Telangana
-
#Telangana
El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, రైతులు తొందరపడి వరి నాట్లు వేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటిపోయాయని, సాగునీరు అందించే పరిస్థితి ఏమాత్రం సానుకూలంగా లేదని స్పష్టం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో […]
Date : 20-07-2026 - 10:45 IST -
#Telangana
Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు
తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త డిజిటల్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డెబిట్ కార్డు సైజులో, అత్యాధునిక క్యూఆర్ (QR) కోడ్తో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయి, అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. అత్యంత నాణ్యతతో రూపొందించిన ఈ కార్డుపై కుటుంబ యజమాని ఫొటో, […]
Date : 18-07-2026 - 11:49 IST -
#Telangana
Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయానికి తెరలేపింది. థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్లను వీక్షించే ఫుట్బాల్ అభిమానులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. క్లబ్బులు, బార్లు, మైక్రోబ్రూవరీల మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ […]
Date : 18-07-2026 - 9:24 IST -
#Telangana
Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?
అంతర్జాతీయ వాతావరణ మార్పులు, సూపర్ ఎల్-నినో తీవ్ర ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో రుతుపవనాలు ఊపందుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. గత మే నెలలో సగటున 9.26 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు, ప్రస్తుతం మరింత దిగజారి 9.47 మీటర్ల రికార్డు స్థాయికి పడిపోవడం పట్ల పర్యావరణ వేత్తలు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూమి పొరల్లో ఉన్న తేమ శాతం […]
Date : 16-07-2026 - 11:20 IST -
#Telangana
Ponnam Prabhakar: SIR ప్రక్రియ నత్తనడకన.. గడువు పొడిగించాలని పొన్నం విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ ముగియడానికి గడువు దగ్గర పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 49.28 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ నెల 24వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండగా, మిగిలిన కొద్ది రోజుల్లోనే వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ […]
Date : 15-07-2026 - 1:15 IST -
#Telangana
ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడా అనుసంధానిస్తూ, ఏఐ ప్రమాణాలకు ‘మార్గదర్శక శక్తి’గా నిలుస్తోంది” అని ఆయన అన్నారు. “ది మెరిడియన్ […]
Date : 08-07-2026 - 3:24 IST -
#Telangana
Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్
తెలంగాణలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన దాదాపు 8 లక్షల భూ లావాదేవీలపై నిపుణుల కమిటీ సమగ్ర ఆడిట్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం లావాదేవీలలో దాదాపు 22,000 రిజిస్ట్రేషన్లలో తీవ్రమైన తేడాలు మరియు నిబంధనల ఉల్లంఘనలు […]
Date : 08-07-2026 - 11:06 IST -
#Telangana
Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్తో పాటు తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ సింగరేణికి […]
Date : 07-07-2026 - 4:45 IST -
#Telangana
Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం
తెలంగాణ సంస్కృతి, కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి కేంద్రమైన ములుగు జిల్లాలో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని పురాతన చారిత్రక శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా (National Monument Status) గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయ పరిసర ప్రాంతాలను, దాని పరిధిని ఇకపై “జాతీయ సంపద”గా పరిగణించనున్నారు. ఇప్పటికే ఈ […]
Date : 07-07-2026 - 1:57 IST -
#Speed News
GHMC : పాత జీహెచ్ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్లో కొత్త రూల్స్ ..!
దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.
Date : 05-07-2026 - 3:22 IST -
#Telangana
Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్
అర్హత ఉన్న వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 48 గంటల్లోనే కార్డు జారీ చేసే విధంగా వ్యవస్థను సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, పారదర్శకంగా మరియు వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Date : 05-07-2026 - 2:26 IST -
#Telangana
KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్హౌజ్ను సందర్శిసా : కేటీఆర్
కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
Date : 05-07-2026 - 12:13 IST -
#Telangana
New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ఆసరా పెన్షన్ల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నిజమైన అర్హులైన పేదలకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Date : 05-07-2026 - 10:23 IST -
#Telangana
Anganwadi Jobs: అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!
తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు జిల్లా కలెక్టర్ తీపి కబురు అందించారు. జిల్లాలోని ICDS ప్రాజెక్టుల పరిధిలో సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, […]
Date : 30-06-2026 - 3:00 IST -
#Speed News
Rains : వారం రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్తో […]
Date : 21-06-2026 - 11:03 IST