HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Wife Kills Husband For Asking Him To Turn Down Tv Sound In Ap

ఏపిలో టీవీ సౌండ్‌ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య

  • Author : Vamsi Chowdary Korata Date : 20-02-2026 - 10:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mangalagiri Wife and Husband Incident
Mangalagiri Wife and Husband Incident
Mangalagiri  గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో మొహమ్మద్, క్రాంతి దంపతులు నివసిస్తున్నారు. ఏడాది క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో సౌండ్ ఎక్కువగా ఉందని, తగ్గించమని మొహమ్మద్ తన భార్య క్రాంతికి చెప్పాడు. ఈ చిన్న విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

కొద్దిసేపటికే గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఆవేశానికి లోనైన క్రాంతి, ఇంట్లోని కత్తితో మొహమ్మద్‌పై దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మొహమ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అప్పటికే మృతి చెందిన మొహమ్మద్‌ను గుర్తించారు. నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం టీవీ సౌండ్ విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh crime news
  • AP crime news
  • crime news
  • Domestic Violence
  • Guntur District
  • love marriage
  • mangalagiri
  • mohammad
  • Tidco housing
  • TV sound dispute
  • wife kills husband

Related News

Uttar Pradesh Bulandshahr Triple Murder Accused 'Birthday Boy' Killed in Police Encounter

ముఖానికి కేక్ పూశారని ముగ్గురి స్నేహితుల హత్య..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడిపై రూ.50,000 రివార్డు ఉంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్చి చంపారు. అధికారుల కథనం ప్రకారం ధరౌ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపమని కోరారు. అయ

  • Lokesh Tdpworking

    TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు

Latest News

  • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

  • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

  • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

  • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd