HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Organises Rythu Deeksha Across State To Continue Protests Demanding Rs 500 Bonus For Paddy

Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.

  • By Praveen Aluthuru Published Date - 04:17 PM, Sat - 6 April 24
  • daily-hunt
Rythu Deeksha
Rythu Deeksha

Rythu Deeksha: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు. పంట నష్టం మరియు వరి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ 110 రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టారన్నారు. “కేసీఆర్ మండుటెండలో ఐదు జిల్లాల రైతులను పరామర్శించగలిగినప్పటికీ, ప్రభుత్వం తన భారీ అధికారిక యంత్రాంగంతో రైతులను రక్షించలేకపోయింది” అని కేటీఆర్ విమర్శించారు. 500 బోనస్ చెల్లించకుండా కాంగ్రెస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కాలయాపన చేస్తుందన్నారు కేటీఆర్. రేపటి నుంచి రాష్ట్రంలోని ప్రతి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట దీక్ష కొనసాగిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

ఎన్నికలకు ముందు రైతు బంధు చెల్లింపులను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఈసీకి లేఖలు రాశారని గుర్తు చేసిన కేటీఆర్, రైతులకు ఉద్దేశించిన ఏ ప్రయోజనాన్ని ఆపడానికి బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రయత్నించదని కేటీఆర్ అన్నారు. రైతుబంధు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.7వేల కోట్లు సిద్ధంగా ఉంచుకున్నారని, బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో పంపిణీ చేయలేకపోయారన్నారు.

Rythu Deeksha

Rythu Deeksha

సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గాఢ నిద్ర నుంచి మేల్కొల్పేందుకు రైతు దీక్ష కార్యక్రమం చేపట్టారన్నారు. ”కేబినెట్ మంత్రులెవరూ నష్టపోయిన వ్యవసాయ భూములను సందర్శించలేదు. బీఆర్‌ఎస్‌ను విమర్శించవచ్చు కానీ రైతులకు చెల్లించాల్సినవి చెల్లించాలి’ అని హరీశ్‌రావు అన్నారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ, రైతుబంధు కింద రూ.15వేలు, బోనస్ రూ.500, రైతు కూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు అమలు చేయాలని డిమాండ్ చేసిన హరీశ్‌రావు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కనీసం అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.

We’re now on WhatsApp. Click to Join

సూర్యాపేటలో రైతు దీక్షలో మాజీ మంత్రి జి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాల్లో కేసీఆర్‌ పర్యటిస్తుండగా, రాష్ట్ర మంత్రివర్గం క్రికెట్‌ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నదని ఎద్దేవా చేశారు. చెన్నూర్‌లో తమ టెంట్‌ను కూల్చివేసి, పార్టీ సామాగ్రి విసిరేసిన పోలీసుల వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read: Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు, కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • farmers
  • harish rao
  • kcr
  • ktr
  • paddy
  • Rs 500 bonus
  • Rythu Deeksha
  • sangareddy
  • Sircilla
  • telangana

Related News

Bandi Sanjay Maganti

Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Maganti Gopinath Assets : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మరోసారి రాజకీయ వాతావరణాన్ని కుదిపే వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తుల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఆస్తి పంపకాల వివాదం చెలరేగిందని ఆయన ఆరోపించారు

  • Private Colleges

    Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Maganti Sunitha

    Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • 42 Percent Reservation

    Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

Latest News

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

  • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • ‎Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd