HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >No Compromise On Law And Order Cm Chandrababu

CM Chandrababu: శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు: సీఎం చంద్రబాబు

యూరియా కొరతపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

  • Author : Gopichand Date : 16-09-2025 - 9:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Government
AP Government

CM Chandrababu: ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ యంత్రాంగానికి కీలక దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లను ఉపయోగించి అత్యుత్తమ పనితీరు కనబరచాలని, నేరాలను అదుపు చేయాలని ఆయన సూచించారు.

దుష్ప్రచారాలపై నిఘా అవసరం

యూరియా కొరతపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమెరికా నుంచి 750కి పైగా తప్పుడు పోస్టులు పెట్టి రైతులు-ప్రభుత్వం మధ్య వివాదం సృష్టించేందుకు యత్నించారని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలపై ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ద్వారా ఎప్పటికప్పుడు విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.

క్రైమ్ రేట్‌పై ఆందోళన

గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో క్రైమ్ రేట్ 4 శాతం, సైబర్ క్రైమ్ 16 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, సైబర్ నేరగాళ్ల కంటే పోలీసులు మరింత అధునాతనంగా మారాలని సూచించారు. నెలకు రూ. 30 కోట్ల మేర సైబర్ నేరాల ద్వారా ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో డాగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

Also Read: Super 4 Contest: ఉత్కంఠ‌భ‌రితంగా ఆసియా క‌ప్‌.. టేబుల్ టాప‌ర్స్ ఎవ‌రంటే?

మత్తు పదార్థాలపై కఠిన వైఖరి

డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని, రవాణాను పూర్తిగా అరికట్టేలా నిఘా పెంచాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

కొత్త దర్యాప్తు, పాత కేసుల పునరుద్ధరణ

శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, నేరాలను 50 శాతం తగ్గించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. క్రిమినల్స్‌లో భయం కలిగించడానికి కొందరిని కఠినంగా డీల్ చేయాలని సూచించారు. వివేకా హత్య కేసు వంటి సున్నితమైన కేసులలో నేరస్థులు సాక్ష్యాలను నాశనం చేయడం పెద్ద నేరమని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్ హత్య కేసుల వంటి పాత కేసులను తిరిగి పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తే నేరాల రేటు 30 శాతం తగ్గుతుందని, ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • crime rate
  • nda govt
  • telugu news

Related News

Andhra Pradesh Earthquake

ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

Andhra Pradesh Earthquake  ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వ

  • Minister Narayana

    గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Andhra Pradesh Logo

    ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd