AP CM Chandrababu Naidu
-
#Andhra Pradesh
ఆ జిల్లాలోనే మరో కొత్త పోర్టు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు !
Dugarajapatnam Port : ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన పోర్టులు 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో పోర్టు నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇదే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మరో పోర్టు ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది. కాగా, ఈ పోర్టుల నిర్మాణం ద్వారా పెట్టుబడులు.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని […]
Date : 30-12-2025 - 12:23 IST -
#Andhra Pradesh
2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !
AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు.. 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు […]
Date : 29-12-2025 - 5:03 IST -
#Andhra Pradesh
బీఎల్వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు బీఎల్వో, సూపర్వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్వోలకు రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బీఎల్వోలకు గౌరవం వేతనం పెంపు ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి […]
Date : 25-12-2025 - 12:34 IST -
#Andhra Pradesh
ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్.. సంక్రాంతికి గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు!
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేయనుండగా, జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించి […]
Date : 24-12-2025 - 10:56 IST -
#Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ నిర్మాణాలకు తక్కువ ధరకే సిమెంట్
ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసే సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ 10 శాతం తగ్గడంతో సిమెంట్ బస్తాపై రూ.19 నుంచి రూ.21 వరకు ఆదా కానుంది. ఏపీ నిర్మాణ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయి. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రవాణా ఖర్చుల వల్ల స్వల్పంగా ధర పెరుగుతుంది. ప్రభుత్వ అవసరాలకు ప్రత్యేక రంగు సంచుల్లో సిమెంట్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీలో సిమెంటు ధరలు సవరిస్తూ ఉత్తర్వులు ఏపీటీపీసీ సరఫరా చేసే సిమెంటు ధరలు […]
Date : 23-12-2025 - 10:29 IST -
#Andhra Pradesh
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని
భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2024 నుంచే ఈ చట్టబద్ధత అమల్లోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్తో చర్చలు జరిగాయని చెప్పారు. అమరావతి రాజధానిగా శాశ్వతమన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని రాజధాని చట్టబద్ధతకు కేంద్రం అంగీకారం […]
Date : 22-12-2025 - 12:00 IST -
#Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం
Koushalam Portal : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది. ‘కౌశలం’ పోర్టల్ ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 24.14 లక్షల మంది యువత వివరాలు సేకరించి, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు అందించింది. మరిన్ని ఉపాధి అవకాశాల కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్షోలు నిర్వహించనుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కల్పనకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏపీలో కౌశలం ద్వారా ఐటీ ఉద్యోగాలు పోర్టల్ […]
Date : 19-12-2025 - 11:48 IST -
#Andhra Pradesh
ప్రభుత్వ సేవలు, పథకాలకు.. ఏపీలో ఆధార్ను మించిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో!
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులపై అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ నాటికి అందించాలని […]
Date : 18-12-2025 - 11:05 IST -
#Andhra Pradesh
AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
AP CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ గ్రామ, వార్డు సచివాలయ […]
Date : 17-12-2025 - 5:47 IST -
#Andhra Pradesh
కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!
Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపికబురు వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో పాల్గొ్న్న చంద్రబాబు.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4 వేల 500 రూపాయల నుంచి 12 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో […]
Date : 17-12-2025 - 9:55 IST -
#Andhra Pradesh
విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?
Infosys : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు పరుగులు తీస్తున్నాయి. విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ శాశ్వత క్యాంపస్ 20 ఎకరాలు […]
Date : 16-12-2025 - 12:07 IST -
#Andhra Pradesh
ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!
Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మునసాగుకు ప్రోత్సాహం డ్వాక్రా, రైతు సంఘాల సభ్యులకు అకాశం ఎకరాకు […]
Date : 16-12-2025 - 10:43 IST -
#Andhra Pradesh
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు!
Pradhan Mantri Ujjwala Yojana : పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో మహిళలకు ఉచితంగా గ్యాస్ […]
Date : 15-12-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషనర్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం […]
Date : 13-12-2025 - 11:18 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్ టూర్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే ఈ పర్యటనలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి పీ4-జీరో పావర్టీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. […]
Date : 08-12-2025 - 2:26 IST