HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababus Key Decisions Cms Gift To 2 5 Lakh People On The Occasion Of Ugadi

చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Author : Vamsi Chowdary Korata Date : 11-03-2026 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Cm Chandrababu Naidu
Ap Cm Chandrababu Naidu

Ap Cm Chandrababu Naidu  ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులు కూాడా తగ్గిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు సీఎం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు రెండు శుభవార్తలు చెప్పారు. అమరావతిలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు. కలెక్టర్లు ఇకపై క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సహా పథకాలను అమలు చేస్తూ.. పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఉగాది కానుకగారాష్ట్రంలో మొత్తం 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందించాలని.. జూన్‌లో మరికొందరికి ఇళ్లు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్‌ పేరిట ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని.. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూడౌన్‌ చేసిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు మరింత తగ్గిస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రంలో 6 లక్షల సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఉగాదికి దివ్యాంగులకు ఉచిత బస్సు ఇంద్రధనస్సు పేరుతో సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో భూ వివాదాలు ఉండకూడదన్నారు చంద్రబాబు. రెవెన్యూ అధికారులు ఆ దిశగా పనిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి. ఏడాదిలో లక్షా 15వేలమంది పారిశ్రామిక వేత్తల్ని తయారు చేశామని.. ఈ నెల 8న నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమ వేదికపై లక్షమంది పారిశ్రామివేత్తల్ని తయారు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి వెయ్యిమందికి ఒక స్టార్టప్ రావాలన్నాలరు. రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బందులు లేవని.. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 614 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ జులై నాటికి పూర్తి చేసి నీటిని అందిస్తామని ప్రకటించారు. 2027లో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులు ప్రాధాన్యం క్రమంలో పూర్తి చేస్తామని ప్రకటించారు చంద్రబాబు.

జిల్లా కలెక్టర్లు, సీనియర్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్లు 8 రోజులు, సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు ఫీల్డ్ విజిట్లు చేయాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారుల్ని అప్రమత్తం చేయాలన్నారు. కేంద్రం జలవజీవన్ మిషన్ పథకం కాలపరిమితిని పొడిగించిందని.. వచ్చే రెండేళ్లలో జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి అందించాలని సూచించారు. అలాగే పైప్‌లైన్ల కోసం రోడ్లు తవ్వి.. దాన్ని అలాగే వదిలేస్తున్నారని.. ఇది సరికాదన్నారు చంద్రబాబు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • Electricity Charges Reduce
  • Housewarming
  • ugadi

Related News

Amaravati

అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Amaravati Velagapudi   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మంటలు చెలరేగటంతో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించ

  • Ap Ev Charging Stations

    ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

  • AI Services In AP Government Hospitals

    ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd