Speed News
-
Trailer: ‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్ రిలీజ్!
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ
Date : 25-12-2021 - 12:22 IST -
Omicron: ఓమిక్రాన్తో బాధపడుతున్న పది మంది రికవరీ!
రాకపోకల నిమిత్తం అంతర్జాతీయ ప్రయాణికులు తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే. వాళ్లలో కొంతమంది ఓమిక్రాన్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ మీడియా బులెటిన్ ప్రకార.. ఓమిక్రాన్తో బాధపడుతున్న పది మంది వ్యక్తులు కోలుకున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా రాష్ట్రం 38 ఓమిక్రాన్ కేసులను గుర్తించింది. ప్రజారోగ్య నిపుణులు సూచించిన విధంగా
Date : 25-12-2021 - 11:42 IST -
Owaisi: ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఒవైసీ వార్నింగ్!
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బహిరంగంగా విరుచుకుపడ్డారు. మోదీ, యోగీ పదవుల నుంచి దిగిపోయిన తర్వాత ఎవరూ మిమ్మల్ని కాపాడలేరన్న విధంగా ఆయన కాన్పూర్ లో జరిగిన బహిరంగ సభ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అసుదుద్దీన్ ఆవేశపూరిత ప్రసంగానికి సభకు హాజరైన వారు హర్షామోదాలు తెలియజేసినట్టు వీడియో చూస్
Date : 25-12-2021 - 11:22 IST -
Tiger Skin: పులిచర్మాల స్మగ్లింగ్
పులి చర్మం విక్రయించడానికి ప్రయత్నం చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేయగా రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని అనుమానించి చెక్ చేయగా వారిదగ్గర పులిచర్మం దొరికింది. అది నిజమైన పులిచర్మమా కాదా అనే విషయాన్ని పోలీసులు ఫారెస్ట
Date : 25-12-2021 - 9:26 IST -
UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది
ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Date : 25-12-2021 - 9:19 IST -
Omicron:న్యూ ఈయర్ వేడుకలకు ఓమిక్రాన్ దెబ్బ
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఓమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించిన నేపధ్యంలో పలు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
Date : 25-12-2021 - 9:09 IST -
New CP: 30 మంది ఐపీఎస్ ల బదిలీ, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. వీరిలో కొందరికి స్థానచలనం అవ్వగా మరికొంతమంది వెయిటింగ్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు. కొంతమంది కీలక అధికారులకు కూడా బదిలీ తప్పలేదు. బదిలీ అయిన వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. వారిలో ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ ఏసీబీ డైరెక్టర్గా షికాగోయల్, క్రైమ్ సిట్
Date : 25-12-2021 - 12:02 IST -
Revanth On KCR:కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రేవంత్ మీటింగ్
డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.
Date : 24-12-2021 - 11:33 IST -
Swachh Telangana:తెలంగాణకి మరో అవార్డు
తెలంగాణ రాష్ట్రానికి మరో అవార్డు లభించింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా రికార్డు సొంతం చేసుకొంది. ఈ కార్యక్రమంలో భాగమైన స్వచ్చ తెలంగాణ, భారత్ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు కేంద్రం అభినందనలు తెలిపింది.
Date : 24-12-2021 - 10:32 IST -
Inter: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ విద్యార్థులంతా పాస్!
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
Date : 24-12-2021 - 10:20 IST -
Textile GST: కేంద్ర విధానాలపై కేటీఆర్ ఫైర్!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శులు చేశారు. కేంద్రం విధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు, జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు.
Date : 24-12-2021 - 10:17 IST -
Maoists Statement:మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన
మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.
Date : 24-12-2021 - 10:02 IST -
AP Governor : వరద బాధితులకు గవర్నర్ చేయూత
ఏపీలో భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తేరుకోలేకపోతున్నారు. కూడు, గూడు, గుడ్డ కుసైతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన విఛక్షణాధికారాలతో రెడ్క్రాస్కు రూ.25లక్షల నిధులు సమకూర్చారు. వాటితో వరద బాధితుల సహాయార్థం సామగ్రిని సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన లారీలను శుక్రవారం గవర్నర్ జెండా ఊపి ప
Date : 24-12-2021 - 5:42 IST -
Delhi: ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి
ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ మొదటి డోసు వేసినట్లు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి , అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇతర అధికారులకు ధన్యవాదాలు చెబుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినీయలేదు. 👏👏Delhi
Date : 24-12-2021 - 5:37 IST -
Alert: ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగొచ్చు.. అప్రమత్తంగా ఉండండి.
దేశంలో ఉగ్రకదలికలు పెరుగుతున్న వేళ నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. నిన్న పంజాబ్ లో జరిగిన లుథియానా బాంబ్ బ్లాస్ట్ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులకు అసలు నిజాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. పంజాబ్ లో ఎన్నికలు రానుండటంతో మరిన్ని బాంబ్ దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంటలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు భద్రతా దళాలలను హెచ్చరిస్తూ వస్తోంది. క
Date : 24-12-2021 - 5:15 IST -
Politics: కౌలు రైతు నానాజీది ప్రభుత్వ హత్యే: నారా లోకేశ్
చెరకు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. చెరకు బిల్లులు చెల్లించాలని విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని ఎన్సీఎస్ ఫ్యాక్టరీ ఎదుట రాస్తారోకోకి దిగిన చెరకు రైతుల్ని చావగొట్టిన పోలీసులు… తిరిగి రైతులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 10.65 కోట్ల బకాయిలు చెల్లించాలని
Date : 24-12-2021 - 5:01 IST -
Telangana: టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు!
టికెట్ల విషయమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దూమరం రేగుతోంది. ఒకవైపు హీరోలు, మరోవైపు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్ ధరను (జీఎస్టీ అదనం) నిర్ణయించారు. మల్టీప్లెక్స్ల్లో మినిమం టికెట్ ధర రూ.100+జీఎస్టీ, గరిష్ఠంగా రూ.250+జీఎస్టీగా ధరన
Date : 24-12-2021 - 4:09 IST -
Politics: నా కుటుంబాన్ని దేశద్రోహుల కుటుంబం అంటున్నారు: అశోక్ గజపతిరాజు
రామతీర్థం ఘటనలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. తనకు పోలీసులు 41ఏ నోటీసును ఇచ్చారని చెప్పారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థం ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంల
Date : 24-12-2021 - 4:05 IST -
Cricket: క్రికెట్ కి హర్భజన్ సింగ్ గుడ్ బై
అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 41 సంవత్సరాల హర్భజన్ సింగ్ 1998లో న్యూజిలాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరగేంట్రం చేశాడు. ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులు, 236 ఓడిఐ, 28 టీ ట్వంటీ మ్యాచులు ఇండియా తరపున ఆడాడు. 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినా టీం లో ప్లేయర్ గా హర్భజన్ ఉన్నారు. ఈ […
Date : 24-12-2021 - 3:23 IST -
CJI: సీజేఐ హోదాలో తొలిసారిగా సొంతూరికి!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ పై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఎడ్లబండి పై ఊరేగింపు తో మేళా తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణ ను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు. ఊరేగి
Date : 24-12-2021 - 2:54 IST