Speed News
-
Viral : పిక్ ఆఫ్ ది డే.. ఆ నలుగురు ఓకేచోట!
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ RRR టీమ్ మొత్తం సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్, లీడ్ యాక్టర్స్ హైప్ ని కొనసాగించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ వారు రానా దగ్గుబాటిని అతని ముంబై ఫ్లాట్లో కలుసుకున్నారు. అతనితో సరదాగా గడి
Date : 23-12-2021 - 3:31 IST -
Thirupathi: శ్రీవారి దర్శనానికి విచ్చేసిన శ్రీలంక ప్రధాని కుటుంబం..
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఈ మధ్యాహ్నం భారత్ చేరుకున్న శ్రీలంక ప్రధానికి రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ హార్దిక స్వాగతం పలికారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న రాజపక్స కుటుంబం రేపు ఉదయం శ్రీవా
Date : 23-12-2021 - 3:27 IST -
India: కుమారుడు అడిగాడని..తండ్రి తపన- మహీంద్రా ట్వీట్
కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది.
Date : 23-12-2021 - 3:10 IST -
India: పంజాబ్ కోర్టులో భారీ బ్లాస్ట్
పంజాబ్ లోని లుధియానా కోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ అంతస్థులో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. బ్లాస్ట్ బాత్రూం లో చోటు చేసుకోగా పేలుడు తీవ్రతకు గోడలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో బ్లాస్టుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటల
Date : 23-12-2021 - 2:40 IST -
CBN: రైతుల కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది!
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. దేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రైతు పడుతున్న కష్టాలు చూస్తుంటే బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దుక్కి దున్నిన నాటి నుండి పంటను అమ్మి డబ్బు చేతికొచ్చే వరకు రై
Date : 23-12-2021 - 1:30 IST -
Cinema: ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు
‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని అయన చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి నాని అన్నారు. ట
Date : 23-12-2021 - 1:18 IST -
India: విచారణకు హాజరైన కంగనా..
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో విచారణ నిమిత్తం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను ఆమె తీవ్రవాదులతో పోల్చారు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో ఎప్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసులు కంగనా రనౌత్ ను జనవరి 25 వరకు అరెస్టు చే
Date : 23-12-2021 - 1:05 IST -
Telangana: KCR ఫామ్హౌస్లో యువకుడి మృతి పట్ల RSP సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ఫామ్ హౌస్లో యువకుడు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. యువకుడి మరణంతో ప్రభుత్వం పై అటు కుటుంబ సభ్యులు, ఇటు ప్రతి పక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్పి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్లోని యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వెంటనే యువకుడి అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని
Date : 23-12-2021 - 12:35 IST -
China: లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
చైనా లోని జియాన్ ప్రాతంలో గురువారం నుండి లాక్ డౌన్ విధించనున్నారు. చైనాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో దాదాపు కోటి 30 లక్షల మంది ప్రజలు లాక్ డౌన్లో ఉండనునట్టు అంచనా. నిత్యావసర సరుకులకోసం, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఒ
Date : 23-12-2021 - 12:21 IST -
India: హైదరాబాద్ లో మున్నవార్ ఫారూఖీ షో
స్టాండప్ కమిడియన్ మున్నవార్ ఫారూఖీ 2022 జనవరి 9న హైదరాబాద్ లో షో నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఫారూఖ్ మాట్లాడాడని బీజేపీ నేత ఆరోపణ చేయడంతో అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో మున్నావర్ ఫారూకీ షో నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
Date : 23-12-2021 - 11:43 IST -
Omicron: ఒమిక్రాన్ తో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు తక్కువే
మన దేశంలోనూ కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 236కు, తెలంగాణలో వీటి సంఖ్య 38కు చేరుకుంది. అయితే, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ వైరస్ కారణంగా అనారోగ్య తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు అమెరికా వైద్యులు తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు రెండు బ్రిటిష్ తాజా అధ్యయనాలు కూడా తేల్చడం ఊరటనిచ్చేదే. ఒమి
Date : 23-12-2021 - 11:12 IST -
Cinema: ఏపీలో 50 థియేటర్ల మూసివేత!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా.. జీవో 35ని రద్దు చేస్తూ, టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డి
Date : 23-12-2021 - 11:02 IST -
Cong Padayatra:జనవరి30 నుండి కాంగ్రెస్ పాదయాత్ర
జనవరి 30 నుంచి కాంగ్రేస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
Date : 22-12-2021 - 11:24 IST -
Telangana Employees: ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల డెడ్ లైన్
వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తరువాత వీఆర్ఏ లపై పనిభారం విపరీతంగా పెరిగిందని వీఆర్ఏ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.
Date : 22-12-2021 - 11:03 IST -
Pushpa : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ టీం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప మూవీ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. వరల్డ్ వైడ్ గా మంచి టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి పుష్ప సక్సెస్ కావడంతో విజయోత్సవ వేడుకులను జరుపుకుంది. తాజాగా పుష్పటీం తిరుమల శ్రీవారి పుష్ప చిత్ర బృందం దర్శిచుకుంది. దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల
Date : 22-12-2021 - 5:30 IST -
Ola Cabs: ట్రిప్ వివరాలు తెలిసేలా ‘ఓలా’ మార్పులు!
రైల్వేస్టేషన్ కు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకుంటాం. కొద్ది సేపు వేచి చూసి, ఇక క్యాబ్ దగ్గరకు వచ్చేసిందనుకుని ఊపిరి తీసుకునేలోపే.. మొబైల్ మోగుతుంది.
Date : 22-12-2021 - 5:06 IST -
India: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రద్దు
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బయటకి వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం, ఫీజికల్ డిస్టాన్స్ పాటించడం తప్పనిసరి చేసింది లేకుంటే భారీ ఎత్తున్న జరిమానా విధించనుంది. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభ
Date : 22-12-2021 - 4:48 IST -
India: లక్ష్వాదీప్ లో నిరసనలు
లక్ష్వాదీప్ లో నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ఉన్న సెలవు దినాన్ని ఆదివారంగా ప్రకటించడంతో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. లక్ష్వాదీప్ దివిలో 96% ముస్లిములు నివసిస్తారు. వారికీ శుక్రవారం నాడు నమాజ్ తప్పని సరి కాబట్టి అక్కడ శుక్రవారం రోజును సెలవుదినంగా కొన్ని దశాబ్దాలనుండి పాటిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతగా ఉన్న లక్ష్వాదీప్ కు ప్రఫుల్ ఖోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్
Date : 22-12-2021 - 4:17 IST -
Telangana: కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగానికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులందరిని పాస్ చేయాలని అయన లేఖలో కోరారు. కరోనా పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి 35 మార్కులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఆలస్య
Date : 22-12-2021 - 3:52 IST -
India: ‘ప్రళయ్’ విజయవంతం – DRDO
భారత రక్షణ శాఖలో మరో అస్త్రం. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ని ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ‘ప్రళయ్’ అత్యంత కచ్చితత్వం (హై డిగ్రీ)తో లక్ష్యాన్ని ఛేదించిందని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వెల్లడించింది. ప్రళయ్ లోని అన్ని సాంకేత
Date : 22-12-2021 - 3:08 IST