HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Kcr Bus Yatra In Mahabubnagar Conducts Roadshow For Election Campaign

KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్‌.. మోడీ బడే భాయ్‌: కేసీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

  • By Praveen Aluthuru Published Date - 10:59 PM, Fri - 26 April 24
  • daily-hunt
KCR Bus Yatra
KCR Bus Yatra

KCR Bus Yatra: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌పై విషం చిమ్మడం, ఓట్ల కోసం మరోసారి ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరేమీ చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని బలపరచాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడుతూ… మహబూబ్‌నగర్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉందన్నారు. ఇందులో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రధాన పోటీలో ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానంలో ఉందని చెప్పారు. అయితే బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందే అవకాశం లేదన్నారు కేసీఆర్. పాలమూరు ప్రాంత అభివృద్ధికి ఆమె చేసిందేమీ లేదని అన్నారు. గడచిన 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. మోదీ ఈ ప్రాంత ప్రజలకు అత్యంత అన్యాయం చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయలేదని, వరి సేకరణలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించిందని ఫైర్ ఆయాయ్రు ఆయన.

We’re now on WhatsApp. Click to Join

మోడీ ప్రభుత్వం 7 మండలాలను తెలంగాణా నుండి లాక్కొని ఆంధ్రాకి ఇచ్చిందని గుర్తు చేశారు కేసీఆర్. అంతేకాకుండా 400MW పవర్ ప్లాంట్‌ని లాక్కొని ఆంధ్ర ప్రదేశ్ కి ఇచ్చింది. నాటి కాంగ్రెస్‌లో ఉన్న మంత్రి డీకే అరుణ తెలంగాణ వాటా నీటిని లాక్కోవాలని ఆంధ్రా నాయకులను వదిలి ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై అప్పట్లో విషం చిమ్మి ఇప్పుడు సిగ్గులేకుండా ఓట్లు అడుక్కుంటున్నారని విమర్శించారు. 9 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మనం శాంతియుతంగా జీవించామని, ఎలాంటి మత హింసాకాండ జరగలేదని ముస్లిం సోదరులు గుర్తుంచుకోవాలి. కానీ బీజేపీ పార్టీకి ఓటేస్తే మతతత్వ శక్తులు గెలిచే ప్రమాదం ఉంది. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయండి’ అని మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ అన్నారు.

Also Read: KCR Bus With Lift: కేసీఆర్ బస్సుకు లిఫ్ట్.. డిజైన్ మాములుగా లేదుగా..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • bus yatra
  • CM Revanth Reddy
  • congress
  • DK Aruna
  • election campaign
  • kcr
  • Mahabub Nagar
  • pm modi
  • telangana

Related News

Cm Revanth Reddy

CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.

  • Tensions in India-US relations: Modi absent from UN meetings!

    PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Kavitha Comments Harish

    Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

Latest News

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd