టీ20 వరల్డ్ కప్ ముందు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 07-02-2026 - 2:10 IST
Published By : Hashtagu Telugu Desk
Team India ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
టోర్నమెంట్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారు గణనాథుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు యూఎస్ఏతో జరగనున్న తమ తొలి మ్యాచ్కు ముందు వారు ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్ద టోర్నీలకు ముందు దైవ దర్శనం చేసుకోవడం భారత క్రికెటర్లకు ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం.
టీమిండియా స్పిన్ దళంలో కీలకమైన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీలకమైన మ్యాచ్లకు ముందు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కోసం వారు దైవాన్ని ఆశ్రయించారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, ఈ ప్రార్థనలు తమకు సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆశిస్తోంది. టైటిల్ నిలబెట్టుకునే ప్రయాణంలో యూఎస్ఏపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది.