Trending
-
Himachal Floods : వర్ష విపత్తులో మూగ జీవం చేసిన మహత్తర సేవ ..67 ప్రాణాలకు రక్షణగా నిలిచిన ఓ శునకం
ఈ ఘటన జూన్ 30 అర్ధరాత్రి సమయంలో మండి జిల్లాలోని ధర్మపూర్ సమీపంలోని సియాతి అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది. అప్పటికే వర్షం బాగా కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు తమ ఇళ్లలో నిద్రలో మునిగిపోయారు. అయితే గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి ఇంట్లో ఉండే పెంపుడు కుక్క ఒక్కసారిగా అరవడం ప్రారంభించింది. అరుపులు అంత తార్కికంగా కాకపోయినా, ఆ ధ్వని వెనుక ఉన్న అత్యవసర సందేశాన్ని నరేంద
Date : 08-07-2025 - 12:18 IST -
PM Modi : శివ తాండవ స్తోత్రం, బ్రెజిల్ సాంబా సంగీతంతో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం
ఈ కార్యక్రమంలో శివ తాండవ స్తోత్రానికి నృత్యప్రదర్శన, బ్రెజిలియన్ సాంబా-రెగే సంగీత విన్యాసాలు, అమెజాన్ గీతాల ఆలాపనలు వేదికను రంగరించాయి. ఈ భిన్న కళారూపాల సమ్మేళనం, రెండు దేశాల మధ్య గాఢ సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబించింది.
Date : 08-07-2025 - 11:45 IST -
Revanth Reddy vs KTR : ఎవరొస్తారో రండి తేల్చుకుందాం!..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రేవంత్-కేటీఆర్ పరస్పర సవాళ్ల నేపథ్యంలో ఈ భద్రతా ఏర్పాట్లు అత్యవసరంగా మారాయి.
Date : 08-07-2025 - 11:33 IST -
Vijayawada : ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు
ఈ సందర్భంగా మూలవిరాట్కు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పూలతో అలంకరణలు చేపట్టారు. ఆలయ అర్చకులు, సేవాకార్యకర్తలు శాకంబరీ రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Date : 08-07-2025 - 11:01 IST -
Monsoon : వర్షాకాలంలో విస్తరిస్తున్న వ్యాధులు ఇవే.. తగిన జాగ్రత్తలే రక్షణకు మార్గం..!
వర్షాకాలంలో నిలిచిపోయిన నీటి మూటల్లో దోమల పెరుగుదల అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐడిస్ ఈజిప్టి అనే డెంగ్యూ దోమ స్వచ్చమైన నీటిలో పెరుగుతుంది. దీని కాటు వల్ల డెంగ్యూ వస్తుంది. దీని లక్షణాలు: తీవ్రమైన జ్వరం, ముసలిన శరీర నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు, రక్తపోటు తగ్గిపోవడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంటి విధంగా ఉంటాయి.
Date : 07-07-2025 - 6:21 IST -
Hanako Koi Fish : చేపలు కూడా శతాబ్దాల జీవులు కావచ్చా? ‘హనకో’ కథ తో ఆలోచన మారుతోంది ..!
అయితే, ఈ చేపలు ఎక్కువ రోజులు బతకవని, కొన్ని సంవత్సరాల్లోనే చనిపోతాయని చాలామంది భావించటం సర్వసాధారణం. కానీ, ఈ అపోహలను తుడిచిపెట్టేస్తూ, ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఒక అద్భుతమైన కోయ్ చేప 'హనకో'.
Date : 07-07-2025 - 5:56 IST -
Fake Currency : ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు..నిందితుల నుంచి రూ. 500 నోట్లు స్వాధీనం..
వాయల్పాడు పట్టణంలోని లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద నకిలీ కరెన్సీ నోట్లను వినియోగించిన దొంగల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
Date : 07-07-2025 - 5:28 IST -
King Cobra : 18 అడుగుల పొడువైన కింగ్ కోబ్రాను పట్టుకున్నమహిళా అధికారి..ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్
కానీ కేరళలోని ఓ మహిళా ఫారెస్ట్ అధికారి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆమె 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎలాంటి బెదురు లేకుండా పట్టేసి ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
Date : 07-07-2025 - 4:50 IST -
Uttar Pradesh : రైల్వే ప్లాట్ఫాంపై హెయిర్ క్లిప్పు, చిన్నకత్తితో ప్రసవం..ఆర్మీ డాక్టర్ పై ప్రశంసలు
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన డాక్టర్ రోహిత్, అక్కడి రైల్వే సిబ్బందితో కలిసి తక్షణమే మహిళకు డెలివరీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అక్కడ ఎటువంటి వైద్య పరికరాలు లేకపోయినా, కేవలం తన దగ్గర ఉన్న హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్ సహాయంతో ప్రసవం విజయవంతంగా జరిపాడు.
Date : 07-07-2025 - 4:05 IST -
Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !
అసలైన భవనాలులేక, విద్యార్థులు తీవ్ర అసౌకర్యాలతో చదువుకుంటున్నారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ మండలం-II పరిధిలో ఉన్న 13 ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ ప్రైవేట్ నివాస భవనాల్లో నడుస్తున్నాయి. ఇందులో కొన్ని పాఠశాలలు నెలకు రూ. 30,000 దాటే అద్దెలు చెల్లిస్తున్నాయి.
Date : 07-07-2025 - 3:15 IST -
Assam : కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో హృదయాన్ని కదిలించే సంఘటన
కాజీరంగ జాతీయ ఉద్యానవనానికి సమీపంలోని బోర్జురి గ్రామంలో స్థానికులు ఓ చిన్న ఏనుగు దూడ ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాన్ని గమనించారు. దానికి తల్లిదండ్రులు తోడిలేకపోవడం చూసి వారు చాలా చలించిపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
Date : 07-07-2025 - 2:39 IST -
Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…
ఈ నేపథ్యంలో, రాణా విచారణలో కొన్ని కీలక అంశాలను అంగీకరించినట్లు సమాచారం. తహవ్వుర్ రాణా తనను తాను పాకిస్థాన్ సైన్యం నమ్మిన గూఢచారి అని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ముంబై దాడుల ప్రధాన కుట్రకర్త డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో తన సన్నిహిత సంబంధాలను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
Date : 07-07-2025 - 2:16 IST -
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది.
Date : 07-07-2025 - 1:34 IST -
Water from Air : ఇకపై గాలి నుంచే స్వచ్ఛమైన మంచినీళ్లు..అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
. ఈ కొత్త ఆవిష్కరణలో భాగంగా ఎంఐటీ పరిశోధకులు ఒక ప్రత్యేక విండో ప్యానెల్ను రూపొందించారు. ఇది విద్యుత్ లేకుండానే గాలిలోని తేమను గ్రహించి, దాన్ని స్వచ్ఛమైన తాగునీటిగా మార్చగలదు. ఈ పరికరం రోజుకు సుమారు 5 నుంచి 6 లీటర్ల వరకు నీటిని ఉత్పత్తి చేస్తుంది.
Date : 07-07-2025 - 1:14 IST -
Nara Lokesh : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం: మంత్రి లోకేశ్
ఈ హైస్కూల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు.
Date : 07-07-2025 - 12:25 IST -
Happy Passia : ఉగ్రవాది హ్యాపీ పాసియాను భారత్కు తరలించేందుకు రంగం సిద్ధం
హ్యాపీ పాసియా అనేక ఉగ్రవాద చర్యల్లో భాగస్వామిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్లోని పోలీస్ స్టేషన్లు, ప్రజా సేవా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడుల్లో అతడి ప్రమేయం స్పష్టమైందని అనుమానాలు వెల్లువెత్తాయి.
Date : 07-07-2025 - 11:42 IST -
Vana Mahotsavam : రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం: సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరాశక్తి క్యాంటీన్లను కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేశాం. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధానాన్ని అమలుపరుస్తున్నాం, అని చెప్పారు. ఆత్మనిర్బర్ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Date : 07-07-2025 - 11:24 IST -
US Tariffs : అధిక సుంకాలపై వెనక్కి తగ్గని ట్రంప్ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచే అమలు
ఈ నిర్ణయం గురించి సంబంధిత దేశాలకు జూలై 9వ తేదీలోగా అధికారికంగా తెలియజేయనున్నారు. సుంకాల అమలుకు సంబంధించిన తాజా టారిఫ్ రేట్ల వివరాలు కూడా అదే రోజున దేశాల ప్రభుత్వాలకు చేరేలా లేఖలు పంపనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం వెల్లడించారు.
Date : 07-07-2025 - 11:03 IST -
Unified Pension Scheme: ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ శుభవార్త!
ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఏప్రిల్ 1, 2025 నుండి కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసులలో చేరిన వారికి NPS కింద ఒక ఎంపికగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను పరిచయం చేశారు. UPS కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి మూల వేతనం, డియర్నెస్ అలవెన్స్లో 18.5% సహకారం అందిస్తుంది.
Date : 06-07-2025 - 7:12 IST -
Tholi Ekadashi 2025: రేపే తొలి ఏకాదశి.. ఏ పనులు చేయొచ్చు? ఏ పనులు చేయకూడదు?
స్థానిక సంప్రదాయాలు, గురువుల సలహాలను కూడా అనుసరించడం ముఖ్యం. ఎందుకంటే కొన్ని నియమాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు
Date : 05-07-2025 - 7:30 IST