వైసీపీ అధినేత జగన్కు చెంప దెబ్బ!
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.
- Author : Gopichand
Date : 11-03-2026 - 9:56 IST
Published By : Hashtagu Telugu Desk
Jagan: గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు, ఐటీ కంపెనీలకు చేసిన భూకేటాయింపులను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఉన్న విన్నపాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి వర్గానికి గట్టి షాక్ ఇచ్చింది.
ప్రోత్సాహకాలు లేకపోతే పెట్టుబడులు రావు
పరిశ్రమలకు తక్కువ ధరకు భూములు ఇచ్చారని, ఆ కేటాయింపులను రద్దు చేయాలని ఎంపీ కోరగా.. హైకోర్టు ధీటుగా స్పందించింది. “ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకు వస్తుంది?” అని కోర్టు ప్రశ్నించింది. నేడు ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం తీవ్రమైన పోటీ ఉందని, అటువంటి తరుణంలో మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వేరే చోటికి వెళ్లిపోతాయని ఎద్దేవా చేసింది. పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.
Also Read: Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్
ఐటీ రంగం – తెలుగు వారి ప్రాభవం
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తెలుగు వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పుడు, అటువంటి విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఐటీ హబ్ వల్ల రాష్ట్రానికి కలిగే విస్తృత ప్రయోజనాలను భవిష్యత్ తరాలు చూస్తాయని, అభివృద్ధిని అడ్డుకునే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించింది.
ప్రచారం కోసమే పిటిషన్లా?
ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు తమ పారిశ్రామిక విధానాలను (Policies) అనుసరించి నిర్ణయాలు తీసుకుంటాయని, వాటిలో లోపాలు వెతకడం కంటే అభివృద్ధి కోణంలో చూడాలని సూచించింది.