Andhra Pradesh Politics
-
#Andhra Pradesh
జగన్ బతుకే ఒక అరాచకం.. గొడ్డలి రాజకీయాలు తెలుసు : మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ అధినేత జగన్ నిన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ బతుకే ఒక అరాచకమని, ఆయనకు అభివృద్ధి చేయడం తెలియదని, గొడ్డలి రాజకీయమే తెలుసని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేకే జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ […]
Date : 16-04-2026 - 2:45 IST -
#Andhra Pradesh
NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్ను ఎదుర్కొన్నారు. ‘పప్పు’ అని లోకేశ్ను ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ.. వర్థంతికి, జయంతికి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. వీటన్నింటినీ దాటుకొని.. తనను తాను మలుచుకుంటూ లోకేశ్ ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, […]
Date : 15-04-2026 - 2:03 IST -
#Andhra Pradesh
Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ సీనియర్లకు గౌరవం… కొత్తవారికి అవకాశాలు…సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చిన అధిష్టానం నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు…. ప్రతి కమిటీలోనూ నూతనత్వం 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర […]
Date : 15-04-2026 - 1:47 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్
Nara Lokesh తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి, కొత్త సమీకరణలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేశ్ను నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ల అనుభవానికి, యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం ఇస్తూ, సామాజిక కోణంలో కమిటీలను […]
Date : 15-04-2026 - 12:28 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ట్వీట్
Amaravati కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించి రాజధానిగా ఖరారు చేసింది. ఇంతలో వైఎస్సార్సీపీ మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై కొన్ని సూచనలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల గురించి ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి కొన్ని సలహాలు ఇచ్చారు. అలా చేస్తే బావుంటుందని చెప్పుకొచ్చారు. Bengaluru was founded in 1537 by Kempe Gowda, Hyderabad in […]
Date : 14-04-2026 - 10:32 IST -
#Andhra Pradesh
వైసీపీలో ఆత్మాహుతి దళం…. రాజకీయ పార్టీనా…. ఉగ్రవాద సంస్థనా?
వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన మిథున్ రెడ్డి, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం తామంతా ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తామని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పదజాలాన్ని వాడటం చర్చనీయాంశమైంది. పార్టీ పట్ల విధేయత చాటుకోవడంలో తప్పులేదు కానీ, ఆత్మాహుతి అనే పదం తీవ్రవాద భావజాలానికి దగ్గరగా ఉండటంతో రాజకీయ విశ్లేషకులు విస్మయం […]
Date : 13-04-2026 - 2:15 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబు తీరుపై చంద్రబాబు సీరియస్
Chadalavada Aravinda Babu పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే… నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించడం వివాదానికి కేంద్రబిందువైంది. జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సిఫారసు చేసిన రామినేని ప్రసాద్ పేరును ఎందుకు […]
Date : 04-04-2026 - 12:43 IST -
#Andhra Pradesh
AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన నిజాలు!
Amaravati గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ స్పందించారు. నాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తనను బెదిరించి, ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. శాసనమండలినే రద్దు చేస్తామన్నా సరే, తాను నిబంధనలకు లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధర్మంవైపు నిలబడ్డానన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు మంత్రులు తన పట్ల […]
Date : 03-04-2026 - 10:17 IST -
#Andhra Pradesh
Ys Jagan Plan B: రాజధానిపై జగన్ ప్లాన్ బీ.. మావిగన్ పేరుతో తెరపైకి కొత్త ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పేరును సూచించారు. భవిష్యత్తులో ఇది గ్రోత్ ఇంజిన్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శాసనసభలో […]
Date : 01-04-2026 - 1:37 IST -
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!
Amaravati అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైతే, వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తప్పుబట్టారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ వైఖరితోనే అర్థమవుతోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబు గారికి ‘సినిమా చూపిస్తా’ అని వైసీపీ అధినేత జగన్ […]
Date : 28-03-2026 - 3:20 IST -
#Andhra Pradesh
Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు
Nallapareddy Prasanna Kumar Reddy రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎక్కడో గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ సభ్యురాలు, నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిఫార్సుతో ఈ నిధులు మంజూరు కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి […]
Date : 28-03-2026 - 11:11 IST -
#Andhra Pradesh
Kodali Nani: 2029లో మళ్లీ ఆయనే సీఎం.. కూటమికి కొడాలి నాని మాస్ వార్నింగ్
Kodali Nani కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ ఏపీ ప్రజలకు తెలుస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు. 2024 ఎన్నికల […]
Date : 23-03-2026 - 12:16 IST -
#Andhra Pradesh
Nara Lokesh: పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్
Nara Lokesh ఏపీ మంత్రి నారా లోకేశ్ ఉగాది పర్వదినం సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పూజగదిలో కనిపించిన ఓ బొమ్మపై కొందరు నెటిజన్లు క్షుద్రపూజలంటూ ఆరోపణలు చేయడంతో లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగి ఆ వాదనలను ఖండిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలుగు ప్రజలంతా ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ కూడా తన నివాసంలో కుటుంబంతో కలిసి […]
Date : 20-03-2026 - 12:14 IST -
#Andhra Pradesh
మదనపల్లె ఫైళ్ల దహనం కేసు…. ఇక పెద్దిరెడ్డి అరెస్ట్…??
Madanapalle Files Burnt Case ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలను CID అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి తిరిగొస్తున్న నిందితుల కదలికలపై నిఘా ఉంచిన CID బృందం, తిరుపతి సమీపంలోని పనపాకం టోల్గేట్ దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పెద్దిరెడ్డికి […]
Date : 20-03-2026 - 11:36 IST -
#Andhra Pradesh
ఎంపీ పుట్టా మహేశ్పై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ […]
Date : 18-03-2026 - 10:57 IST