HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >India Is Like The Mother Of Democracy Pm Modi

PM Modi : భారత్‌ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది: ప్రధాని మోడీ

ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్యం మన ప్రాథమిక విలువల్లో ఒకటి. అది ప్రజల మధ్య చర్చకు ఆస్కారం కల్పిస్తుంది, ఐక్యతను పెంపొందిస్తుంది, గౌరవాన్ని బలపరుస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని అన్నారు.

  • Author : Latha Suma Date : 03-07-2025 - 6:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Government
Indian Government

PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఘనా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ప్రపంచ ప్రజాస్వామ్య విలువలకు చక్కటి ఉదాహరణగా నిలిచింది భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సభలో ఉత్సాహం కలిగించింది. ఘనా పార్లమెంట్‌లో ప్రసంగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్యం మన ప్రాథమిక విలువల్లో ఒకటి. అది ప్రజల మధ్య చర్చకు ఆస్కారం కల్పిస్తుంది, ఐక్యతను పెంపొందిస్తుంది, గౌరవాన్ని బలపరుస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని అన్నారు. ఆయన హిందీలో మాట్లాడుతూ, “హమారే లియే లోక్తంత్ర వ్యవస్థ నహీ, సంస్కార్ హై,” అని పేర్కొన్నారు. దీని అర్థాన్ని ఆయన ఆంగ్లంలో కూడా వివరించారు. “For us, democracy is not just a system, it is a part of our culture.”

Read Also: Covid Vaccine : కోవిడ్ వ్యాక్సిన్‌లపై ఆరోపణలపై స్పందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

ప్రధాని మోడీ ప్రసంగంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క బలాన్ని, విస్తృత వైవిధ్యాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. భారతదేశంలో 2,500 పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని, అందులో సుమారు 20 వేర్వేరు పార్టీలు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని వివరించారు. ఈ ప్రకటనపై ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యంతో స్పందించగా, సభలో చిరునవ్వులు చిందించాయి. సభాపతి అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ మోడీ పేర్కొన్న 2,500 పార్టీలు అనే అంశాన్ని మళ్లీ ప్రస్తావించడంతో సభలో హాస్య వాతావరణం ఏర్పడింది. భారత ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని వివరించారు. భారతదేశం అంతటా 22 అధికారిక భాషలు ఉన్నాయి. వేలాది మాండలికాలు మాట్లాడతారు. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు కలగలసిన దేశమిది. ఇది ప్రజాస్వామ్యానికి బలాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వమే భారత ప్రజాస్వామ్య విజయానికి కారణమని ఆయన వివరించారు.

ఇంకా భారతదేశం ఇతర దేశాల నుండి వచ్చిన వారిని హృదయపూర్వకంగా స్వీకరించే సహజ స్వభావాన్ని కలిగి ఉంది. అందుకే భారతీయులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా స్థానికులతో సులభంగా కలిసిపోతారు అని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన భారత సంస్కృతిలో అంతర్నిహితమైన సహనాన్ని, సహజ అన్వయ సామర్థ్యాన్ని తెలియజేశారు. ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య విలువలకు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యతను నొక్కిచెప్పింది. ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపే దేశంగా భారత పాత్ర మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటోందని ఈ సందేశం ద్వారా స్పష్టం అయింది.

Read Also: USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DemocracySpeech
  • Ghana Parliament
  • india
  • India Mother Of Democracy
  • pm modi

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

    Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

  • Balochistan has 'declared independence' from Pakistan.

    Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

  • Vikram-1 launch today; PM Modi supports Skyroot mission, describing it as a historic milestone.

    Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్‌కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd