HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababus Key Decisions Cms Gift To 2 5 Lakh People On The Occasion Of Ugadi

చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Author : Vamsi Chowdary Korata Date : 11-03-2026 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Govt
Chandrababu Govt

Ap Cm Chandrababu Naidu  ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులు కూాడా తగ్గిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు సీఎం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు రెండు శుభవార్తలు చెప్పారు. అమరావతిలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు. కలెక్టర్లు ఇకపై క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సహా పథకాలను అమలు చేస్తూ.. పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఉగాది కానుకగారాష్ట్రంలో మొత్తం 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందించాలని.. జూన్‌లో మరికొందరికి ఇళ్లు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్‌ పేరిట ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని.. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూడౌన్‌ చేసిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు మరింత తగ్గిస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రంలో 6 లక్షల సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఉగాదికి దివ్యాంగులకు ఉచిత బస్సు ఇంద్రధనస్సు పేరుతో సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో భూ వివాదాలు ఉండకూడదన్నారు చంద్రబాబు. రెవెన్యూ అధికారులు ఆ దిశగా పనిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి. ఏడాదిలో లక్షా 15వేలమంది పారిశ్రామిక వేత్తల్ని తయారు చేశామని.. ఈ నెల 8న నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమ వేదికపై లక్షమంది పారిశ్రామివేత్తల్ని తయారు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి వెయ్యిమందికి ఒక స్టార్టప్ రావాలన్నాలరు. రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బందులు లేవని.. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 614 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ జులై నాటికి పూర్తి చేసి నీటిని అందిస్తామని ప్రకటించారు. 2027లో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులు ప్రాధాన్యం క్రమంలో పూర్తి చేస్తామని ప్రకటించారు చంద్రబాబు.

జిల్లా కలెక్టర్లు, సీనియర్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్లు 8 రోజులు, సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు ఫీల్డ్ విజిట్లు చేయాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారుల్ని అప్రమత్తం చేయాలన్నారు. కేంద్రం జలవజీవన్ మిషన్ పథకం కాలపరిమితిని పొడిగించిందని.. వచ్చే రెండేళ్లలో జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి అందించాలని సూచించారు. అలాగే పైప్‌లైన్ల కోసం రోడ్లు తవ్వి.. దాన్ని అలాగే వదిలేస్తున్నారని.. ఇది సరికాదన్నారు చంద్రబాబు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • Electricity Charges Reduce
  • Housewarming
  • ugadi

Related News

Local elections in AP: Alliance aims for victory.

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వేడితో వేడెక్కుతోంది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ (SEP/OCT) నెలల్లోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన, భార

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd