Cricket Team India
-
#Sports
IND vs IRE: వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో అరంగేట్రం పై నెలకొన్న ఉత్కంఠ
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడి అరంగేట్రం ఐర్లాండ్ సిరీస్లోనే జరగవచ్చని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ దేశంలో నెలకొన్న సామాజిక అశాంతి, అల్లర్లే ఇందుకు కారణమయ్యాయి. ఈ పరిణామాలతో అసలు సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న ఆందోళన మొదలైంది. ఐర్లాండ్లో ప్రస్తుతం నెలకొన్న […]
Date : 12-06-2026 - 10:20 IST -
#Sports
ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానం
ఐసీసీ విడుదల చేసిన తాజా పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక అప్డేట్ తర్వాత కూడా టీమిండియా నంబర్-1 స్థానంలో కొనసాగుతోంది. అయితే రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో పాయింట్ల తేడా మాత్రం కొంత తగ్గింది. అప్డేట్కు ముందు భారత్కు 119 రేటింగ్ పాయింట్లు ఉండగా ఇప్పుడు 118 పాయింట్లకు చేరింది. మరోవైపు న్యూజిలాండ్కు రెండు పాయింట్లు పెరగడంతో ఆ జట్టు 113 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇరు జట్ల […]
Date : 11-06-2026 - 2:59 IST -
#Sports
Harmanpreet Kaur: చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్ కౌర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. ఇంగ్లండ్లోని టాంటన్లో మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఆమె కెరీర్లో 368వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ క్రమంలో న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ (367 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును హర్మన్ప్రీత్ అధిగమించారు. ఈ జాబితాలో సుజీ బేట్స్ రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ […]
Date : 03-06-2026 - 11:21 IST -
#Sports
T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.
టీమిండియాకు మూడు టీ 20 వరల్డ్కప్ టైటిళ్లను అందించిన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఈ ముగ్గురు లెజెండరీ కెప్టెన్లు తొలిసారి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ముగ్గురూ ఫొటో దిగారు. సూర్యకుమార్ యాదవ్ను మధ్యలో ఉంచి ధోనీ, రోహిత్ చెరో వైపు ఉన్నారు. One for […]
Date : 02-05-2026 - 12:56 IST -
#Sports
Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. A 𝗺𝗲𝗴𝗮 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 🔓#TeamIndia vice-captain Smriti Mandhana now has the […]
Date : 18-04-2026 - 2:37 IST -
#Sports
BCCI: టీమిండియా 2026-27 షెడ్యూల్ విడుదల
BCCI Releases Team India’s 2026-27 Schedule భారత క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త అందించింది. 2026-27 సీజన్కు సంబంధించి టీమిండియా స్వదేశంలో ఆడనున్న అంతర్జాతీయ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ను గురువారం ప్రకటించింది. ఈ సీజన్లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్లో పర్యటించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా […]
Date : 26-03-2026 - 4:07 IST -
#Sports
టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్
BCCI టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఏకంగా రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. తద్వారా గతంలో తానే సృష్టించిన రికార్డును బీసీసీఐ బద్దలు కొట్టింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు రూ.125 కోట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను […]
Date : 10-03-2026 - 12:32 IST -
#Sports
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్
Suryakumar Yadav అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడిన జోష్లో ఉన్న టీమ్ ఇండియా, అప్పుడే తన తదుపరి భారీ లక్ష్యాలను ప్రకటించింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆనందంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తర్వాతి ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్లో పసిడి పతకం గెలవడమేనని ఆయన స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మాటల ప్రకారం, 2028వ సంవత్సరం భారత క్రికెట్కు అత్యంత […]
Date : 09-03-2026 - 12:24 IST -
#Sports
భారత్-న్యూజిలాండ్ ఫైనల్ లో 82.2 కోట్ల వ్యూస్.. ఆల్టైమ్ రికార్డ్!
T20 World Cup Final టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్లో సరికొత్త వీక్షకుల రికార్డును సృష్టించింది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడిన సమయంలో ఏకకాలంలో ఏకంగా 74.5 కోట్ల మంది ఈ మ్యాచ్ను వీక్షించి ఆల్టైమ్ రికార్డు నెలకొల్పారు. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా కూడా […]
Date : 09-03-2026 - 12:09 IST -
#Sports
అహ్మదాబాద్లో అడుగుపెట్టిన సూర్య సేన
India vs New Zealand టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు ముందు భారత జట్టు అహ్మదాబాద్కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్పై ఉత్కంఠభరితమైన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అంతేకాదు స్వదేశంలో […]
Date : 07-03-2026 - 11:56 IST -
#Sports
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కి రాజస్థాన్ రాయల్స్ నుంచి బంపర్ ఆఫర్లు!
Gautam Gambhir భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సీఈవో, మెంటర్, భాగస్వామిగా చేరాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే బీసీసీఐ నిబంధనలు, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ఈ ఆఫర్ను స్వీకరించడం కష్టమేనని తెలుస్తోంది. గంభీర్ భవిష్యత్పై ఈ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు గౌతమ్ గంభీర్ బీసీసీఐతో ఒప్పందంలో ఉండటం గమనార్హం. టీమిండియా […]
Date : 17-02-2026 - 12:35 IST -
#Sports
కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
IND VS PAK భారత్ – పాక్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బలమైన పాక్ స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాత్ర చాలా కీలకం. పాక్ స్పిన్ విభాగంలో ఏకంగా 5 ఓవర్లు బ్యాటింగ్ చేసి, అనవసరంగా వికెట్ కోల్పోకుండా సూర్య కుమార్ యాదవ్ చేశాడు. ఈ […]
Date : 16-02-2026 - 10:47 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ ముందు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు
Team India ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. టోర్నమెంట్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారు గణనాథుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు యూఎస్ఏతో జరగనున్న తమ తొలి మ్యాచ్కు ముందు వారు ఈ ఆలయ దర్శనం చేసుకోవడం […]
Date : 07-02-2026 - 2:10 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..
Ms Dhoni టీ20 ప్రపంచ కప్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవబోయే జట్టు ఏదనే దానిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవేనని చెప్పారు. అయితే, అన్ని జట్లలోకి భారత్ […]
Date : 04-02-2026 - 11:54 IST -
#Sports
వైజాగ్ లో దూబే తాండవం 6 సిక్స్లు, 2 ఫోర్లతో ఊచకోత
Shivam Dube న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ – 20లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివమ్ దుబే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, 23 బంతుల్లో 65 పరుగులు సాధించి రికార్డులు సృష్టించాడు. దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగిన దుబే, భారత్ ఓటమిని ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 215 పరుగులు చేయగా.. భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా స్టార్ […]
Date : 29-01-2026 - 12:10 IST