IPL 2025 Auction Venue: ఐపీఎల్ మెగా వేలం వేదిక మార్పు.. వేలంలోకి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు!
ఈసారి వేలంలో 409 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ పేర్లను అందించారు.
- Author : Gopichand
Date : 05-11-2024 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2025 Auction Venue: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్కు ముందు నిర్వహించే మెగా వేలం తేదీలు అంటే 2025లో జరగనున్న ఐపీఎల్ తేదీలు ప్రకటించబడ్డాయి. ఈసారి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో (IPL 2025 Auction Venue) నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. అంతకుముందు అక్టోబర్ 31న మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. ఇందులో అన్ని జట్లతో కలిపి మొత్తం 204 మంది ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు.
409 మంది విదేశీ ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు
ఈసారి వేలంలో 409 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ పేర్లను అందించారు. ఇందులో 6 అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన చాలా మంది ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను ఇచ్చారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండో స్థానంలో ఉన్నారు.
ఏ జట్టు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుందంటే..
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, మతిషా పతిరనా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్
గుజరాత్ టైటాన్స్: రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్
కోల్కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని
ముంబై ఇండియన్స్: జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ
పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్
సన్రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్