HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Did Kavitha Talk About Bcs When She Was In Power Mahesh Kumar Goud

Congress : అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా?: మహేశ్‌ కుమార్‌గౌడ్‌

హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్ మాట్లాడారు. కవిత లేఖను ఎందుకు, ఎవరి హోదాలో రాసిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఈ లేఖను భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నాయకురాలిగా రాసారా? లేక జాగృతి అధ్యక్షురాలిగా రాసారా? అని ప్రశ్నించారు.

  • By Latha Suma Published Date - 02:31 PM, Thu - 3 July 25
  • daily-hunt
Did Kavitha talk about BCs when she was in power?: Mahesh Kumar Goud
Did Kavitha talk about BCs when she was in power?: Mahesh Kumar Goud

Congress : బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా స్పందించారు. కవిత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖను ఆయన హాస్యాస్పదంగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్ మాట్లాడారు. కవిత లేఖను ఎందుకు, ఎవరి హోదాలో రాసిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఈ లేఖను భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నాయకురాలిగా రాసారా? లేక జాగృతి అధ్యక్షురాలిగా రాసారా? అని ప్రశ్నించారు. పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై కవిత ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన నిలదీశారు.

Read Also: Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్‌

కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లను 34 శాతం నుంచి 21 శాతానికి తగ్గించిందని, ఇది బీసీలకు తీవ్ర అన్యాయం అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కవిత ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. అంతేకాక, 2014 నుంచి 2018 వరకు తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రిణీ లేకపోయినా, మహిళల తరఫున కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మీరు మహిళా ఉద్యమాల నాయకురాలిగా మాట్లాడుతున్నప్పుడు, మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎందుకు పోరాటాలు చేయలేదని ఆయన మండిపడ్డారు. మహిళా సాధికారత, బీసీల హక్కుల గురించి ఇప్పుడు మాట్లాడడం రాజకీయ పతనాన్ని కప్పిపుచ్చేందుకు చేసే ప్రయత్నమేనని విమర్శించారు.

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ‘సామాజిక సమరభేరి’ పేరిట భారీ బహిరంగ సభను టీపీసీసీ ఏర్పాటు చేయనుందని మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని గ్రామ కమిటీల సభ్యులతో మాట్లాడనున్నారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల సమస్యలను కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బీసీల హక్కులకు కట్టుబడి ఉందని నిరూపించబోతున్నట్టు తెలిపారు. ఒక్క లేఖ రాయడం కాదు… న్యాయం చేయాలంటే హృదయం కావాలి అంటూ కవితపై ఆయన వ్యాఖ్యలు ముగించారు.

Read Also: CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదు – చంద్రబాబు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AICC President Kharge
  • BC reservations issue
  • BRS MLC kavitha
  • congress
  • letter
  • TPCC President Mahesh Kumar Goud

Related News

CM Revanth Reddy

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd