HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Officials Brief Central Team On Flood Damage

Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్‌

Central Team Visits Telangana: కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు.

  • Author : Praveen Aluthuru Date : 11-09-2024 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central Team Visits Telangana
Central Team Visits Telangana

Central Team Visits Telangana: వరద ప్రభావిత జిల్లాలను సందర్శించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం తెలంగాణ(Telangana) లో పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Santhi Kumari)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన విధ్వంసాన్ని వివరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా కేంద్ర బృందం సందర్శించింది.

తెలంగాణాలో పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో పర్యటించి నష్టం అంచనా వేసింది. కేంద్ర బృందంలో ఆర్థిక, వ్యవసాయం, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖలు మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నారు.ఈ బృందం బాధిత ప్రజలను మరియు రాష్ట్ర అధికారులను కూడా కలిసి వివరాలు సేకరించారు.

వరద ప్రభావిత జిల్లాలను సందర్శించేందుకు తెలంగాణకు వచ్చిన ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అపారమైన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 మధ్య కురిసిన అపూర్వ వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జరిగిన అపారమైన నష్టాన్ని సందర్శించిన కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. అత్యంత అప్రమత్తంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని తగ్గించామని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేంద్ర బృందానికి వివరించారు.

ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోగా, ఇళ్లు, పంటలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ వ్యవస్థలకు అపార నష్టం వాటిల్లింది.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సెప్టెంబర్ 6న ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన బాధిత రైతులతో మాట్లాడారు రైతులకు అన్ని విధాలా సాయం అందజేస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు.

Also Read: Padi Kaushik Reddy : కౌశిక్ కు చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Central Team
  • CM Revanth Reddy
  • cs santhi kumari
  • damage
  • floods
  • heavy rains
  • khammam
  • telangana

Related News

Ration Shop

రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

E KYC : తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి సన్నబియ్యం కోటా పొందాలంటే.. కార్డులోని సభ్యులందరూ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. గడువులోపు వేలిముద్రలు వేయని వారికి రేషన్ నిలిపివేస్తామని.. 5 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపునిచ్చామని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుదారులకు అలర్ట్ డిసెంబర్ 31లాస్ట్ డేట్ ఈ కేవైసీ చేయించుకోకుంటే సన్నబియ్యం కట్ తెలంగాణలోని రేష

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • Sp Balasubrahmanyam Statue

    ఎస్పీ శైలజ హౌస్‌ అరెస్ట్, రవీంద్రభారతి లో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ!

  • Tpcc Chief Mahesh Goud

    తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

Latest News

  • తిరిగి సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు.. సీఈఓ ప్రకటన

  • యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి.. బంగారు చీరను అగ్గిపెట్టెలో పెట్టి సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు

  • జీపీఎస్ ట్రాకింగ్‌తో స‌ముద్ర ప‌క్షి.. చైనా ప‌నేనా?!

  • మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి

  • ల‌క్నో జ‌ట్టుకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడు దూరం!

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd