AIMIM:నోట్ల రద్దు వైఫల్యాన్ని మోదీ అంగీకరించాలి – ఓవైసీ
ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యాపారి నివాసంలో భారీ నగదు పట్టుబడటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని ఆరోపించారు.
- By Hashtag U Published Date - 10:47 PM, Wed - 29 December 21
ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యాపారి నివాసంలో భారీ నగదు పట్టుబడటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని ఆరోపించారు. 2016లో జరిగిన డీమోనిటైజేషన్ ) తర్వాత ఇంత నగదు ఎలా దొరికిందని ప్రధానిని అడగాలని అన్నారు. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు పలుమార్లు జరిపిన దాడుల్లో కాన్పూర్లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో దాదాపు రూ.257 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఎవరికి చెందుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. పేదలు, చిన్నతరహా పరిశ్రమలు మాత్రమే నష్టపోయాయని, నోట్ల రద్దు విఫలమైందని ప్రధాని అంగీకరించాలని డిమాండ్ చేశారు.
Barrister @asadowaisi spoke at a press conference about the discovery of 180 crores at the home of a businessman in Uttar Pradesh, the Malegaon Blast case, and Uttar Pradesh elections#MalegaonBlast #UPElection2022 #KanpurITRaid https://t.co/7u56De1vZd
— AIMIM (@aimim_national) December 29, 2021
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం