HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Seeks Ecs Intervention To Check Political Violence In Ap

Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు

  • Author : Praveen Aluthuru Date : 19-03-2024 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

Chandrababu: ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. మరో 50 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తోందని, అధికారం పోతుందన్న భయంతో రాజకీయ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.

వైఎస్సార్సీపీ గూండాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. గత రెండు రోజులుగా ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురైన విషయాన్నిప్రస్తావించారు. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ప్రజా గళం సభకు హాజరైనందుకు గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గడికోటకు చెందిన మూలయ్యను దారుణంగా నరికి చంపగా, ఆళ్లగడ్డ సెగ్మెంట్‌లోని చాగలమర్రికి చెందిన 21 ఏళ్ల ఇమామ్ హుస్సేన్ కూడా నిర్దాక్షిణ్యంగా హత్యకు గురయ్యాడని, అలాగే మాచర్లలో టీడీపీ కార్యకర్తల కారుకు నిప్పు పెట్టారని ఆరోపించారు చంద్రబాబు.

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఈ మూడు ఘటనలకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్సీపీ చేస్తున్న హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన చంద్రబాబు, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లు (ఎస్పీలు) అందరూ అధికార యంత్రాంగం పాటలకు డ్యాన్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్పీల మద్దతును సద్వినియోగం చేసుకుని వైఎస్సార్‌సీపీ గూండాలు తమ తమ ప్రాంతాల్లో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతిభద్రతలపై ఎన్నికల సంఘం తక్షణమే దృష్టి సారించాలని, రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ హింసను సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా.. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Anupama: ఆ క్యారెక్టర్లు చేసి బోర్ కొడుతుంది.. అందుకే బోల్డ్ గా నటించా: అనుపమ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • chandrababu
  • CM YS Jagan
  • Election commission
  • Faction
  • Model Code
  • violence

Related News

Political Party Banner

తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభ

  • Renamed Grama Ward Sachival

    AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Latest News

  • నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

  • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

  • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd