Amaravati
-
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. నూతన పర్యాటక విధానంలో భాగంగా హోటల్స్కు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణానికి మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించగా.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ హోటల్ను రూ.82.49 కోట్లతో ఒంగోలుకు సమీపంలోని చదలవాడలో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో ఉంది. పరిశ్రమలతో పాటుగా పర్యాటకశాఖ […]
Date : 17-04-2026 - 2:15 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?
రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో పేర్ని నాని అమరావతి భవితవ్యంపై నోరు జారారు. "నాలుగు వర్షం చినుకులు పడితే అమరావతి ఎలాగూ నీళ్లలో మునిగిపోతుంది" అని ఆయన అనడం కేవలం ఒక అంచనా మాత్రమే
Date : 15-04-2026 - 5:45 IST -
#Andhra Pradesh
Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!
ఇకపై అధికారికంగా 'Amaravati' అనే స్పెల్లింగ్ను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. గతంలో కొంతమంది 'Amaravathi' అని, మరికొందరు 'Amaravati' అని వేర్వేరుగా రాస్తుండటంతో అధికారిక ఉత్తర్వులు, ఫైళ్లు మరియు గెజిట్లలో గందరగోళం నెలకొనేది
Date : 15-04-2026 - 4:30 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతి పేరు మార్పు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఇప్పటివరకు ఉన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలనలో రాజధాని పేరును ఏకరూపంగా వాడేలా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అమరావతి ఇక నుంచి ‘Amaravathi’ (Thi) కి బదులుగా ‘Amaravati’ (Ti) అని మాత్రమే రాయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఉత్తర్వులు (జీవోలు), ఫైళ్లు, నోట్ షీట్లలో రాజధాని పేరును […]
Date : 15-04-2026 - 2:52 IST -
#Andhra Pradesh
India’s First Quantum Testbeds : దేశంలోనే తొలి ‘క్వాంటం’ కేంద్రం నేడు అమరావతిలో ప్రారంభం
భారతదేశ సాంకేతిక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం టెస్ట్బెడ్స్ (Quantum Testbeds) అమరావతి వేదికగా అందుబాటులోకి రానున్నాయి
Date : 14-04-2026 - 10:14 IST -
#Andhra Pradesh
Amaravati : భారత్ గ్లోబల్ డీప్టెక్ పవర్హౌస్గా అమరావతి
ప్రపంచ క్వాంటం రంగంలో ఉన్న కొద్దిపాటి విదేశీ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ, Bharat Quantum Reference Facilities (BQRF) అత్యంత సంక్లిష్టమైన హార్డ్వేర్ను భారత్లోనే తయారు చేస్తోంది
Date : 13-04-2026 - 1:19 IST -
#Andhra Pradesh
Ambati Rambabu: అమరావతిపై అంబటి విషం..
Amaravati ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, ఇది ఎప్పటికీ ముగియని కథ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి “మావిగన్” (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) MAVIGUN కారిడారే అసలైన మంత్రమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిన్న మాజీ మంత్రి విడదల రజని నివాసంలో […]
Date : 04-04-2026 - 10:50 IST -
#Andhra Pradesh
Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు
Amaravati రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వంగా ప్రకటించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూనే… విశాఖపట్నం, తిరుపతి […]
Date : 03-04-2026 - 3:04 IST -
#Andhra Pradesh
అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి ‘స్మృతి వనం’.. టెండర్లు ఆహ్వానిస్తున్న AGICL!
అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల వెంకటపాలెం గ్రామంలో సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న అటల్ బిహారీ వాజ్పేయి “స్మృతి వనం” డిజైన్, నిర్మాణ పనుల కోసం బిడ్లను ఆహ్వానించింది.
Date : 03-04-2026 - 9:55 IST -
#Andhra Pradesh
శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!
అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Date : 02-04-2026 - 7:51 IST -
#Andhra Pradesh
Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇదివరకే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చను […]
Date : 02-04-2026 - 5:26 IST -
#Andhra Pradesh
Rajya Sabha: అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు రాజ్యసభకు!
ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లును లోక్సభ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026’ను సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లుపై సభలో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు మద్దతు పలకగా, వైసీపీ […]
Date : 01-04-2026 - 2:54 IST -
#Andhra Pradesh
Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Amaravati కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29 వేల మంది రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించారని, మహిళలను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో ఇసుక పోసి హింసించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు […]
Date : 01-04-2026 - 2:46 IST -
#Andhra Pradesh
Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే […]
Date : 01-04-2026 - 2:29 IST -
#Andhra Pradesh
AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, “పులివెందుల ఎమ్మెల్యే జగన్.. మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవు” అంటూ తీవ్ర […]
Date : 01-04-2026 - 2:04 IST