HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Power Supply To The Vijayawada Durga Temple Has Been Suspended

విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!

  • Author : Vamsi Chowdary Korata Date : 27-12-2025 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Durga Temple
Durga Temple

Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు.. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో మూడు గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు సమాచారం.

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం.. విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

జనరేటర్ సాయంతో ఆలయంలో విద్యుత్ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. దీంతో మూడు గంటల అనంతరం విజయవాడ దుర్గ గుడికి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ బిల్లు చెల్లించలేదంటూ ఏపీసీపీడీసీఎల్.. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. శనివారం కరెంట్ సరఫరాను నిలిపివేసింది. 2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి దేవస్థానం కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ బకాయిలు సుమారుగా రూ.3.08 కోట్లు ఉన్నట్లు సమాచారం. విద్యుత్ బకాయిలు చెల్లించాలని పలుమార్లు కోరినప్పటికీ.. దేవస్థానం నుంచి స్పందన లేదని ఏపీసీపీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. దీంతో శనివారం దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు చెప్తున్నారు.

దుర్గ గుడి అధికారుల స్పందన
అయితే ఈ ఘటనపై విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అధికారుల స్పందన మరోలా ఉంది. దుర్గ గుడి అవసరాలకు తాము సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే కరెంట్ వాడుతున్నట్లు చెప్తున్నారు. నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు కోరామని.. అయితే వారు ఈ ఏర్పాటు చేయలేదని చెప్తున్నారు. దీంతో సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్ లెక్కలు తేలటం లేదంటున్నారు.

అప్పారావుపేట, పాముల కాలువ వద్ద ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రెండేళ్లుగా ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా కరెంట్ అందిస్తున్నామని.. బదులుగా విద్యుత్ శాఖ దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తోందన్నారు. ఈ సర్వీసులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని అడుగుతున్నట్లు చెప్తున్నారు.

మరోవైపు దుర్గ గుడి దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారుల మధ్య సంప్రదింపుల తర్వాత మూడు గంటల అనంతరం దుర్గ గుడికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే దుర్గ గుడికి కరెంట్ సరఫరా నిలిపివేయటంపై భక్తులు మండిపడుతున్నారు. కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • durgamma temple vijayawada
  • Electricity Bills Issue
  • Kanaka Durga Temple
  • power supply

Related News

Ap 10th Exam

ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

AP SSC Exams  ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ ప

  • Illegal Affair

    వివాహితను ట్రాప్.. గదికి పిలిపించి యువకుడు.. వామ్మో !

  • Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu

    ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

  • Avinash Reddy

    లోక్‌సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

  • Naidu, Pawan discuss politics, strategies

    సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. అందుకేనా !

Latest News

  • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

  • వారంలో భారీగా తగ్గిన పసిడి ధరలు

  • మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు – భట్టి

  • ‘మధిర అంటే నాకు ప్రాణం’ – భట్టి విక్రమార్క

  • క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

Trending News

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd