Andhrapradesh
-
#Andhra Pradesh
వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అంచనావేశారు. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్దదిగానే ఉంది. మరోవైపు నాటి అక్రమాల్లో ప్రముఖ పాత్ర ఉన్న వారి ఆస్తులను కోర్టు […]
Date : 07-03-2026 - 3:27 IST -
#Andhra Pradesh
వెబ్సిరీస్లో ఛాన్స్ పేరిట యువతితో అసభ్య వీడియోలు
Kakinada Girl సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్కు వచ్చి, యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ […]
Date : 07-03-2026 - 2:54 IST -
#Andhra Pradesh
యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..
Egg Prices ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో రోజుకు సుమారు 5 కోట్ల […]
Date : 07-03-2026 - 10:24 IST -
#Andhra Pradesh
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
AP Government గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అదే సమయంలో, గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం శాసన మండలిలో ఈ బిల్లు ఆమోదం సందర్భంగా రాష్ట్ర స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి […]
Date : 05-03-2026 - 10:15 IST -
#Andhra Pradesh
కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలాచెరువు ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించడం వల్లే ఈ విషాదం […]
Date : 23-02-2026 - 2:37 IST -
#Andhra Pradesh
ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం
NTR Bharosa Pension ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు […]
Date : 23-02-2026 - 10:25 IST -
#Andhra Pradesh
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు […]
Date : 21-02-2026 - 4:53 IST -
#Andhra Pradesh
నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!
Nandamuri Balakrishna హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలకు చెక్ పెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు బాలయ్యపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురంలో సొంతింటి నిర్మాణం తలపెట్టారు బాలకృష్ణ. వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం రోజున ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమే అంటూ విమర్శకులకు కౌంటర్ […]
Date : 21-02-2026 - 4:01 IST -
#Andhra Pradesh
బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స
Acham Naidu Vs Botsa Satyanarayana ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆందోళన చేస్తున్నారని, […]
Date : 19-02-2026 - 1:50 IST -
#Andhra Pradesh
ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి
Andhra Pradesh Earthquake ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి […]
Date : 19-02-2026 - 11:15 IST -
#Andhra Pradesh
గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ
Andhrapradesh Govt ఏపీ ప్రభుత్వం ప్రజలకు, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సహం ఇచ్చేలా వీఎల్టీపై ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం తెలిపారు. నిర్మాణలకు సంబంధించి ఖాళీ స్థలాలపై విధించే పన్నులో 50శాతం రాయితీ ఇస్తారు. గతంలో నిర్మాణాలకు సంబంధించి ఖాళీ స్థలాలపై వంద శాతం పన్ను విధించేవారు. ఇకపై అనుమతులు పొందిన నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకూ 50శాతం పన్ను చెల్లిస్తే చాలు. ఏపీలో ప్రజలు, బిల్డర్లకు భారీ ఊరట వీఎల్టీ 50శాతానికి […]
Date : 19-02-2026 - 11:08 IST -
#Andhra Pradesh
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
Andhrapradesh Govt ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ పాలసీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీఏసీఎస్కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఉద్యోగుల హెచ్ఆర్ సంబంధిత సమస్యల్ని ఈ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ కీలక ఉత్తర్వులు జార చేసిన ఏపీ […]
Date : 18-02-2026 - 10:16 IST -
#Andhra Pradesh
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ
Dhulipalla Narendra పొన్నూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవికి చింతలపూడిలో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర వద్ద ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 సవర్ల బంగారంతో పాటుగా, పది కేజీల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ప్రమీలాదేవి ఫిర్యాదుతో పొన్నూరు రూరల్ పోలీసులు […]
Date : 17-02-2026 - 2:45 IST -
#Andhra Pradesh
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..
Madanapalle అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్బాడీని గుర్తించారు. కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను చంపినట్లు గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం అదృశ్యమైన బాలిక డెడ్బాడీ డ్రమ్ములో కులవర్దన్ అనే […]
Date : 17-02-2026 - 11:15 IST -
#Andhra Pradesh
మందుబాబులకు గుడ్ న్యూస్..
Liquor Bottles మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తారు. ఆ బాటిల్ ఖాళీ అయ్యాక దానిని టాస్మాక్ […]
Date : 16-02-2026 - 2:51 IST