Andhra Pradesh Politics
-
#Andhra Pradesh
Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా… ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచించిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైసీపీ హైకమాండ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తాడిపత్రిలో నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించారు. అయితే, శాంతిభద్రతల సమస్యలను ఉదహరిస్తూ […]
Date : 12-06-2026 - 12:25 IST -
#Andhra Pradesh
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డి అరెస్ట్
ఈ అరెస్టుకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఏకకాలంలో భారీ దాడులు నిర్వహించింది. రాజ్ కెసిరెడ్డితో పాటు మరో ఆరుగురు కీలక వ్యక్తుల నివాసాల్లో సోదాలు చేసింది. వీటిలో ఏపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులకు చెందిన కార్యాలయాలు, నివాస ప్రాంగణాలు ఉన్నాయి. ఈ స్కామ్కు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ […]
Date : 11-06-2026 - 2:50 IST -
#Andhra Pradesh
Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు తొలి మహిళా బాధితురాలిని తానేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అనుసరించిన నిరంకుశ విధానాలనే, నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తోందని, అరాచకాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండ లభించిందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు […]
Date : 01-06-2026 - 11:57 IST -
#Andhra Pradesh
GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు
రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాల వెనుక వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ… విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీ నేతలపై వేయాలని వైసీపీ ప్లాన్ చేసిందని, అయితే తీరా విచారణలో ఆ […]
Date : 01-06-2026 - 11:47 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్
చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేదు… సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం… గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి […]
Date : 23-05-2026 - 5:47 IST -
#Andhra Pradesh
Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో, కలిసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ ఇంఛార్జ్లతో ఆయన ఆన్లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈసారి మహానాడును ‘స్త్రీ శక్తి మహానాడు’ అనే థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని […]
Date : 23-05-2026 - 2:50 IST -
#Andhra Pradesh
Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే శ్రీధర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల అరవ శ్రీధర్పై రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా పార్టీ […]
Date : 23-05-2026 - 2:34 IST -
#Andhra Pradesh
Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్
వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ టీడీపీ, చంద్రబాబు హయాంలోనే జరిగాయంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన.. జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ సినిమా పాత్ర గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ తాత రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో, ఆనాటి వైఎస్ కుటుంబ అరాచకాలను బాధితుడు పార్థసారథిరెడ్డి స్వయంగా వివరించారని అచ్చెన్న గుర్తుచేశారు. రాజారెడ్డి హత్య కేసులో ఉన్న వ్యక్తి […]
Date : 22-05-2026 - 5:39 IST -
#Andhra Pradesh
Nara Lokesh: వైఎస్ జగన్కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గొడ్డలి పార్టీ’, ‘హత్యా రాజకీయాలు’ అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు… ఈరోజు కడపలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి తాను కొత్తగా ‘గొడ్డలి పార్టీ’ అని పేరు పెడితే జగన్ బాగా ఫీల్ అయ్యారని… కానీ గతంలో థియేటర్లలో ‘రప్పారప్పా’ అంటూ […]
Date : 22-05-2026 - 11:29 IST -
#Andhra Pradesh
Mahanadu 2026: ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్తో జరగనుంది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గురువారం నాడు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది. ఇంధన పొదుపు చర్యలలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి క్యాంపు […]
Date : 22-05-2026 - 9:07 IST -
#Andhra Pradesh
Bhuma Mounika Reddy: వచ్చే ఎన్నికల్లో మౌనిక అక్కడి నుంచే పోటీ.. క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని వెల్లడించారు. తాము ప్రస్తుతం రాజకీయాల్లో భాగమయ్యామని తెలిపారు. రేపు (మే 20న) తన పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఇటీవలే తాను ప్రారంభించిన ‘ఐఖ్య’ (AIKYA… Dhairya Sena Samithi) సంస్థపై వస్తున్న సందేహాలకు ఈ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. ‘ఐక్య’ అనేది రాజకీయ సంస్థ కాదని, […]
Date : 19-05-2026 - 3:31 IST -
#Andhra Pradesh
Ambati Rambabu: పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. పవన్ తన పార్టీని సీఎం అవ్వడానికి పెట్టలేదని, మరొకరిని సీఎం చేయడానికి పెట్టారని తమకు ఎప్పటినుంచో తెలుసంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ నటుడు విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ఒంటరిగా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో, పవన్ కూడా అలాగే గెలవాల్సిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై […]
Date : 16-05-2026 - 12:34 IST -
#Andhra Pradesh
Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్
కర్నూలులో నిన్న వైసీపీ నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో సగం మందికి పైగా గంజాయి బ్యాచ్, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారేనని బైరెడ్డి శబరి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కేవలం ‘స్క్రాప్’ మనుషులతో మాట్లాడిస్తున్నారని, చిల్లర ఇష్యూలను పట్టుకొని అలజడులు సృష్టించడం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ముఖ్యంగా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకునే ‘బాలు’ వంటి వ్యక్తుల కోసం వైసీపీ నాయకులు రోడ్లపైకి రావడం సిగ్గుచేటని విమర్శించారు. ముచ్చుమర్రిలో […]
Date : 15-05-2026 - 1:47 IST -
#Andhra Pradesh
YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!
కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. గత నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. పోలీసుల వేట తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. తాజాగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. దస్తగిరి […]
Date : 13-05-2026 - 3:40 IST -
#Andhra Pradesh
కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్పై కుట్ర…!!
కడపలో అకస్మాత్తుగా చెలరేగిన అల్లర్ల వెనుక వైసీపీ నాయకుల పక్కా ప్రణాళిక ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు అంశాన్ని సాకుగా చూపి, స్థానిక యువతను రెచ్చగొట్టి వీధుల్లోకి తెచ్చారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని వైసపీ నేతలు, ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అశాంతికి తెరలేపారు. ఈ హింసాకాండలో పాల్గొన్న వారంతా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రధాన అనుచరులని […]
Date : 13-05-2026 - 12:31 IST