Andhrapradesh
-
#Andhra Pradesh
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు […]
Date : 21-02-2026 - 4:53 IST -
#Andhra Pradesh
నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!
Nandamuri Balakrishna హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలకు చెక్ పెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు బాలయ్యపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురంలో సొంతింటి నిర్మాణం తలపెట్టారు బాలకృష్ణ. వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం రోజున ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమే అంటూ విమర్శకులకు కౌంటర్ […]
Date : 21-02-2026 - 4:01 IST -
#Andhra Pradesh
బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స
Acham Naidu Vs Botsa Satyanarayana ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆందోళన చేస్తున్నారని, […]
Date : 19-02-2026 - 1:50 IST -
#Andhra Pradesh
ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి
Andhra Pradesh Earthquake ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి […]
Date : 19-02-2026 - 11:15 IST -
#Andhra Pradesh
గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ
Andhrapradesh Govt ఏపీ ప్రభుత్వం ప్రజలకు, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సహం ఇచ్చేలా వీఎల్టీపై ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం తెలిపారు. నిర్మాణలకు సంబంధించి ఖాళీ స్థలాలపై విధించే పన్నులో 50శాతం రాయితీ ఇస్తారు. గతంలో నిర్మాణాలకు సంబంధించి ఖాళీ స్థలాలపై వంద శాతం పన్ను విధించేవారు. ఇకపై అనుమతులు పొందిన నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకూ 50శాతం పన్ను చెల్లిస్తే చాలు. ఏపీలో ప్రజలు, బిల్డర్లకు భారీ ఊరట వీఎల్టీ 50శాతానికి […]
Date : 19-02-2026 - 11:08 IST -
#Andhra Pradesh
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
Andhrapradesh Govt ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ పాలసీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీఏసీఎస్కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఉద్యోగుల హెచ్ఆర్ సంబంధిత సమస్యల్ని ఈ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ కీలక ఉత్తర్వులు జార చేసిన ఏపీ […]
Date : 18-02-2026 - 10:16 IST -
#Andhra Pradesh
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ
Dhulipalla Narendra పొన్నూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవికి చింతలపూడిలో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర వద్ద ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 సవర్ల బంగారంతో పాటుగా, పది కేజీల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ప్రమీలాదేవి ఫిర్యాదుతో పొన్నూరు రూరల్ పోలీసులు […]
Date : 17-02-2026 - 2:45 IST -
#Andhra Pradesh
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..
Madanapalle అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్బాడీని గుర్తించారు. కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను చంపినట్లు గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం అదృశ్యమైన బాలిక డెడ్బాడీ డ్రమ్ములో కులవర్దన్ అనే […]
Date : 17-02-2026 - 11:15 IST -
#Andhra Pradesh
మందుబాబులకు గుడ్ న్యూస్..
Liquor Bottles మందుబాబులకు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీ బాటిళ్లిస్తే.. డబ్బులిస్తామని తెలిపింది. అయితే ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్నైలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో ఈ బైబ్యాక్ పథకం.. ఉద్యోగుల వ్యతిరేకత నిరసనల కారణంగా ఆగిపోగా.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో తిరిగి ప్రారంభించనుంది. మద్యం బాటిల్ ను కొనుగోలు చేసేటపుడే కస్టమర్ల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తారు. ఆ బాటిల్ ఖాళీ అయ్యాక దానిని టాస్మాక్ […]
Date : 16-02-2026 - 2:51 IST -
#Andhra Pradesh
చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ
Bill Gates ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ […]
Date : 16-02-2026 - 10:57 IST -
#Speed News
నర్సింగ్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
Andhra Pradesh Nursing Admissions 2026–27 బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్యా సంవత్సరంలో నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా నీట్ –యూజీ పరీక్ష […]
Date : 14-02-2026 - 10:42 IST -
#Andhra Pradesh
నేడు ఏపీ బడ్జెట్..
Budget 2026 – 27 నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ఉదయం 11.15 నిమిషాలకు ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ దాదాపు రూ.3.46 లక్షల కోట్లతో ఉండొచ్చంటున్నారు. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీాగా కేటాయింపులు ఉంటాయంటున్నారు. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి […]
Date : 14-02-2026 - 9:33 IST -
#Andhra Pradesh
బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్
Acham Naidu Vs Botsa Satyanarayana వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయిన వైసీపీ నేతలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తుంటే బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని […]
Date : 12-02-2026 - 3:33 IST -
#Andhra Pradesh
ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ
NARA LOKESH రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘సాస్కీ’ […]
Date : 12-02-2026 - 2:35 IST -
#Andhra Pradesh
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ
AP Assembly ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుడిని కలిశారు. అంతకుముందు, శాసనసభలో మంత్రి లోకేశ్, నందమూరి బాలకృష్ణ పక్కపక్కనే కూర్చును […]
Date : 12-02-2026 - 2:28 IST