Trending
-
Virat Kohli: రిటైర్మెంట్కు కారణం చెప్పిన విరాట్ కోహ్లీ!
కోహ్లీ టెస్ట్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఆయన 123 టెస్ట్ మ్యాచ్లలో (210 ఇన్నింగ్స్) 46.85 సగటుతో 9,230 పరుగులు చేశారు. ఈ క్రమంలో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించారు. ఆయన 68 టెస్ట్ మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరించి, 40 మ్యాచ్లలో విజయం సాధించారు.
Date : 09-07-2025 - 7:18 IST -
Nara Bhuvaneswari : మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు.. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు : నారా భువనేశ్వరి
మహిళల పట్ల ఈ రకమైన దురుసు వైఖరికి సమాజంలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ అసలు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం, వారికి అవమానం కలిగించేలా పదాలు వాడటం ఖండనీయం.
Date : 09-07-2025 - 12:08 IST -
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గైక్వాడ్ తీరుపై విపక్షాలతో పాటు ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే... ఇటీవల గైక్వాడ్ ఎమ్మెల్యే క్యాంటీన్కి వెళ్లి థాలీ ఆర్డర్ చేశారు. వడ్డించిన పప్పు నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించిన ఆయన ఆగ్రహంతో నేరుగా క్యాంటీన్ సిబ్బందిని ప్రశ్నించారు.
Date : 09-07-2025 - 11:48 IST -
US student visa : అమెరికా విద్యార్థి వీసాల జారీ తగ్గుదల..ఎందుకో తెలుసా?
ఇది కేవలం గతేడాది సంఖ్యతో పోలిస్తే కాకుండా, కోవిడ్ సమయంలో నమోదైన గణాంకాల కంటే కూడా తక్కువగా ఉండటం విశేషం. సాధారణంగా ఆగస్ట్/సెప్టెంబర్లో ప్రారంభమయ్యే సెమిస్టర్లను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థి వీసాల కోసం మార్చి నుంచి జులై మధ్య సీజన్ అత్యంత కీలకంగా ఉంటుంది.
Date : 09-07-2025 - 11:00 IST -
Samantha- Raj Nidimoru: ఫైనల్లీ అఫీషియల్.. డీప్ లవ్లో సమంత- రాజ్ నిడిమోరు, నెట్టింట ఫొటో వైరల్!
ఒక ఫోటోలో రాజ్ నిడిమోరు, సమంత ఒకరి మీద ఒకరు ప్రేమగా చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. ఇద్దరూ చిరునవ్వుతో సమన్వయంగా నడుస్తున్నారు.
Date : 09-07-2025 - 8:35 IST -
Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసివేస్తారు?
పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా తెరిచే ఉంటాయని భావిస్తున్నారు. కానీ రవాణా, బ్యాంక్, తపాలా సేవలలో అంతరాయం కారణంగా సామాన్య జనజీవనం ప్రభావితం కావచ్చు.
Date : 09-07-2025 - 7:54 IST -
Lucky Number: మీ అదృష్ట సంఖ్య ఎంతో మీకు తెలుసా? తెలియకుంటే మీరే కనుక్కోవచ్చు ఇలా!
భాగ్యాంకమే మీ అదృష్ట సంఖ్య. దీని ద్వారా మీకు ఏ తేదీ, సంఖ్య, రోజు మంచిదో తెలుసుకోవచ్చు. అంక శాస్త్రం ప్రకారం.. మీ అదృష్ట సంఖ్య సహాయంతో మీరు భాగ్యంలో విజయాలు సాధించవచ్చు. అదృష్ట సంఖ్యను ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.
Date : 09-07-2025 - 7:35 IST -
Bharat Bandh Effect : ఈ రంగాలపై తీవ్ర ప్రభావం
Bharat Bandh Effect : దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ బంద్లో పాల్గొంటున్నారు.
Date : 09-07-2025 - 7:06 IST -
Bharat Bandh: స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉందా? భారత్ బంద్ ప్రభావం చూపనుందా?
ఈ సమ్మెలో 10 ట్రేడ్ యూనియన్లు, రైతులు, గ్రామీణ కార్మికులు, పోస్టల్, బీమా, రవాణా, కోల్ మైనింగ్, బ్యాంకులు మరియు ఫ్యాక్టరీల వంటి రంగాల నుండి 25 కోట్లకు పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు.
Date : 08-07-2025 - 6:54 IST -
Cyber Crime : ట్రాఫిక్ చలానా పేరుతో మాజీ ఆర్మీ అధికారిని మోసగించిన నేరగాళ్లు
బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్కు జులై 6వ తేదీన వాట్సప్ ద్వారా ఓ సందేశం అందింది. మీ కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. జరిమానా రూ.1000 చెల్లించాలి. చెల్లింపుకోసం ఈ లింక్ను ఉపయోగించండి అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అలాగే, ఒక APK ఫైల్ను కూడా జతచేసి పంపించారు.
Date : 08-07-2025 - 6:13 IST -
CM Chandrababu : సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలి.. రైతాంగానికి మేలు: సీఎం చంద్రబాబు
శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. రైతన్నల బాధలు తీరేందుకు ఇవే మార్గం అని చెప్పారు.
Date : 08-07-2025 - 6:03 IST -
CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్నది. జలాశయంలోకి ప్రతి క్షణం 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. 215 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 192 టీఎంసీలు నీరు చేరిన నేపథ్యంలో గేట్లను ఎత్తక తప్పలేదు.
Date : 08-07-2025 - 4:50 IST -
Bhadrachalam : భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి
పురుషోత్తపట్నం గ్రామ పరిధిలో భద్రాచలం దేవస్థానానికి సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూములపై వివాదాలు తలెత్తగా, చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆలయ హక్కును గుర్తించి ఆ భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పూర్తిగా విస్మరించి, కొందరు ఆక్రమణదారులు అక్కడ నిర్మాణాలు చేపట్టారు.
Date : 08-07-2025 - 4:29 IST -
Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక
ఈ నివేదికను మంగళవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులు అందుకున్నారు. వైమానిక ప్రమాదాలపై అనుభవం కలిగిన నిపుణుల బృందం ఈ దర్యాప్తును పరిశీలిస్తున్న AAIB డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఈ కమిటీ సభ్యుల్లో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా ఉన్నారు.
Date : 08-07-2025 - 4:14 IST -
Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.
Date : 08-07-2025 - 3:48 IST -
Odisha : గర్భిణికి పురిటి కష్టాలు..10 కిలోమీటర్లు డోలీలో మోసి ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు
మల్కాన్గిరి జిల్లాలోని ఖైరాపుట్ మండలానికి చెందిన భోజ్గూడ అనే అంతరించిపోతున్న ఆదివాసీ గ్రామంలో సునాయి భోజ్ అనే గర్భిణి నివసిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఆమెకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి అత్యవసరంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఖైరాపుట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపమని కోరారు.
Date : 08-07-2025 - 3:35 IST -
Nepal : శ్రీరామ జన్మస్థలంపై మళ్లీ వివాదం.. నేపాల్ ప్రధాని ఓలి సంచలన వ్యాఖ్యలు
.శ్రీరాముడు నేపాల్ భూభాగంలోనే జన్మించాడని చెప్పారు. వాల్మీకి రచించిన అసలైన రామాయణం ఆధారంగా తాను మాట్లాడుతున్నానని వెల్లడించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. వాల్మీకి మహర్షి రాసిన గ్రంథంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి అని ఓలి పేర్కొన్నారు.
Date : 08-07-2025 - 3:12 IST -
Rajasthan : సోషల్ మీడియా మోజు..ఆరేళ్ల కుమార్తెతో డేంజర్ స్టంట్
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఓ జంట తమ ఏడేళ్ల కుమార్తెను ప్రాణాల పణంగా పెట్టి రీల్ చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. బరేథా జలాశయాన్ని సందర్శించిన ఈ దంపతులు తమ చిన్నారి కూతురిని జలాశయ గోడపై ఇనుపకడ్డీలకు ఆనుకొని ఉన్న విద్యుత్ పెట్టెపై కూర్చోబెట్టి వీడియో తీశారు.
Date : 08-07-2025 - 1:29 IST -
Bomb Threats : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు
ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను అత్యవసరంగా బయటకు పంపించి, భద్రతా చర్యల్లో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Date : 08-07-2025 - 1:05 IST -
Bharat Bandh : రేపు భారత్ బంద్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పెద్ద ఎత్తున పోరాటం
సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉందని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, రవాణా, పోస్టల్ సేవలు, బొగ్గు గనులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని హింద్ మజ్దూర్ సభ నాయకుడు హర్భజన్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు.
Date : 08-07-2025 - 12:35 IST