HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Rail Over Rail Bridge Is Being Constructed In Andhra Pradesh

ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం

  • Author : Vamsi Chowdary Korata Date : 27-12-2025 - 10:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Guntakal Rail Over Rail Bri
Guntakal Rail Over Rail Bridge

కర్నూలు జిల్లాలో రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్, బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. గుంతకల్లు స్టేషన్‌లోకి రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

  • ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం
  • గుంతకల్లు దగ్గర నిర్మాణ పనులు వేగవంతం
  • రూ.350 కోట్లతో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం

కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మాణం చేయనున్నారు. ఈ రైల్ ఓవర్ రైల్ ఫ్లై ఓవర్ నిర్మాణంతో బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసింది. ఈ పైవంతెన సుమారు పది కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని నిర్మాణం పూర్తయితే, బళ్లారి, డోన్ మధ్య రైలు ప్రయాణం చాలా సులభం అవుతుంది. అంతేకాకుండా, గుంతకల్లు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించే రైళ్లకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ పైవంతెన నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.

గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించేందుకు పైవంతెన ప్లాన్ చేశారు. ప్రస్తుతం బళ్లారి, ఆదోని, డోన్, గుత్తి మార్గాల నుంచి వచ్చే రైళ్లు, గూడ్సులు ఒకే మార్గం నుంచి స్టేషన్‌లోకి రావాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది. ఈ రైల్ ఓవర్ రైల్ పైవంతెన నిర్మాణం పూర్తయితే, బళ్లారి, ఆదోని, డోన్ మార్గాల నుంచి వచ్చే కొన్ని రైళ్లు, గూడ్సులు స్టేషన్‌లో ఆగకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి వంతెనను ఇప్పటికే తిరుపతి జిల్లా గూడూరులో నిర్మించారు. మరొకటి విజయవాడలో నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు చిప్పగిరి గుంతకల్లు మధ్యలో నిర్మిస్తే ఇది మూడవ పైవంతెన అవుతుంది. ఈ నిర్మాణంతో రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయని భావిస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల నుంచి రోజూ గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు 58 ఎక్స్‌ప్రెస్, సూపర్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100కుపైగా గూడ్సు రైళ్లు కూడా వస్తుంటాయి. అయితే స్టేషన్‌లో ఏడు ప్లాట్‌ఫారాలు మాత్రమే ఉండటంతో.. గూడ్సులు స్టేషన్‌లో నిలిచిపోవడం వల్ల ప్లాట్‌ఫారాలు ఖాళీగా ఉండటం లేదు. గూడ్సులు స్టేషన్‌లోకి రావడం వల్ల ప్లాట్‌ఫారాలు ఖాళీలేక రైళ్లను స్టేషన్‌ బయట గంటల తరబడి నిలపాల్సి వస్తోంది. ఫలితంగా ఆలస్యం కావడమేకాక రైళ్లలో తరచూ చోరీలు జరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, రైల్వే ఇంజినీర్లు బైపాస్ రైల్వే మార్గాలు, రైల్ ఓవర్ రైల్ వంతెనల నిర్మాణాన్ని సూచిస్తూ నివేదికలు సమర్పించారు. ఈ నిర్మాణాల వల్ల ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులుపడుతున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP railway
  • Guntakal Division
  • kurnool
  • Rail Bridge
  • Rail Over Rail Bridge

Related News

Acham Naidu Vs Botsa Satyanarayana

బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

Acham Naidu Vs Botsa Satyanarayana  వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా

  • Nara Lokesh

    ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

  • Seattle agrees to pay $29 million compensation to Kandula Jahnavi family

    జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

  • Food Safety Officer Inspection guntur

    రెస్టారెంట్లతో తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు..

Latest News

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

  • కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • 5 లక్ష‌ల‌కు పైగా కార్లు రీకాల్‌.. కార‌ణ‌మిదే?!

  • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Trending News

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd