Anupama: ఆ క్యారెక్టర్లు చేసి బోర్ కొడుతుంది.. అందుకే బోల్డ్ గా నటించా: అనుపమ
- By Balu J Published Date - 06:53 PM, Tue - 19 March 24
Anupama: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తోన్న డీజే టిల్లు-2లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మాత్రం రొమాన్స్ సీన్లలో నటించినట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో నిలబడాలంటే కచ్చితంగా అందాల ఆరబోత చేయాల్సిందే అనే అనుపమ ఫిక్సయినట్లుంది. డీజే టిల్లు-2 సినిమా నుంచి రీసెంట్గా విడుదలైన ట్రైలర్ పోస్టర్.. ఫస్ట్ లుక్ ఇలా ప్రతి పోస్టర్లో గ్లామర్ షోనే చూపిస్తోంది అనుపమ. బోల్డ్ సీన్లలో నటించడంపై పలువురు ప్రశ్నించగా దీనికి కౌంటర్గానే సమాధానం చెప్పింది అనుపమ పరమేశ్వరణ్. బిర్యానీ ఎంత ఇష్టం ఉన్నా ప్రతిరోజూ తినలేం కదా అని కామెంట్ చేసింది. అదే విధంగా కొన్నేళ్లుగా ఒకే రకమైన క్యారెక్టర్స్ మళ్లీ మళ్లీ చేస్తుంటే ఎవరికైనా బోర్ కొడుతుందని చెప్పింది.
అందుకే టిల్లు స్క్వేర్లో లిల్లి రోల్ చేశానని చెప్పింది. ఈ పాత్రను మిస్ చేసుకుంటే అది తన చెత్త నిర్ణయమే అవుతుందని భావించినట్లు అనుపమ పేర్కొంది. అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నానని వివరణ ఇచ్చింది. అంతేకాదు.. డైరెక్టర్ చెప్పినట్లుగానే సినిమాలో క్యారెక్టర్ కోసం నటించినట్లు అనుపమ పరమేశ్వరణ్ చెప్పింది. రెండేళ్ల కిందట చిన్న సినిమా డీజే టిల్లు సినిమా విడుదలైంది. మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దాంతో.. సీక్వెల్కు ప్లాన్ చేశారు. సీక్వెల్ మరింత బాగా రావాలని..భారీ హిట్గా నిలవాలని ప్రయత్నిస్తున్నారు.
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�