HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Officials Brief Central Team On Flood Damage

Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్‌

Central Team Visits Telangana: కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు.

  • Author : Praveen Aluthuru Date : 11-09-2024 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central Team Visits Telangana
Central Team Visits Telangana

Central Team Visits Telangana: వరద ప్రభావిత జిల్లాలను సందర్శించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం తెలంగాణ(Telangana) లో పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Santhi Kumari)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన విధ్వంసాన్ని వివరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా కేంద్ర బృందం సందర్శించింది.

తెలంగాణాలో పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో పర్యటించి నష్టం అంచనా వేసింది. కేంద్ర బృందంలో ఆర్థిక, వ్యవసాయం, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖలు మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నారు.ఈ బృందం బాధిత ప్రజలను మరియు రాష్ట్ర అధికారులను కూడా కలిసి వివరాలు సేకరించారు.

వరద ప్రభావిత జిల్లాలను సందర్శించేందుకు తెలంగాణకు వచ్చిన ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అపారమైన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 మధ్య కురిసిన అపూర్వ వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జరిగిన అపారమైన నష్టాన్ని సందర్శించిన కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. అత్యంత అప్రమత్తంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని తగ్గించామని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేంద్ర బృందానికి వివరించారు.

ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోగా, ఇళ్లు, పంటలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ వ్యవస్థలకు అపార నష్టం వాటిల్లింది.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సెప్టెంబర్ 6న ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన బాధిత రైతులతో మాట్లాడారు రైతులకు అన్ని విధాలా సాయం అందజేస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు.

Also Read: Padi Kaushik Reddy : కౌశిక్ కు చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Central Team
  • CM Revanth Reddy
  • cs santhi kumari
  • damage
  • floods
  • heavy rains
  • khammam
  • telangana

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

  • Liquor Bottles

    మందుబాబులకు గుడ్ న్యూస్..

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd