Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!
- Author : Vamsi Chowdary Korata
Date : 06-07-2026 - 5:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక పూట మాత్రమే భోజనం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. రాత్రి ఏమీ తినకుండా ఉపవాసం ఉంటున్నారు. రాత్రిపూట భోజనం స్కిప్ చేసి, మరుసటి రోజు అల్పాహారం తింటున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట భోజనం మానేస్తే ఏమవుతుంది..?
రాత్రిపూట భోజనం మానేస్తే… నిద్రపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా రాత్రిపూట తినడం మానేస్తే.. ఎన్నో ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్న నిద్రకు భంగం వాటిల్లుతుంది. నిద్ర తగ్గిపోతుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు, అవసరమైన కేలరీలు అందవు. అందుకే నిద్రను నియంత్రించే హార్మోన్లు అయిన సెరోటోనిన్, మెలటోనిన్లను ఉత్పత్తి చేసేందుకు తగిన సంఖ్యలో కేలరీలను పొందడం కష్టమవుతుంది.
న్యూట్రియెంట్స్ జర్నల్ ప్రకారం… పోషకాల లోపం వల్ల కావాల్సినంత నిద్ర ఉండదు. దీనివల్ల నిద్ర సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి లోపిస్తుంది. నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మానసిక స్థితి, శక్తి అనేవి జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. నిద్ర మనస్సును, శరీరాన్ని రీఛార్జ్ చేసేందుకు సహాయపడుతుంది. న్యూరో సైకియాట్రిక్ డిసీజ్ అండ్ ట్రీట్ మెంట్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, తీవ్రమైన నిద్రలేమి శ్రద్ధను ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది.