HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Campaign On Social Media In The Name Of New Pensions In Ap

ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Bharosa Pension Scheme
Ntr Bharosa Pension Scheme

NTR Bharosa Pension  ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.

  • కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం
  • తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్లికేష్ ఫేక్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే కొత్తxe పింఛన్లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో.. ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఏకంగ ఓ అప్లికేషన్ ఫామ్‌ను కూడా వైరల్ చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల దరఖాస్తులపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ప్రస్తుతం స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సచివాలయాల్లోకొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసే ఆప్షన్ ఇంకా రాలేదు అంటున్నారు. సోషల్ మీడియాలో పింఛన్ల అప్లికేషన్ల పేరుతో ఫేక్‌‌న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌తో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అయితే ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే.. వారి భార్యలకు వితంతు పింఛన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఆ ఆప్షన్ అందుబాటులో ఉందంటున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులపై సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తాము అంటున్నారు. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దంటున్నారు. ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుంది అంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతోంది. అయితే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అనర్హుల్ని గుర్తించే ప్రక్రియ చేపట్టింది.. అనర్హుల లెక్క తెలితే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల్ని స్వీకరించే అవకాశం ఉంటున్నారు. అలాగే కొత్త పింఛన్లకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Fake Applications
  • NTR Bharosa Pension
  • social media

Related News

Chandrababu Naidu

ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు

  ChandraBabu  సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని

  • Balayya Building House In Hindupur

    నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • Andhra Pradesh Earthquake

    ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

  • Minister Narayana

    గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

Latest News

  • డ్రగ్ మాఫియా డాన్ మృతిపై ట్రంప్ సీరియస్ వార్నింగ్

  • ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు.. నరేశ్- పవిత్రల పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..

  • పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్

  • ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

  • పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..

Trending News

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd