HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ed Notices To Ycp Former Mp Vijayasai Reddy

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

  • Author : Vamsi Chowdary Korata Date : 17-01-2026 - 12:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ED Notice To EX MP VIjay Sai Reddy
ED Notice To EX MP VIjay Sai Reddy

ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది.

  • మాజీ మంత్రి విజయసాయి రెడ్డికి భారీ షాక్
  • నోటీసులు జారీ చేసిన ఈడీ
  • జనవరి 22న విచారణకు రావాలని ఆదేశం

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హైదరాబాద్ విభాగం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో విజయసాయి రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. జనవరి 22న ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 నుండి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన మద్యం విధానంపై దర్యాప్తులో భాగంగా విజయసాయి రెడ్డిని ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ దర్యాప్తు జరుగుతోంది.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో భారీగా లంచాలు తీసుకోవడం, నిధులు మళ్లించడం వంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మద్యం కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించగా.. తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా విచారిస్తోంది. సిట్ ప్రకారం, గత వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ద్వారా సరఫరాదారుల నుండి 15 నుంచి 20 శాతం వరకు లంచాలు వసూలు చేసిందని ఆరోపణలున్నాయి. లంచాలు ఇవ్వడానికి నిరాకరించిన ప్రముఖ మద్యం బ్రాండ్‌లను పక్కన పెట్టారని కూడా SIT తెలిపింది.

తదర్యాప్తు అధికారులు చెప్పిన దాని ప్రకారం, ఆటోమేటిక్ కొనుగోలు వ్యవస్థను తీసివేసి, మాన్యువల్ అనుమతులకు మార్చారు. దీనివల్ల సరఫరా ఆర్డర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. నకిలీ డిస్టిలరీలను ఏర్పాటు చేసి, ఎక్కువ మొత్తంలో సరఫరా ఆర్డర్లు పొంది, నకిలీ లావాదేవీల ద్వారా నిధులను మళ్లించారని కూడా ఆరోపణలున్నాయి. ఈడీ ఆరోపణల ప్రకారం, అర్హత ప్రమాణాలను మార్చి, సరఫరాదారులను లంచాలు ఇవ్వాలని బలవంతం చేశారు. నకిలీ విక్రేతల చెల్లింపులు, అధిక ధరల బిల్లులు, నకిలీ కంపెనీల ద్వారా లంచాలు సేకరించి, ఎన్నికల కోసం, వ్యక్తిగత లాభాల కోసం విదేశాలకు తరలించారని ఈడీ ఆరోపించింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మద్యం సరఫరాదారులకు చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని, వస్తువులు, సేవల కోసం చెల్లింపుల మాటున వివిధ కంపెనీలకు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. ఇలాంటి అనేక నకిలీవి, అధిక ధరలతో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో, నగదు, బంగారం కొనుగోలు చేయడానికి ఈ నిధులను నగల వ్యాపారులకు మళ్లించి, ఆ తర్వాత వాటిని నిందితులకు అప్పగించారని కూడా దర్యాప్తు అధికారులు ఆరోపించారు.

2019 నుండి 2024 మధ్యకాలంలో 16 మద్యం కంపెనీలు APSBCL నుండి సరఫరా ఆర్డర్లు పొందడానికి లంచాలు చెల్లించాయని సిట్ దర్యప్తులో వెల్లడైంది. ఈ కాంట్రాక్టుల విలువ రూ.10,835 కోట్లుగా తేల్చింది. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రూ.23,000 కోట్ల సరఫరా ఆర్డర్లలో ఇవి భాగం అని గుర్తించారు. లంచాల రూపంలో రూ.3,500 కోట్లకు పైగా నిధులు అనేక లావాదేవీల ద్వారా మళ్లించబడ్డాయని SIT అంచనా వేసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Andhrapradesh
  • AP Liquor Scam Case
  • ED summons
  • vijay sai reddy
  • YsJagan
  • YSR Congress Party

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

    Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

  • Janasena MLA Arava Sridhar Resigns from Whip Post

    Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd