YSR Congress Party
-
#Andhra Pradesh
అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… 18 రోజుల పాటు రాజమండ్రి […]
Date : 21-02-2026 - 2:57 IST -
#Andhra Pradesh
మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం
ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్పై విసిరివేయడంపై ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని సభ్యులు ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి చిత్రాలను ప్లకార్డులుగా ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి […]
Date : 20-02-2026 - 12:23 IST -
#Andhra Pradesh
బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స
Acham Naidu Vs Botsa Satyanarayana ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆందోళన చేస్తున్నారని, […]
Date : 19-02-2026 - 1:50 IST -
#Andhra Pradesh
బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్
Acham Naidu Vs Botsa Satyanarayana వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయిన వైసీపీ నేతలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తుంటే బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని […]
Date : 12-02-2026 - 3:33 IST -
#Andhra Pradesh
శ్రీశైలం ప్రసాదంలో రసాయనాలు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
Srisailam Prasadam ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. బాత్రూమ్లో క్లీన్ చేసే కెమికల్స్తో చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీశైలం ప్రసాదం తయారీలో కూడా కల్తీ నెయ్యినే ఉపయోగించారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సమయంలో..చంద్రబాబు శ్రీశైలం ప్రసాదం తయారీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాలను […]
Date : 06-02-2026 - 4:27 IST -
#Andhra Pradesh
జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్
Jogi Ramesh మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి నివాసంపై దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, జోగి రమేశ్ ను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాసేపట్లో జగన్ బయల్దేరనున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లేందుకు పోలీసులకు వైసీపీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా […]
Date : 06-02-2026 - 11:15 IST -
#Andhra Pradesh
ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ
Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య అమరావతిలో జరిగిన కీలక భేటీ ముగిసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పక్షాల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా, వైసీపీ అనుసరిస్తున్న వైఖరి పైనే ఈ […]
Date : 04-02-2026 - 5:13 IST -
#Andhra Pradesh
వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Janasena Mlc Naga Babu వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కడితే జగన్ కనీసం ట్వీట్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడేవారికి.. అయోధ్యలో రామమందిరం గురించి తమ స్టాండ్ ఏమిటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ జగన్పై నాగబాబు విమర్శలు గుప్పించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడా అంటూ వీడియో విడుదల చేశారు. […]
Date : 04-02-2026 - 2:53 IST -
#Andhra Pradesh
లోక్సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి ఆవేదన
Avinash Reddy పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో చికెన్ ధరల అంశం చర్చకు వచ్చింది. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్రంలో చికెన్ ధరల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. అసలు ఈ ధరలు పెరిగినట్లు ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. పౌల్ట్రీ రైతుల కోసం కేంద్రం రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, బీమా చర్యలు తీసుకుంటుందా అని అడిగారు. ఒకవేళ కేంద్రం చర్యలు తీసుకోకపోతే […]
Date : 04-02-2026 - 10:53 IST -
#Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. అందుకేనా !
Andhra Pradesh ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు ఉదయం 10.40 […]
Date : 04-02-2026 - 10:19 IST -
#Andhra Pradesh
ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
Vijayasai Reddy Attends To ED Investigation ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఏ5 నిందితుడిగా చేర్చిన సంగతి […]
Date : 22-01-2026 - 12:35 IST -
#Andhra Pradesh
పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
YS Jagan Announces Padayatra మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన చేశారు. బుధవారం రోజున ఏలూరు నియోజకవర్గం నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఎప్పటి నుంచి చేపడతాననే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర రోజులు ప్రజల్లో ఉంటానని తెలిపారు. ఇకపై ప్రతి శనివారం కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో […]
Date : 21-01-2026 - 5:09 IST -
#Andhra Pradesh
నేను జగన్ మనిషినా.. దమ్ముంటే చర్చకు సిద్ధం .. ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి ఓపెన్ ఛాలెంజ్
Bolisetty Satyanarayana VSRetired IPS Officer AB Venkateswara Rao రాజధాని అమరావతి విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అమరావతిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం.. దీనికి కారణమైంది. ఈ కేసుల కారణంగానే అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగిందని ఏబీవీ అన్నారు. అయితే ఏబీవీ వ్యాఖ్యలపై బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు కూతలు ఆపాలని.. దమ్ముంటే […]
Date : 21-01-2026 - 3:24 IST -
#Andhra Pradesh
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి విజయసాయి […]
Date : 17-01-2026 - 12:19 IST -
#Andhra Pradesh
సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భారీ ఊరట స్కిల్ డెవలెప్మెంట్ కేసు మూసివేత […]
Date : 13-01-2026 - 2:29 IST