HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Raghunandan Rao Strong Counters To Cm Revanth Reddy Commen%e1%b9%ads

Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఖండించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 21-04-2024 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raghunandan Rao
Raghunandan Rao

Raghunandan Rao: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడడం తగదన్నారు. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (IDPL) కంపెనీలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ కు తీసుకొచ్చారని రేవంత్ అబద్దాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. అయితే 1972లో ఇక్రిశాట్ (ICRISAT), 1964లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)ని, BDLని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1970లో స్థాపించారని చెప్పారు. ఇక . ఇక 1980లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికయ్యారని ఆయన అన్నారు. అలాగే ఐడీపీఎల్ కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుందని, మెదక్ పరిధిలోకి రాదని ఆయన సూచించారు.

అంతేకాకుండా.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెదక్‌కు రైలు మార్గం తెస్తానని ఇందిరాగాంధీ హామీ ఇచ్చారని ఘునందన్‌రావు తెలిపారు. కానీ 40 ఏళ్లుగా నెరవేరని ఇందిరాగాంధీ కలను ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నెరవేర్చారు. కేంద్రం 2016లో రైల్వే లైన్‌ పనులు ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేసింది. “మెదక్‌ రైల్వే స్టేషన్‌ను 2023లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్వయంగా కలిసి ప్రారంభించారు” అని అన్నారు. అదే సమయంలో నిర్మించిన మరో రెండు రైల్వే స్టేషన్లు కాంగ్రెస్ హయాంలో యుపిఎ-1లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే లైన్ కోసం యూనియన్ బడ్జెట్‌లో రూ.330 కోట్లు కేటాయించారు. కానీ దాని కోసం ఒక్క బకెట్ మట్టి కూడా ఎత్తలేదని ఆయన స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

మెదక్‌కు ఎమినెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లు వచ్చాయని, ఇందిరాగాంధీతోనే పారిశ్రామికీకరణ ప్రారంభించామని, ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి చెబుతున్న మాటలు అవాస్తవమన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవడం కోసం ఇందిరా గాంధీ ప్రయత్నించారన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు పంపిణీకి పోలీసులను ఉపయోగించినట్లు ఆధారాలు లభించినా, ఫిర్యాదు వచ్చినా మాజీ సీఎం కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ ను ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డి గతంలో కామారెడ్డిలో ,కొడంగల్‌లో ఓడిపోయినప్పటికీ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అలాంటప్పుడు అదే తనకు ఎందుకు వర్తించదని రఘునందన్ ప్రశ్నించారు. తనను ‘దొర’ కమ్యూనిటీతో గుర్తించడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

Also Read: Baby Powder Vs Cancer : బేబీ పౌడర్ వాడిన మహిళకు రూ.375 కోట్లు.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు కోర్టు ఆర్డర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • CM Revanth Reddy
  • congress
  • elections 2024
  • Indira Gandhi
  • Lok Sabha polls 2024
  • medak
  • Raghunandan Rao
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

  • Purchase Of Grain Telangana

    Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Collector Preeti Singh

    Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd