Champions Trophy Tour: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ!
ఇస్లామాబాద్ తర్వాత, ఈ పర్యటన పాకిస్థాన్లోని కరాచీ, అబోటాబాద్చ తక్సిలా వంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరుగుతుంది. దీని తర్వాత ట్రోఫీ ఇతర దేశాల పర్యటనకు వెళ్తుంది.
- By Gopichand Published Date - 08:13 AM, Sun - 17 November 24

Champions Trophy Tour: బీసీసీఐ ఫిర్యాదు మేరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ (Champions Trophy Tour) వేదికను మార్చింది. గతంలో ముజఫరాబాద్, స్కర్దు, హుంజా కాలిలలో ట్రోఫీ పరేడ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ నిరసన వ్యక్తం చేసింది. దీని తర్వాత ఇప్పుడు ఈ స్థలాల స్థానంలో ICC కొత్త వేదికలను ప్రకటించింది. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీపీ తన ‘గ్లోబల్ ట్రోఫీ టూర్’ని ప్రకటించింది. ఇస్లామాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. ఈ ట్రోఫీని ఇస్లామాబాద్లోని దామన్-ఎ-కో, ఫైసల్ మసీదు, పాకిస్థాన్ మెమోరియల్లో ప్రదర్శించనున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
పాకిస్థాన్లోని ఈ నగరాలకు ట్రోఫీ వెళ్తుంది
ఇస్లామాబాద్ తర్వాత, ఈ పర్యటన పాకిస్థాన్లోని కరాచీ, అబోటాబాద్చ తక్సిలా వంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరుగుతుంది. దీని తర్వాత ట్రోఫీ ఇతర దేశాల పర్యటనకు వెళ్తుంది. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐసిసి పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు డిపి వరల్డ్తో కలిసి ట్రోఫీ టూర్ను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈసారి మరపురాని అనుభూతిని పొందుతారని ప్రకటించారు. ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ జనవరి 15 నుంచి 26 వరకు భారత్లో జరగనుంది.
Also Read: Varun Tej : మట్కా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఏంటో తెలుసా.. ఈసారి అలా ట్రై చేస్తున్నాడా..?
పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది
భద్రతా కారణాల రీత్యా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. అప్పటి నుంచి బీసీసీఐ, పీసీబీ మధ్య టెన్షన్ నెలకొంది. మరోవైపు హైబ్రిడ్ మోడల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని పీసీబీ స్పష్టం చేసింది. గతంలో ఆసియా కప్లో కూడా ఇదే మోడల్ను అవలంబించారు. ఈ కాలంలో భారత్ మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి.