో కూడా శెట్జి బలిజల్ని ఓసీల్లో చేరుస్తారనే ప్రచారం జరుగుతోందని రెండు నెలల క్రితం మంత్రి ప్రస్తావించారు. అది వైఎస్సార్‌సీపీ నేతల అబద్ధపు ప్రచారమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‌పై ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ సామాజిక వర్గాన్ని ఓసీల్లో చేర్చి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శెట్టి బలిజ సామాజికి వర్గానికి చెందిన కొందరు బంధువులు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో శెట్టి బలిజల్ని ఓసీల్లో చేర్చారన్నారు. ఈ క్రమంలో శెట్టి బలిజలు ఓసీలలో కలవడం వల్ల వారి జీవితాలు నాశనం అయ్యాయన్నారు. ఈ నిర్ణయంతో భావితరాల వారి భవిష్యత్ పాడైపోతాయన్నారు. ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో శెట్టి బలిజలు బీసీ కేటగిరిలో ఉన్నారు.. అయితే తెలంగాణలో మాత్రం ఓసీల్లో కలిపారు. ఈ క్రమంలోనే మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కూడా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

ఏపీలో కూడా రెండు నెలల క్రితం శెట్టిబలిజ బీసీ కులాన్ని ఓసీల్లో చేరుస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ క్లారిటీ ఇచ్చారు. శెట్టిబలిజలను ఓసీల్లో చేరుస్తున్నారనేది వైఎస్సార్‌సీపీ నేతల అబద్ధపు ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం ద్వారా కులాల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

గీత వృత్తి చేసుకునే వారి గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్‌సీపీ నేతలకు లేదన్నారు మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వం గీత వృత్తిదారులకు అండగా నిలుస్తుందని, వారికి మద్యం షాపుల్లో ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తోందని తెలిపారు. మద్యం షాపుల్లో, బార్లలో 10% వారికి కేటాయించినట్లు మంత్రి వివరించారు. వైఎస్సార్‌సీపీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని, ఈ తప్పుడు ప్రచారంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాజాగా తెలంగాణలో శెట్టిబలిజల్ని ఓసీల్లో చేర్చడంపై మంత్రి స్పందించారు.. మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దీంతో మరోసారి శెట్టి బలిజల అంశం తెరపైకి వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • kcr
  • telangana
  • Vasamsetti Subhash

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Redmi Turbo 5: భారీ బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. రెడ్‌మీ టర్బో 5.. స్పెసిఫికేషన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd