India Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్కు ముహూర్తం ఫిక్స్.. ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించనున్న బీసీసీఐ!
రోహిత్ శర్మ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు బీసీసీఐ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సి ఉంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. మే 23, 2025న కొత్త కెప్టెన్ ప్రకటన జరగనుంది.
- By Gopichand Published Date - 07:33 PM, Sat - 10 May 25

India Test Captain: ఐపీఎల్ 2025 సమయంలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హిట్మ్యాన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ నిర్ణయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్ జట్టు కెప్టెన్ (India Test Captain) ఎవరు అనే ప్రశ్న అతిపెద్దదిగా మారింది. అయితే భారత టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్ ప్రకటన ఎప్పుడు జరుగుతుందనే దానిపై పెద్ద అప్డేట్ వచ్చింది.
కొత్త కెప్టెన్ ప్రకటన ఎప్పుడు?
రోహిత్ శర్మ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు బీసీసీఐ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సి ఉంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. మే 23, 2025న కొత్త కెప్టెన్ ప్రకటన జరగనుంది. బీసీసీఐ కొత్త కెప్టెన్ను ప్రకటించడానికి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ను కూడా ప్లాన్ చేసింది. ఐపీఎల్ 2025 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భారత జట్టుకు కొత్త టెస్ట్ కెప్టెన్ లభించనున్నారు. క్రిక్బజ్ ప్రకారం.. ఇంగ్లండ్ పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే ముందే కొత్త టెస్ట్ కెప్టెన్ ప్రకటన జరుగుతుంది.
Also Read: India Pak Ceasefire : తటస్థ వేదికలో భారత్, పాక్ చర్చలు.. అమల్లోకి సీజ్ ఫైర్
ఈ ఆటగాళ్లు కెప్టెన్ రేసులో ముందంజ
రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీని శుభ్మన్ గిల్ స్వీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అతను కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా విషయానికొస్తే.. అతను గతంలో పలు కీలక సిరీస్లు, టోర్నమెంట్ల ముందు గాయాలతో జట్టు నుంచి తప్పుకున్నాడు. అతనికి తరచూ గాయాల సమస్య ఉంది. ఈ కారణంగా అతను కెప్టెన్సీ రేసులో చాలా వెనుకబడి ఉన్నాడు. కెప్టెన్గా ఎంపికయ్యే రేసులో గిల్ పేరు అగ్రస్థానంలో ఉంది. అతను భారత్ తరపున టెస్ట్, వన్డే మ్యాచ్లలో నిరంతరం ఆడుతున్నాడు.
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు
మీడియా వర్గాల ప్రకారం.. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై అతను బీసీసీఐతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ, జట్టు మేనేజ్మెంట్ అతన్ని కొంత సమయం తీసుకుని ఈ నిర్ణయంపై బాగా ఆలోచించాలని సూచించింది. జట్టు మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలో జట్టుతో పాటు వెళ్లాలని కోరుతోంది. ఎందుకంటే అతను జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. ఇంగ్లండ్లో విరాట్ కోహ్లీ గతంలో టెస్ట్ మ్యాచ్లలో భారీ రన్స్ సాధించాడు.