CM Revanth Reddy
-
#Telangana
KTR: సీఎం రేవంత్కు కేటీఆర్ వార్నింగ్
తెలంగాణలో ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉద్యోగ ‘నోటిఫికేషన్ల’ స్థానంలో ‘లూటిఫికేషన్లు’ చేస్తున్నారని విమర్శించారు. సరూర్నగర్లో నిర్వహించిన ‘యువ సంగ్రామ’ సదస్సులో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ గుర్తు పెట్టుకో.. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది’’ అని హెచ్చరించారు. ‘‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క. […]
Date : 18-07-2026 - 3:30 IST -
#Telangana
Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు
తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త డిజిటల్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డెబిట్ కార్డు సైజులో, అత్యాధునిక క్యూఆర్ (QR) కోడ్తో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయి, అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. అత్యంత నాణ్యతతో రూపొందించిన ఈ కార్డుపై కుటుంబ యజమాని ఫొటో, […]
Date : 18-07-2026 - 11:49 IST -
#Telangana
Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయానికి తెరలేపింది. థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్లను వీక్షించే ఫుట్బాల్ అభిమానులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. క్లబ్బులు, బార్లు, మైక్రోబ్రూవరీల మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ […]
Date : 18-07-2026 - 9:24 IST -
#Telangana
Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క
తెలంగాణలోని అర్హులైన ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి నూతనంగా అర్హత పొందిన ఒంటరి మహిళలందరికీ కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. ఒంటరి మహిళల పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు, పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను […]
Date : 17-07-2026 - 3:25 IST -
#Telangana
Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు అదిరిపోయే శుభవార్త..
తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి, పరిపాలన సౌలభ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. గ్రామాలకు నిజమైన ఆర్థిక స్వయం ప్రతిపత్తి (Financial Autonomy) కల్పించడమే లక్ష్యంగా పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలు చేయడానికి సర్కార్ సిద్ధమైంది. దీని ద్వారా గ్రామాల్లో అత్యవసర పనులకు నిధుల కొరత లేకుండా వేగంగా పనులు పూర్తి చేసుకునే సువర్ణావకాశం లభించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీలు పన్నుల (ఆస్తి పన్ను, నల్లా పన్ను […]
Date : 17-07-2026 - 2:35 IST -
#Telangana
Deputy CM Bhatti Vikramarka: నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ భారీ సంక్షేమ పథకాన్ని లాంచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ చరిత్రలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా, కేవలం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఈ స్కీమ్ను తీసుకువస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని […]
Date : 15-07-2026 - 12:25 IST -
#Telangana
Revanth Reddy Cabinet: కాంగ్రెస్లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా (MLCs), ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అద్దంకి దయాకర్ మరియు బల్మూర్ వెంకట్లకు ‘రాష్ట్ర మంత్రి హోదా’ (Cabinet Rank status) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారిద్దరికీ కేబినెట్ మంత్రులకు అందించే అధికారాలు, ప్రొటోకాల్ మరియు ఇతర సదుపాయాలను కల్పించాలని పౌరసంబంధాలు, సాధారణ పరిపాలన శాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. నిజానికి ఈ జీవో (GO) […]
Date : 15-07-2026 - 10:05 IST -
#Telangana
Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఒక కీలకమైన ముందడుగు వేశారు. ఎన్నికలు, రాజకీయం కేవలం పోలింగ్ వరకే పరిమితం కావాలని, రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల అనుమతులు, రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా, బకాయి నిధుల సాధనపై చర్చించేందుకు ఆయన […]
Date : 14-07-2026 - 2:53 IST -
#Andhra Pradesh
Nagarjuna Yadav: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కు 14 రోజుల రిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయనను కఠిన భద్రత మధ్య చంచల్గూడ కేంద్ర కారాగారానికి (జైలుకు) తరలించారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసార చర్చా […]
Date : 14-07-2026 - 11:22 IST -
#Telangana
Harish Rao: బీజేపీతో టచ్లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద్రాద్రి రాముని మీద గానీ, లేదా నీకు రాజకీయ […]
Date : 11-07-2026 - 4:32 IST -
#Telangana
Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, తన పార్టీ శ్రేణులతో కలిసి పోలీసుల […]
Date : 11-07-2026 - 11:28 IST -
#Telangana
Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఖమ్మం జిల్లాలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ (రైతు ఆశీర్వాద సభ) వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లక్ష్యంగా అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల కేటీఆర్ కన్నెపల్లి పంప్హౌస్ ప్రాంతాన్ని సందర్శించి, మేడిగడ్డ బ్యారేజీలో తక్షణమే నీటిని నింపాలని చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ లోపాలతో ఇప్పటికే కుంగిపోయిన మేడిగడ్డలో బలవంతంగా నీటిని నింపాలని చూడటం వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని రేవంత్ […]
Date : 11-07-2026 - 10:52 IST -
#Telangana
Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు
జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా […]
Date : 10-07-2026 - 10:31 IST -
#Telangana
CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు, పంటల సాగు విధానంలో సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా.. మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఇతర ధాన్యాల దిగుమతి విషయంలో తెలంగాణను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, సాంప్రదాయ వరి సాగును పక్కనబెట్టి ప్రత్యామ్నాయ […]
Date : 02-07-2026 - 11:39 IST -
#Telangana
Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల
రైతు భరోసా పథకం కింద రానున్న తొమ్మిది రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.9,000 కోట్లు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన రైతు భరోసా నిధులను విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను సాగు చేయాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాకు అవసరమైన నిధులు అందుబాటులో […]
Date : 01-07-2026 - 9:17 IST