HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Special Trains For Kumbh Mela From Vijayawada

Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు

Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

  • By Kavya Krishna Published Date - 12:28 PM, Mon - 30 December 24
  • daily-hunt
Kumbh Mela 2024
Kumbh Mela 2024

Kumbh Mela : ఏపీ ప్రజలకు రైల్వేశాఖ నుండి శుభవార్త. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, విజయవాడ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్‌ (07107) ప్రత్యేక రైలు విజయవాడ మీదుగా నడవనుంది. ఈ ప్రత్యేక రైలు తిరుపతిలో శనివారం రాత్రి 8.55 గంటలకు బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07108 నంబరు రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో బెనారస్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి తిరిగి తిరుపతికి చేరుకుంటుంది.

Pushpa 3 : పుష్ప 3 లో అతను ఉండే ఛాన్స్ లేదా..?

ఈ ప్రత్యేక రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజ మహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

అలాగే, జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో నర్సాపూర్‌-బెనారస్‌ (07109) ప్రత్యేక రైలు కూడా నడవనుంది. ఈ రైలు నర్సాపూర్‌ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07110 నంబరు రైలు జనవరి 27, ఫిబ్రవరి 3 తేదీల్లో బెనారస్‌ నుండి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి నర్సాపూర్‌ చేరుకుంటుంది.

మహా కుంభమేళా, 2025లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగనుంది. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది, భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మోహరించనున్నారు. ప్రజలు కుంభమేళా సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 11 భారతీయ భాషల్లో ఒక ఏఐ చాట్‌బాట్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో, ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించడానికి ప్రత్యేక రైళ్లు ఉంచడం ప్రజలకు బాగా ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

Jimmy Carter : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. ఆయన లైఫ్‌లోని కీలక ఘట్టాలివీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Indian Festivals
  • indian railways
  • Kumbh Mela
  • Kumbh Mela 2025
  • Pilgrims
  • special trains
  • Tirupati-Banaras Train
  • Train Services
  • Uttar pradesh
  • vijayawada

Related News

AP Assembly monsoon session to begin from 18th of this month

AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా చర్యలు, ప్రజలకు చెందిన ప్రధాన సమస్యలు, విధానాల అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయపరంగా కీలకంగా మారనున్నాయి.

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

  • Vijayawada-Bengaluru flight narrowly misses major danger

    Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

  • Health Insurance

    Health Insurance : ఏపీ, తెలంగాణలో బెస్ట్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఇవే..!

Latest News

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd