HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Indias First Indigenously Built 8 Qubit Quantum Computer Will Be Set Up In Amaravati

Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!

ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.

  • Author : Gopichand Date : 24-07-2025 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి (Amaravati) క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్‌లో QPIAI (Quantum Photonics Institute of Artificial Intelligence) కీలక భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు అవుతున్న ఈ క్వాంటం వ్యాలీలో QPIAI సంస్థ అధునాతన 8-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు QPIAI వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్‌తో చర్చించారు.

ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని QPIAIని ముఖ్యమంత్రి కోరారు. తద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు క్వాంటం అల్గారిథమ్‌లు, అప్లికేషన్‌లను రూపొందించుకునేందుకు విస్తృత అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read: Rishabh Pant: రిష‌బ్ పంత్ స్థానంలో జ‌ట్టులోకి రానున్న ఇషాన్ కిష‌న్‌..?!

Andhra Pradesh is set to deploy India’s first indigenously built 8-qubit quantum computer this November in Amaravati, with support from @QpiAI. This initiative, backed by the National Quantum Mission, aims to transform agriculture, water management, and healthcare. I would like… pic.twitter.com/T6mxGDZIOq

— N Chandrababu Naidu (@ncbn) July 24, 2025

క్వాంటం కంప్యూటింగ్ సేవలను కేవలం పరిశోధనలకే పరిమితం చేయకుండా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

వ్యవసాయ రంగం: రాష్ట్రంలో వివిధ పంటల సాగులో కచ్చితత్వం, తెగుళ్లను అంచనా వేయడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు సకాలంలో సూచనలు, సలహాలు అందించడం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపరచడానికి క్వాంటం కంప్యూటింగ్ ఉపకరించాలని సీఎం పేర్కొన్నారు.

నీటి వనరుల నిర్వహణ: రాష్ట్రంలో నీటి వనరులను సమర్థంగా నిర్వహించేందుకు క్వాంటం టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు.

వైద్య రంగం: వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ వంటి అంశాల్లోనూ క్వాంటం సిమ్యులేషన్‌ను సమర్థంగా వినియోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

నైపుణ్య అభివృద్ధి: యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలో కూడా క్వాంటం టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచన చేస్తోంది.

క్వాంటం వంటి ఆధునిక సాంకేతికత ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్నాలజీ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా QPIAI, నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • Quantum Computing
  • Quantum Valley

Related News

Bullet Railway Andhra Prade

ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

Bullet Railway : ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగంగా ఈ మార్గంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మంగళవారం భూ పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైల్వే లైన్ అనంతపురం జిల్లా మీదుగా వెళ్

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

  • Godavari Pushkaralu 2027

    Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

Latest News

  • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd