HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >I Have The Power Of The People I Am Not Afraid Of Many Cases Konda Murali

Konda Murali : నాకు ప్రజాబలం ఉంది..చాలా కేసులకే నేను భయపడలేదు: కొండా మురళి

ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినిగా ప్రజల కోణంలో పనిచేస్తున్నానని, వారికి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ బీసీల కోణంలో ఉండే నాయకుడిని. ప్రజలు నన్ను నమ్మి దగ్గరకు వస్తున్నారు.

  • Author : Latha Suma Date : 03-07-2025 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
I have the power of the people..I am not afraid of many cases: Konda Murali
I have the power of the people..I am not afraid of many cases: Konda Murali

Konda Murali: కాంగ్రెస్ నేత కొండా మురళి ఆయన తన సతీమణి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో కలిసి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ పరిసరాలలో ఏర్పడుతున్న రాజకీయ పరిణామాలపై ఆమెకు నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినిగా ప్రజల కోణంలో పనిచేస్తున్నానని, వారికి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ బీసీల కోణంలో ఉండే నాయకుడిని. ప్రజలు నన్ను నమ్మి దగ్గరకు వస్తున్నారు. సమస్యల పరిష్కారమే నాకు ప్రధానంగా కనిపిస్తోంది. పని చేసేవారిపై రాళ్లు వేయడం మన సమాజంలో సాధారణం. నడిచే ఎద్దునే పొడుస్తారు అనే మాట గుర్తు పెట్టుకోవాలి. ఎవరికైనా పార్టీ టికెట్ ఇవ్వొచ్చు, కానీ గెలిపించే బాధ్యతను నేనే తీసుకుంటానని మీనాక్షి నటరాజన్‌ గారికి చెప్పాను.

Read Also: PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం

మా సేవలను పార్టీ వినియోగించుకోవాలని కోరా. కాంగ్రెస్ పార్టీ బతికించడమే నా లక్ష్యం. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది నా ఆశయం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు నా సంపూర్ణ మద్దతు ఉంది అని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించబోయే సభపై కూడా చర్చించామని పేర్కొన్నారు. వరంగల్ నుండి ఎంతమంది కార్యకర్తలు ఆ సభకు హాజరవుతారో వంటి అంశాలపై వివరంగా చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మళ్లీ వరంగల్‌లో ఎమ్మెల్యేలను గెలిపించడమే నా బాధ్యత. నాకు ఎవరిపట్ల భయం లేదు. ఎలాంటి గ్రూపు రాజకీయాలనైనా నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు.

ఇక, మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..తనకు అప్పగించిన శాఖల పరంగా నిబంధనల ప్రకారమే పని చేస్తున్నానని తెలిపారు. నా శాఖలో ఉన్న అన్ని ఫైల్స్‌ను పరిశీలించవచ్చు. ఇప్పటివరకు మంత్రిగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా కూతురు సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తం. ఆమెకు మా ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు. ఆమె రాజకీయ ఆలోచనలు తప్పు కాదని నమ్ముతున్నా. భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయం తీసుకునే హక్కు ఆమెదే. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తాం అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కొండా మురళి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్‌కు చెందిన నాయకులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనను గాంధీభవన్‌కు పిలిపించి వివరణ కోరింది. అనంతరం లిఖితపూర్వక వివరణ కోసం షోకాజ్ నోటీసును కూడా జారీ చేసింది. ఈ వివరణలో ఆయన చెప్పిన అభిప్రాయాలను పీసీసీ పరిశీలించనుంది. ఈ క్రమంలో కొండా దంపతులు, పార్టీలో తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, సేవకే ప్రాధాన్యతనిస్తూ, కాంగ్రెస్ పునరుద్ధారణ కోసం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి తాజా వ్యాఖ్యలు పార్టీలో వారి పాత్రను మరింత ప్రాధాన్యంగా చూపిస్తున్నాయి.

Read Also: Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • konda murali
  • Meenakshi Natarajan
  • Minister Konda Surekha
  • Sushmita

Related News

Ktr Comments Revanth

నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన

రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు

  • Sonia Gandhi Hsp

    ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ, పార్టీ శ్రేణుల్లో ఖంగారు !!

  • Hilt Policy Telangana Assem

    హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ

  • Brs Assembly

    ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదురుకుంటున్న బిఆర్ఎస్

Latest News

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd