Hyderabad: రాహుల్ గాంధీ నీకు దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్..
తెలంగాణాలో ఎన్నికలు వేడి మొదలైంది. మూడు నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఈ సారి తెలంగాణాలో ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు కొనసాగనుంది.
- By Praveen Aluthuru Published Date - 10:48 AM, Mon - 25 September 23
Hyderabad: తెలంగాణాలో ఎన్నికలు వేడి మొదలైంది. మూడు నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఈ సారి తెలంగాణాలో ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు కొనసాగనుంది. ఇక మజ్లీస్ అధికార పార్టీకి కొమ్ముకాస్తుందన్న విమర్శలు ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై కాంగ్రెస్ విమర్శిస్తూ వస్తుంది. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అన్నారు
ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని అధిష్టించేందుకు రెండు పార్టీలు కసరత్తు చేస్తుండడంతో తెలంగాణలో కాంగ్రెస్, ఏఐఎంఐఎం మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నెల మొదట్లో తెలంగాణలోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఏఐఎంఐఎం ఐక్యంగా పనిచేస్తున్నాయని, ఈ మూడు పార్టీలతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై కాదు బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎంలతో కలిసి పోరాడుతోంది. తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటున్నా సరే, ఆ మూడు పార్టీలు ఒకటేనని రాహుల్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మరియు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై సిబిఐ-ఈడీ కేసులు లేవని, ప్రధాని నరేంద్ర మోడీ వారిని తన సొంత వ్యక్తులుగా భావిస్తున్నారని రాహుల్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, కాంగ్రెస్ ఆరు హామీలను ప్రకటించి హీట్ పెంచింది. తాము అధికారంలోకి వస్తే వాటిని నెరవేరుస్తామని పార్టీ బలంగా చెబుతుంది.
Also Read: Raja Singh Suspension: రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత?
Tags
Related News
INDIA Alliance: జూన్ 4న బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు
త్వరలో భారత కూటమి అధికారంలోకి వస్తుందని, బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని కూటమి భావిస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి లక్నోలో సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు